| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 7 |
| Pages | 57 |
| Read Time | 63 Minutes |
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
సర్వ మేత త్తపో మూలం కవయః పరిచక్షతే,
నహ్యేతప్తతపా మూఢః క్రియాఫల మవాప్యతే. 1
ఇది యంతయు తపస్సే కీలకముగా కలది యని మేధావులు చెప్పుచుందురు. తపమును పండించుకొనని మూఢుడు క్రియాఫలమును పొందడు.
ప్రజాపతి రిదం సర్వం తపసైవాసృజ త్ప్రభుః,
తథైవ వేదా నృషయ స్తపసా ప్రతిపేదిరే. 2
ప్రజాపతి దీనినంతటిని తపస్సుచేతనే సమర్థుడై సృజించెను. అట్లే మంత్రద్రష్టలు తపస్సు చేతనే వేదములను పొందిరి.
తపసైన ససర్జాన్నం ఫలమూలాని యాని చ,
త్రీన్ లోకాన్ తపసా సిద్ధాః పశ్యన్తి సుసమాహితాః. 3
తపస్సుచేతనే అన్నమును సృజించెను. పండ్లను దుంపలను సృజించెను. తపస్సు సిద్ధి పొందినవారు చెదరని బుద్ధి కలవారై మూడు లోకములను దర్శింతురు.
ఔషధా న్యగదాదీని క్రియాశ్చ వివిధా స్తథా,
తపసైవ హి సిద్ధ్యన్తి తపోమూలం హి సాధనమ్. 4
ఔషధములు, ఆరోగ్యములు, వేరువేరు చికిత్సలు తపస్సుచేతనే సిద్ధించును. సాధన మంతటికి తపస్సే కుదురు.
యద్దురాపం భవేత్కించి త్తత్సర్వం తపసో భవేత్,
ఐశ్వర్య మృషయః ప్రాప్తి స్తపసైవ న సంశయః. 5
పొందనలవికానిది యే కొంచె మున్నను ఆదియంతయు తపస్సు వలన సిద్ధించును. ఋషులు తపస్సు చేతనే ఐశ్వర్యమును పొందిరి. సంశయము లేదు.
సురాపోఽసంమతా దాయీ భ్రూణహా గురుతల్పగః,
తపసైవ సుతప్తేన నరః పాపా త్ప్రముచ్యతే. 6
మద్యము త్రావువాడు, ఇతరుల సొమ్ములను కొల్లగొట్టువాడు, భ్రూణహత్యలు చేయువాడు, గురుభార్యను చెరచువాడును అగు నరుడు చక్కగా చేసిన తపస్సు చేతనే ఆ పాపము నుండి విడివడును.
తపసో బహురూపస్య తై స్తై ర్వారైః ప్రవర్తతః,
నివృత్త్యా వర్తమానస్య తపో నానశనాత్పరమ్. 7
పెక్కురూపములు కలదియు, ఆయా ద్వారములతో ప్రవర్తించునదియు, ఇహ సుఖములనుండి మరలిన స్వభావముతో నివృత్తి నడుచున్నట్టిదియు నగు తపస్సు యొక్క తుదిమెట్టు ఉపవాసము. దానిని మించినది లేదు.
అహింసా సత్యవచనం దాన మిన్ద్రియ నిగ్రహః,
ఏతేభ్యో హి మహారాజ తపో నానశనా త్పరమ్. 8
అహింస, సత్యభాషణము, దానము, ఇంద్రియ నిగ్రహము ఈ అన్నింటికంటెను మించినది ఉపవాసము. దానికంటె మించినది లేదు.
న దుష్కరతరం దానా న్నాతిమాతర మాశ్రమః,
త్రైవిద్యేభ్యః పరం నాస్తి సంన్యాసః పరమం తపః. 9
దానము కంటె దుష్కరతరము మరియొకటి లేదు. తల్లిని దాటిపోయెడు ఆశ్రమము లేదు. మూడు వేదములను పుక్కిట బట్టినవానిని మించిన పండితుడు మరొకడు లేడు. సంన్యాసము మిక్కిలి శ్రేష్ఠమగు తపస్సు.
ఇన్ద్రియాణీహ రక్షన్తి స్వర్గ ధర్మాభిగుప్తయే,
తస్మా దర్థే చ ధర్మే చ తపో నానశనాత్పరమ్. 10
స్వర్గధర్మమును చక్కగా కాపాడుకొనుటకై ఇంద్రియములను రక్షించుకొందురు. అందువలన ధర్మమునందును, అర్థమునందును తపస్సు ఉపవాసవ్రతముకంటె మించినది లేదు.
ఋషయః పితరో దేవా మనుష్యా మృగపక్షిణః,
యాని చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ. 11
తపః పరాయణాః సర్వే సిద్ధ్యన్తి తపసా చ తే,
ఇత్యేవం తపసా దేవా మహత్త్యం ప్రతిపేదిరే. 12
ఋషులు, పితృదేవతలు, దేవతలు, మనుష్యులు, చివరకు పశువులు పక్షులును, ఇంకను స్థావరములు, జంగమములు నగు భూతములన్నియు తపస్సే చివరి దిక్కుగా కలిగినట్టివి. తపస్సుచేతనే అన్నియు ఏర్పడినవి. ఈవిధముగనే దేవతలు తపస్సుతో గొప్పతనమును సాధించిరి.
ఇమా నీష్టవిభాగాని ఫలాని తపసః సదా,
తపసా శక్యతే ప్రాప్తుం దేవత్వ మపి నిశ్చయాత్. 13
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి తపః ప్రశంసాయాం
ఏకషష్ట్యధిక శతతమోఽధ్యాయః
ఇవియన్నియు తపస్సునకు ఇష్టమైన విభాగములు గల ఫలములు. ఈ నిశ్చయమును బట్టి తపస్సుచేత దేవత్వమును గూడ పొందనగును.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున తపస్సు మహిమను
వర్ణించు నూట అరువది యొకటవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు అనెను.
సత్యం ధర్మం ప్రశంసన్తి విప్రర్షి పితృదేవతాః,
సత్య మిచ్ఛా మ్యహం శ్రోతుం తన్మే బ్రూహి పితామహ, 1
తాతా! విద్యావేత్తలు, ఋషులు, పితృదేవతలు అందరును సత్యమునే ధర్మముగా కొనియాడుదురు. సత్యమును గూర్చి వినగోరుచున్నాను. దానిని నాకు తెలియ జెప్పుము.
సత్యం విలక్షణం రాజన్ కథం వా తదవాప్యతే,
సత్యం ప్రాప్య భవేత్కించ కథం చైవ తదుచ్యతామ్. 2
రాజా! సత్యము విలక్షణమైనది. దానిని పొందుటయెట్లు? పొందినచో అగునదేమి? అది యెట్లుండును? దీనిని నాకు తెలియజేయుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
చాతుర్వర్ణ్యస్య ధర్మాణాం సంకరో నప్రశస్యతే,
అవికారితమం సత్యం సర్వవర్ణేషు భారత. 3
నాలుగు వర్ణముల వారి ధర్మములు కలగాపులగమై పోవుట మంచిది కాదు. అన్ని వర్ణములయందును ఏవిధమైన వికారము లేకుండునట్టిదియే సత్యము.
సత్యం సత్సు సదా ధర్మః సత్యం ధర్మః సనాతనః,
సత్య మేవ నమస్యేత సత్యం హి పరమా గతిః. 4
సజ్జనులయందు సత్యమే సర్వకాలములకు సంబంధించిన ధర్మము. అది సనాతనమగు ధర్మము. సత్యమునే అందరు నమస్కరింతురు. సత్యమే పరమగతి.
సత్యం ధర్మ స్తపో యోగః సత్యం బ్రహ్మ సనాతనమ్,
సత్యం యజ్ఞః పరః ప్రోక్తః సర్వం సత్యే ప్రతిష్ఠితమ్. 5
సత్యమే ధర్మము. తపస్సు, యోగము, సత్యము సనాతనమగు బ్రహ్మము. సత్యము అన్నిటికంటె మిన్న యగు యజ్ఞము. సత్యమునందే సర్వము పాదుకొని యున్నది.
ఆచారా నిహ సత్యస్య యథావ దను పూర్వశః,
లక్షణం చ ప్రవక్ష్యామి సత్యస్యేహ యథాక్రమమ్. 6
క్రమముగా సత్యము యొక్క ఆచారములను, లక్షణమును వక్కాణింతును.
ప్రాప్యతే చ యథా సత్యం తచ్చ శ్రోతు మిహార్హసి,
సత్యము నెట్లు సాధింపవలయునో కూడ నీవు వినదగును.
సత్యం త్రయోదశవిధం సర్వలోకేషు భారత. 7
సత్యం చ సమతా చైవ దమశ్చైవ న సంశయః,
అమాత్సర్వం క్షమా చైవ హ్రీ స్తితిక్షాఽనసూయతా. 8
త్యాగో ధ్యాన మథార్యత్వం ధృతిశ్చ సతతం దయా,
అహింసా చైవ రాజేన్ద్ర సత్యాకారా స్త్రయోదశ. 9
లోకములన్నింటి యందును సత్యము పదుమూడు విధము లైనట్టిది. సత్యము, సమత, దమము, మాత్సర్యము లేకుండుట, సహనము, సిగ్గు, కష్టములు కలిగినపుడు తట్టుకొనగలుగుట, అసూయ లేకుండుట, త్యాగముననుసంధించుట, పెద్దమనిషితనము, గుండెదిటవు, దయ, అహింస అను నీ పదుమూడును సత్యము ఆకారములు.
సత్యం నామావ్యయం నిత్య మవికారి తథైవ చ,
సర్వధర్మావిరుద్ధేన యోగే నైత దవాప్యతే. 10
సత్యమనగా మార్పులు లేనిది. నిత్యమైనది. వికారములు పొందనిది. సర్వధర్మములకు విరుద్ధము కాని యోగముతో దానిని పొందనగును.
ఆత్మ నీష్టే తథానిష్టే రిపౌ చ సమతా తథా,
ఇచ్ఛాద్వేషం క్షయం ప్రాప్య కామక్రోధక్షయం తథా. 11
తనయందు ఇష్టునియందు, అనిష్టునియందు, శత్రువునందు ఒకే విధముగా నుండుట సమత. కోరికలయందు వెగటును, లేదా వానిని చంపుకొనుటను, కామక్రోధములను రూపుమాపుటను పొంది దీనిని సాధింప నగును.
దమో నాన్యస్పృహా నిత్యం గాంభీర్యం ధైర్యమేవ చ,
అభయం రోగశమనం జ్ఞానే నైత దవాప్యతే. 12
ఇతరములయందు స్పృహ లేకుండుట, మనసునందలి భావములు ఇతరులకు తెలియరానీకుండుట, బుద్ధిసంపదతో రమించుట, అభయము, రోగముల నణచివేయుట అనునది దమము. దీనిని జ్ఞానముచేత పొందనగును.
అమాత్సర్యం బుధాః ప్రాహు ర్దానే ధర్మేచ సంయమః,
అవస్థితేన నిత్యం చ సత్యే నామత్సరీ భవేత్. 13
దానమునందును, ధర్మమునందును మనస్సును అదుపున నుంచుకొనుటను పండితులు అమాత్సర్య మందురు. ఎల్లవేళల ఒకేవిధముగా తొణుకు బెణుకులు లేని నిలుకడ గల సత్యము చేత అమత్సరి యగును.
అక్షమాయాః క్షమాయాశ్చ ప్రియాణీహాప్రియాణి చ,
క్షమతే సంమతః సాధుః సాధ్వాప్నోతి చ సత్యవాక్. 14
సహనము చూపరాని విషయమునందు, చూపదగు విషయములందును ప్రియములను, అప్రియములను ఇష్టపూర్వముగా సహించువాడే సాధువు. అట్టి సాధుస్థితిని సత్యవాక్కు పొందును. (ఇది క్షమలక్షణము)
కల్యాణం కురుతే బాఢం ధీమా న్న గ్లాయతే క్వచిత్,
ప్రశాంత వాఙ్మనా నిత్యం హ్రీస్తు ధర్మా దవాప్యతే. 15
మంచిపనులు మిక్కిలిగా బుద్ధిశక్తితో చేయుచుండును. ఎందును క్రుంగిపోవడు. ప్రశాంతమైన వాక్కు, మనసు కలిగియుండును. దానిని ‘హ్రీ’ అందురు. అది ధర్మము వలన పొందనగును.
ధర్మార్థ హేతోః క్షమతే తితిక్షా క్షాంతిరుచ్యతే,
లోకసంగ్రహణార్థం వై సా తు ధైర్యేణ లభ్యతే. 16
ధర్మార్థముల కొరకు ఏ కష్టము నైనను సహించును. అది లోకము నాకట్టుకొనుట కగును. ఆ సహనభావమునే ‘తితిక్ష యందురు. దానిని ధైర్యముతో సాధింపనగును.
త్యాగః స్నేహస్య యత్త్యాగో విషయాణాం తథైవ చ,
రాగద్వేష ప్రహీణస్య త్యాగో భవతి నాన్యథా. 17
స్నేహమును, విషయములను (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము లందలి ఇష్ట భావమును) వదలుటయే ‘త్యాగము’. రాగద్వేషములను మొదలంట పెకలించిన వానికి మాత్రమే త్యాగము సిద్ధించును. మరియొక విధమున కాదు.
ఆర్యతా నామ భూతానాం యః కరోతి ప్రయత్నతః,
శుభం కర్మ నిరాకారో వీతరాగ స్తథైవ చ. 18
సర్వభూతములకు పనివడి, ఆర్భాటము లేకుండ, రాగబుద్ధిని వదలి వైచి శుభమైన పనిని ఆచరించుటయే ‘ఆర్యత’.
ధృతి ర్నామ సుఖే దుఃఖే యథా నాప్నోతి విక్రియామ్,
తాం భజేత సదా ప్రాజ్ఞో య ఇచ్ఛేద్ భూతి మాత్మనః. 19
సుఖమునందును, దుఃఖమునందును వికారమును పొందకుండుట ‘ధృతి’. ప్రజ్ఞ గల నరుడు ఎల్లప్పుడు తనకు సుస్థితిని కోరువాడై దానిని సేవింపవలయును.
సర్వథా క్షమిణా భావ్యం తథా సత్యపరేణ చ,
వీతహర్షభయక్రోధో ధృతి మాప్నోతి పణ్డితః. 20
మనుజు డెల్లవేళల సహనముతో నుండవలయును. సత్యమే పరమమైనదిగా పాటించువాడు కావలయును. పొంగుట, క్రుంగుట, క్రోధము అనువానిని సమూలముగా వదలివేయవలయును. ఇట్టి ‘ధృతి’ని వివేకవంతుడు పొందును.
అద్రోహః సర్వభూతేషు కర్మణా, మనసా, గిరా,
అనుగ్రహశ్చ దానం చ సతాం ధర్మః సనాతనః. 21
చేష్టతో, మనసుతో, మాటతో సర్వభూతములయందును ద్రోహబుద్ధి లేకుండుటయే ‘అహింస.’ అనుగ్రహము, దానము అనునవి సత్పురుషుల సనాతన మగు ధర్మము.
ఏతే త్రయోదశాకారాః పృథక్ సత్యైక లక్షణాః,
భజన్తే సత్య మేవేహ బృంహయన్తే చ భారత. 22
ఇవి పదుమూడును వేరువేరుగా సత్యమను దాని లక్షణములే. ఇవి సత్యమునే సేవించును. సత్యమునే పెనుపొందజేయును.
నాన్తః శక్యో గుణానాం చ వక్తుం సత్యస్య పార్థివ,
అతః సత్యం ప్రశంసన్తి విప్రాః స పితృదేవతాః. 23
పార్థివా! సత్యము గుణముల అంతమును చెప్పుటకు సాధ్యము కాదు. అందువలననే విప్రులు, పితృదేవతలు సత్యమునే ప్రశంసింతురు.
నాస్తి సత్యా త్పరో ధర్మో నానృతా త్పాతకం పరమ్,
శ్రుతి ర్హి సత్యం ధర్మస్య తస్మా త్సత్యం న లోపయేత్. 24
సత్యము కంటె మించిన ధర్మము లేదు. అనృతమును మించిన పాతకము లేదు. ధర్మమునకు సత్యమే వేదము. అందువలన సత్యమునకు లోపము రానీయరాదు.
ఉపైతి సత్యా ద్ధానం హి తథా యజ్ఞాః సదక్షిణాః,
త్రేతాగ్నిహోత్రం వేదాశ్చ యే చాన్యే ధర్మనిశ్చయాః. 25
ఈ సత్యమువలన దానము, దక్షిణలతో కూడిన యజ్ఞములు, మూడు అగ్నిహోత్రములు, వేదములు, ఇంకను గల ధర్మ నిశ్చయములు - ఈ అన్నింటిని మానవుడు పొందును.
అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్,
అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 26
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధిర్మ పర్వణి
సత్య ప్రశంసాయాం ద్విషష్ట్యధిక శతతమోఽధ్యాయః
వేయి అశ్వమేధములను, సత్యమును తులయందు ఉంచిరి. అశ్వమేధముల వేయింటి కంటె సత్యమే బరువు తూగినది.
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున సత్యప్రశంస కల నూట అరువది రెండవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరాజిట్లు పలికెను.
యతః ప్రభవతి క్రోధః కామో వా భరతర్షభ,
శోకమోహౌ విధిత్సా చ పరాసుత్వం చ తద్వద. 1
క్రోధము, కామము, శోకమోహములు, విధిత్స, పరాసుత అనునవి దేనివలన కలుగునో భరతవరేణ్యా! దానిని వివరింపుము.
లోభో మాత్సర్య మీర్ష్యాచ కుత్సాసూయా కృపా భయమ్,
ఏత త్సర్వం మహాప్రాజ్ఞ యాథాతథ్యేన మే వద. 2
లోభము, మాత్సర్యము, ఈర్ష్య, జుగుప్స, జాలి, భయము ఇదియంతయు దేనివలన కలుగునో ఉన్నదున్నట్లు నాకు తెలియజెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
త్రయోద శైతేఽతిబలాః శత్రవః ప్రాణినాం స్మృతాః,
ఉపాసన్తే మహారాజ సమన్తాత్ పురుషా నిహ. 3
ఈ పదుమూడును ప్రాణులకు మిక్కిలి బలము గల శత్రువులు. మహారాజా! ఇవి మానవులను ఇచట అంటి పెట్టుకొని యుండును.
ఏతే ప్రమత్తం పురుష మప్రమత్తా స్తుదన్తి చ,
వృకా ఇవ విలుమృన్తి దృష్ట్వైవ పురుషం బలాత్. 4
ఇవి ప్రమాదపడెడు నరుని ఏమాత్రము ప్రమాదము లేనివై పీడించుచుండును. చూచినంతనే తోడేళ్లవలె బలాత్కారముగా పురుషుని పీకుకొని తినుచుండును.
ఏభ్యః ప్రవర్తతే దుఃఖ మేభ్యః పాపం ప్రవర్తతే,
ఇతి మర్త్యో విజానీయాత్ సతతం పురుషర్షభ. 5
దీనివలన దుఃఖము ఏర్పడుచున్నది. దీనివలన పాపము ప్రవర్తిల్లుచున్నది. అని మానవుడు నిరంతరము తెలిసికొనుచుండవలయును.
ఏతేషా ముదయం స్థానం క్షయం చ పృథివీపతే,
హన్త తే కథయిష్యామి క్రోధస్యోత్పత్తి మాదితః. 6
దీని పుట్టుక, స్థితి, నాశనము అనువానిని, క్రోధము ఉత్పత్తి మొదలుకొని నీకు చెప్పెదను.
యథాతత్త్వం క్షితిపతే తదిహైకమనాః శృణు,
లోభాత్ర్కోధః ప్రభవతి పరదోషై రుదీర్యతే.
క్షమయా తిష్ఠతే రాజన్ క్షమయా వినివర్తతే, 7
దీని తత్త్యమును రాజా! చెప్పెదను. చెదరని మనస్సుతో వినుము.
లోభమువలన క్రోధము మొలకెత్తును. అది ఇతరుల దోషములు కానరాగా పెంపొందును. ఓరిమి చేత నిలిచిపోవును. ఓరిమిచేత మరలి పోవును. (1)
సంకల్పాజ్జాయతే కామః సేవ్యమానో వివర్ధతే.
యదా ప్రాజ్ఞో విరమతే తదా సద్యః ప్రణశ్యతి. 8
భావన చేయుట వలన కామము పుట్టును. అనుభవించుచున్న కొలది పెరుగుచుండును. ప్రజ్ఞ కలవాడై దాని నుండి విరమించునపు డది అప్పటికప్పుడు నశించును. (2)
పరాసూయా క్రోధలోభా వన్తరా ప్రతిముచ్యతే. 9
దయయా సర్వభూతానాం నిర్వేదా ద్వినివర్తతే,
అవద్య దర్శనా దేతి తత్త్వజ్ఞానాచ్చ ధీమతామ్. 10
ఇతరులయందు అసూయ క్రోధమువలననో అసూయవలననో బయలుదేరును. అన్ని ప్రాణులయందును దయవలనను, నిర్వేదము వలనను వెనుదిరిగి పోవును. ఇతరుల యందలి తప్పులను చూచుటవలన పుట్టును. ధీమంతులకు తత్వజ్ఞానము వలన అణగి పోవును. (3)
అజ్ఞాన ప్రభవో మోహః పాపాభ్యాసా త్ప్రవర్తతే,
యదా ప్రాజ్ఞేషు రమతే తదా సద్యః ప్రణశ్యతి. 11
మోహము అజ్ఞానమువలన పుట్టునట్టిది. పాపములను అలవాటుగా చేయుటవలన కొనసాగుచుండును. నరుడు ప్రజ్ఞగలవారిసముదాయములో మనస్సును ఆనందపరచుకొనుట కలవాటు పడినపుడు అది వెనువెంటనే తుడిచి పెట్టుకొని పోవును. (4)
విరుద్ధా నీహ శాస్త్రాణి యే పశ్యన్తి కురూద్వహ,
విధిత్సా జాయతే తేషాం తత్త్వజ్ఞానా న్నివర్తతే. 12
శాస్త్రములను విరుద్ధములనుగా చూచువారికి విధిత్స పుట్టును. తత్వమును
మెలకువతో తెలియుటవలన అది వెనుదిరిగి పోవును. (5)
ప్రీత్యా శోకః ప్రభవతి వియోగా త్తస్య దేహినః,
యదా నిరర్థకం వేత్తి తదా సద్యః ప్రణశ్యతి. 13
ఒక వస్తువునందలి, లేదా వ్యక్తియందలి ప్రేమ చేత దాని వియోగమువలన నరునకు శోకము పుట్టును. అది పనికిమాలినదని ఎరిగినంతనే నశించును. (6)
పరాసుతా క్రోధలోభా దభ్యాసాచ్చ ప్రవర్తతే,
దయయా సర్వభూతానాం నిర్వేదా త్సా నివర్తతే. 14
తప్పుడుపనులయందు మిక్కిలిగా తగులుకొనుట క్రోధలోభములవలనను, అభ్యాసమువలనను మొదలగును. సర్వభూతములయందలి దయవలనను, నిర్వేదమువలనను అది మరలిపోవును. (7)
సత్యత్యాగాత్తు మాత్సర్య మహితానాం చ సేవయా,
ఏతత్తు క్షీయతే తాత సాధూనా ముపసేవనాత్. 15
సత్యమును వదలి వేయుటవలనను, మేలుకోరనివారిని సేవించుటచేతను మాత్సర్యము ఏర్పడును. సజ్జనులను వదలక సేవించుటవలన అది క్షీణించును. (8)
కులజ్ఞానా త్తథైశ్వర్యా న్మదో భవతి దేహినామ్,
ఏభి రేవ తు విజ్ఞాతైః స చ సద్యః ప్రణశ్యతి. 16
దేహము గలవారికి, తన కులమును గూర్చి మిక్కిలిగా భావించుటవలనను, ఐశ్వర్యమువలనను మదము పుట్టును. చక్కగా తెలియవచ్చిన వీనిచేతనే అది శీఘ్రముగా రూపుమాసిపోవును. (9)
ఈర్ష్యా కామా త్ప్రభవతి సంహర్షాచ్చైవ జాయతే,
ఇతరేషాం తు సత్త్వానాం ప్రజ్ఞయా సా ప్రణశ్యతి. 17
కామమువలనను, ఊరక పొంగిపోవుటవలనను ఈర్ష్య పుట్టును. ఇతర ప్రాణుల తెలివితేటలను గుర్తించునపు డది నశించును (10)
విభ్రమా ల్లోకబాహ్యానాం ద్వేష్యై ర్వాక్యై రసంమతైః,
కుత్సా సంజాయతే రాజన్ లోకాన్ ప్రేక్ష్యాఽ భిశామ్యతి. 18
లోకమునకు వెలియైన వారి మిడిసిపాటువలనను ఇష్టములు కాని, ద్వేషింపదగిన మాటలవలనను జుగుప్స కలుగును. లోకులను సరిగా చూచుటవలన నది అణగిపోవును. (11)
ఇతి కర్తుం న శక్తాయే బలస్థాయాపకారిణే,
అసూయా జాయతే తీవ్రా కారుణ్యా ద్వినివర్తతే. 19
బలవంతుడు, కీడు చేయనున్నవాడునగు వ్యక్తికి ప్రతీకారము చేయలేని వారికి అసూయ తీవ్రముగా పుట్టును. కారుణ్యము వలన మరలును. (12)
కృపణాన్ సతతం దృష్ట్వా తతః సంజాయతే కృపా,
ధర్మనిష్ఠాం యదా వేత్తి తదా శామ్యతి సా కృపా. 20
దీనులను ఎల్లవేళల చూచుట వలన ‘జాలి’ అనునది పుట్టును. ధర్మనిష్ఠ నెరిగినపుడు ఆ కృప అణగారును.
అజ్ఞాన ప్రభవో లోభో భూతానాం దృశ్యతే సదా,
అస్థిరత్వం చ భోగానాం దృష్ట్వా జ్ఞాత్వా నివర్తతే. 21
ప్రాణులకు అజ్ఞానమువలన పుట్టునదై లోభము కన్పట్టుచున్నది. భోగములు నిలుకడగా నుండకపోవుటను చూచి, తెలిసికొని అది మరలిపోవును.
ఏతాన్యేవ జితాన్యాహుః ప్రశమాచ్చ త్రయోదశ,
ఈ పదమూడును శాంతమైన స్వభావమువలన గెలువబడినవగునని పెద్దలు చెప్పుదురు.
ఏతే హి ధార్తరాష్ట్రాణాం సర్వే దోషా స్త్రయోదశ,
త్వయా సత్యార్థినా నిత్యం విజితా జ్యేష్ఠ సేవనాత్. 22
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
లోభనిరూపణే త్రిషష్ట్యధిక శతతమోఽధ్యాయః
ధృతరాష్ట్రుని కుమారులకు ఈ దోషములు పదుమూడును - అన్నియు - నున్నవి. సత్యమును మాత్రమే కోరుకొనెడు నీవు నిత్యము పెద్దలను సేవించుటవలన వీనిని గెలిచితివి.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున లోభమును నిరూపించు నూట అరువది మూడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
ఆనృశంస్యం విజానామి దర్శనేన సతాం సదా,
నృశంసా న్న విజానామి తేషాం కర్మచ భారత. 1
సజ్జనులను చూచుటచేత ఆనృశంస్యమును చక్కగా ఎరుగుదును. భారతా! నృశంసులను, వారి చేష్టను విశేషించి యెరుగను. (ఆనృశంస్యము - క్రూరత్వము
లేనితనము)
కణ్టకాన్ కూప మగ్నిం చ వర్ణయన్తి యథా నరాః,
తథా నృశంసకర్మాణం వర్ణయన్తి నరా నరమ్. 2
ముళ్లను, నూతిని, నిప్పును నరులు తొలగించుకొనుచు తిరుగుదురు. అట్లే క్రూరకార్యములు చేయు నరుని కూడ తొలగద్రోయుదురు.
నృశంసో హి దహేద్వ్యక్తం ప్రేత్య చేహ చ భారత,
తస్మాత్త్వం బ్రూహి కౌరవ్య తస్య ధర్మవినిశ్చయమ్. 3
క్రూరుడు బట్టబయలుగా, ఇందును, పరలోకమునందును (జనులను) మాడ్చివేయును. కురువరా! అందువలన వాని విషయమున ధర్మనిర్ణయమును గూర్చి నీవు నాకు వివరింపుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లనెను.
స్పృహా స్యా ద్గర్హితా చైవ విధిత్సా చైవ కర్మణామ్,
ఆక్రోష్టా క్రుశ్యతే చైవ వఞ్చితో బుద్ధ్యతే స చ. 4
దత్తానుకీర్తి ర్విషమః క్షుద్రో నైకృతికః శఠః,
అసంవిభాగీ మానీ చ తథా సఙ్గీ వికత్థనః. 5
సర్వాతిశఙ్కీ పురుషో బలీశః కృపణోఽథ వా,
వర్గ ప్రశంసీ సతత మాశ్రమద్వేష సఙ్కరీ. 6
హింసావిహారః సతత మవిశేషగుణాగుణః,
బహ్వలోకీ మనస్వీ చ లుబ్ధోఽత్యర్థం నృశంసకృత్. 7
క్రూరుని ఆశపోతుతనమును, పనులను చేయగోరుతనమును నిందింప దగినవి యగును. వాడు అందరిని కారుకూతలు కూయుచుండును. వాని నందరు నిందింతురు. నేనిట్టి కరకుపనులు చేసినచో దైవము నా నెత్తి నణచునని తెలిసియు పాపపు పనులు చేయుచుండును.
ఇచ్చినదానిని గూర్చి చెప్పుకొనుచునేయుండును. పరులయందు సమభావము కలిగియుండడు. నీచకార్యములవాడు, నమ్మించి మోసము చేయుచుండును. శఠుడు. ఇతరులకు ఇసుమంతయు పంచియీయడు. తన్నుతాను గొప్పగా భావించును. తగులములు కలవాడగును. తన్నుతాను పొగడుకొనును.
అందరిని మిక్కిలిగా శంకించుచుండును. కాకివలె మోసపుచూపులు కలవాడు. దీనుడుగా కన్పట్టును. మంది పొగడ్తలను కోరుచుండువాడు. ఎల్లప్పుడు ఆశ్రమములను ద్వేషించుచుండును. సంకరము చేయుచుండును.
హింసతో విహరించును. మంచిచెడులను ఒక్కటిగానే తలచును. పదిమందిని పరికింపడు. పొగరుబోతై, స్వార్థపరుడై క్రూరకర్మములను విచ్చలవిడిగా చేయుచుండును.
ధర్మశీలం గుణోపేతం పాప మిత్యవగచ్ఛతి,
ఆత్మశీలప్రమాణేన న విశ్వసితి కస్యచిత్. 8
ధర్మశీలుడు, గుణములు కలవాడునగు వానిని పాపాత్మునిగా భావించును. తన శీలమునే కొలబద్దగా పెట్టుకొని ఎవ్వనిని నమ్మకుండును.
పరేషాం యత్ర దోషః స్యాత్తద్గుహ్యం సంప్రకాశయేత్,
సమానేష్వేవ దోషేషు వృత్త్యర్థ ముపఘాతయేత్. 9
గుట్టుగా ఉంచవలసిన ఇతరుల దోషమును బట్టబయలుచేయును. తన దోషములు ఇతరులదోషములతో సమానములయినప్పుడు తన బ్రదుకుతెరువు కోసము వానిని చేయుచునే యుండును.
తథోపకారిణం చైవ మన్యతే వఞ్చితం పరమ్,
దత్వా పి చ ధనం కాలే సంతపత్యుపకారిణే. 10
అప్పటికి ఉపకారము చేయువానిని వంచితునిగా భావించును. అప్పటికి ఉపకారికి ధనమొసగియు లోపల కుమిలి పోవుచుండును.
భక్ష్యం పేయ మథాలేహ్యం యచ్చాన్య త్సాధు భోజనమ్,
ప్రేక్షమాణేషు యోఽశ్నీయా న్నృశంస మితి తం వదేత్. 11
తిండి వస్తువులు, పానీయములు, రుచికరమైన లేహ్యములు, మరియు తక్కిన మంచి భోజనము మొదలగువానిని, ఇతరులు చూచుచుండగా (వారికి కొంచెమైన పెట్టక) మెక్కుచుండు వానిని నృశంసు డనవలయును.
బ్రాహ్మణేభ్యః ప్రదాయాగ్రం యః సుహృద్భిః సహాశ్నుతే
స ప్రేత్య లభతే స్వర్గ మిహ చానన్త్య మశ్నుతే. 12
బ్రహ్మజ్ఞానసంపన్నులకు ముందుగా అన్నమొసగి చెలిమికాండ్రతో కలిసి అన్నము తినువాడు మరణించిన పిదప స్వర్గమును పొందును. ఇచట అనంతమైన సుఖమును అనుభవించును.
ఏష తే భరతశ్రేష్ఠ నృశంసః పరికీర్తితః,
సదా వివర్జనీయో హి పురుషేణ విజానతా. 13
ఇతి శ్రీమహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి
నృశంసాఖ్యానే చతుఃషష్ట్యధిక శతతమోఽధ్యాయః
భరతశ్రేష్ఠా! ఈ విధముగా క్రూరుడెట్టివాడో చెప్పితిని. అట్టివానిని, తెలివిగల మనుజుడు ఎల్లప్పుడు వదలివేయవలయును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున నృశంసుని గూర్చిన కథనము గల నూట అరువది నాలుగవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లనెను.
హృతార్థో యక్ష్యమాణశ్చ సర్వవేదాన్తగశ్చ యః,
ఆచార్య పితృకార్యార్థం స్వాధ్యాయార్థ మథాపి చ. 1
ఏతే వై సాధవో దృష్టా బ్రాహ్మణా ధర్మభిక్షవః,
నిఃస్వేభ్యో దేయ మేతేభ్యో దానం విద్యా చ భారత. 2
ధనము కోల్పోయినవాడు, యజ్ఞముచేయుచున్నవాడు, వేదాంతము లన్నింటిని తుదిముట్ట నధ్యయనము చేసినవాడు, ఆచార్యులయు, పితృదేవతలయు పనులకొరకును, వేదము నభ్యసించుటకును ప్రయత్నించు వాడును. అగు ఇట్టివారు, సాధువులు, ధర్మభిక్షుకులు ధనములేనివారై కానవచ్చినచో అట్టివారికి దక్షిణను విద్యను ఈయదగును.
అన్యత్ర దక్షిణాదానం దేయం భరతసత్తమ,
అన్యేభ్యోఽపి బహిర్వేది చాకృతాన్నం విధీయతే. 3
ఇతర సందర్భములందు వారికి దక్షిణాదానమును చేయదగును. బ్రహ్మజ్ఞానుల కంటెను ఇతరులకును యజ్ఞవేదికి వెలుపల, వండని యన్నము నొసగదగును.
సర్వరత్నాని రాజా హి యథార్హం ప్రతిపాదయేత్,
రాజు అన్నిశ్రేష్ఠమగు వస్తువులను వారివారి యోగ్యతకు తగినవిధముగా బ్రాహ్మణులకు సమర్పింపవలయును.
బ్రాహ్మణా ఏవ వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణాః.
అన్యోన్యం విభవాచారా యజన్తే గుణతః సదా. 4
బ్రాహ్మణులే వేదములు. పెక్కుదక్షిణలు గల యజ్ఞములు. సంపదకు తగిన ఆచారములు కలవారై గుణములను బట్టి ఎల్లప్పుడు ఒకరికొకరు తోడ్పడుకొనుచు యజ్ఞములు చేయుచుందురు.
యస్యత్రైవార్షికం భక్తం పర్యాప్తం భృత్యవృత్తయే
అధికం చాపి విద్యేత స సోమం పాతు మర్హతి. 5
మూడు సంవత్సరములకాలము భృత్యులను భరించుటకు తగినంత అన్నము కలవాడు, అంతకంటెను ఎక్కువ కలవాడును, సోమపానము చేయుట కర్హుడగును.
యజ్ఞ శ్చే త్ప్రతిరుద్ధః స్యా దంశే నైకేన యజ్వనః,
బ్రాహ్మణస్య విశేషేణ ధార్మికే సతి రాజని. 6
యో వైశ్యః స్యా ద్బహుపశు ర్హీనక్రతు రసోమపః,
కుటుంబాత్తస్య తద్విత్తం యజ్ఞార్థం పార్థివో హరేత్. 7
యజ్ఞము చేయువాని, విశేషించి బ్రాహ్మణుని యజ్ఞము ఒక అంశము మిగిలియుండగా ధనములేక ఆగిపోయినయెడల, ఆ రాజు ధార్మికుడైనచో తనదేశము నందలి వైశ్యుడు, పెక్కుగోవులు కలవాడు, యజ్ఞములు చేయనివాడు, సోమపానము చేయనివాడు నై యున్నచో అతని కుటుంబమునుండి ఆ ధనమును ఆ యజ్ఞముకొరకు గ్రహింపవలయును.
ఆహరే దథ నో కిఞ్చి త్కామం శూద్రస్య వేశ్మనః,
న హి యజ్ఞేషు శూద్రస్య కిఞ్చిదస్తి పరిగ్రహః. 8
రాజు శూద్రునినుండి యింటినుండి కోరినదానిని ఏ కొంచెము కూడ యజ్ఞముకొరకు తీసికొనరాదు. ఏలయన శూద్రుని పరిగ్రహము యజ్ఞములందు ఉపయోగపడునది ఏదియును లేదు. (పరిగ్రహము సంబంధించిన వస్తువు)
యోఽనాహితాగ్నిః శతగు రయజ్వా చ సహస్రగుః,
తయో రపి కుటుంబాభ్యా మాహరే దవిచారయన్. 9
నూరుగోవులున్నవాడై అగ్నిహోత్రములను నిత్యము నర్చింపనివాడును, వేయి గోవులుకలవాడై యజ్ఞము చేయనివాడును అగువారి కుటుంబములనుండి రాజు ధనమును సంకోచము లేకుండ గ్రహింపదగును.
అదాతృభ్యో హరే ద్విత్తం విఖ్యాప్య నృపతిః సదా,
తథై వాచరతో ధర్మో నృపతేః స్యా దథాఖిలః. 10
రాజు ఎల్లవేళల దానబుద్ధిలేని వారి ధనమును, అందరకు తెలియజెప్పి, హరింపవలయును. అట్లైననే ఆతడు రాజుధర్మమును మొత్తముగా ఆచరించిన వాడగును.
తథైవ శృణు మే భక్తం భక్తాని షడనశ్నతః,
అశ్వస్తనవిధానేన హర్తవ్యం హీనకర్మణః. 11
కర్మములు చేయక మూడురోజులు ఉపవాసమున్నవాని ఒక పూట భోజనమును (ధాన్యమును) రేపటికి ఉండనిది అనుపద్ధతితో రాజు హరింపవలయును - ఈ నామాటను ఆలకింపుము.
ఖలాత్ క్షేత్రా త్తథారామా ద్యతో వా ప్యుపపద్యతే,
ఆఖ్యాతవ్యం నృపస్యైతత్ పృచ్ఛతే ఽ పృచ్ఛతేఽపి వా.
న తస్మై ధారయే ద్దణ్డం రాజా ధర్మేణ ధర్మవిత్, 12
కళ్లమునుండి గాని, పొలమునుండి గాని, తోటలనుండి గాని ధాన్య మెచటనుండి పొందదగిన దైనను దానినిగూర్చి రాజు అడిగినను అడుగకున్నను, చెప్పవలయును. ధర్మమెరిగిన రాజు ధర్మముతో అట్లుచెప్పిన వానికి దండము నొసగరాదు.
క్షత్రియస్య తు బాలిశ్యాద్ బ్రాహ్మణః క్లిశ్యతే క్షుధా,
శ్రుతశీలే సమాజ్ఞాయ వృత్తి మస్య ప్రకల్పయేత్. 13
క్షత్రియుని పిల్లచేష్టలవలననే బ్రహ్మవేత్త ఆకలితో నలిగిపోవును. విద్యను, శీలమును చక్కగా తెలిసికొని ఆతనికి బ్రదుకుతెరువును కల్పింపవలయును.
అథైనం పరిరక్షేత పితా పుత్ర మివౌరసమ్. 14
అటుపిమ్మట అతనిని, తండ్రి కన్నబిడ్డను వలె, కాపాడవలయును.
ఇష్టిం వైశ్వానరీం నిత్యం నిర్వపే దబ్ద పర్యయే,
అనుకల్పః పరో ధర్మో ధర్మవాదైస్తు కేవలమ్. 15
ప్రతిసంవత్సరము చేయవలసిన ఆగ్రయణము, పశుసోమము మొదలగువానిని చేయకుండినపుడు ‘వైశ్వానరి’ అను యజ్ఞము నాచరింపవలయును. ఇది పరమధర్మమని ధర్మజ్ఞులు చెప్పుదురు.
విశ్వై ర్దేవైశ్చ సాధ్యైశ్చ బ్రాహ్మణైశ్చ మహర్షిభిః,
ఆపత్సు మరణా ద్భీతై ర్విధిః ప్రతినిధీకృతః. 16
విశ్వులనబడు దేవతలు, సాధ్యులు, బ్రాహ్మణులు, మహర్షులు ఆపదలయందు మరణమువలన భయపడినచో ఈ అనుకల్పమును విధిని ప్రతినిధిగా (ఆయా యజ్ఞకర్మములకు బదులుగా) చేయుదురు.
ప్రభుః ప్రథమ కల్పస్య యోఽనుకల్పేన వర్తతే,
న సామ్పరాయికం తస్య దుర్మతే ర్విద్యతే ఫలమ్. 17
మొదటివిధిని ఆచరించుటకు సమర్థుడయ్యును, రెండవవిధిని ఆచరించు దుర్మతికి పరలోక సంబంధమగు ఫలము కలుగదు.
న బ్రాహ్మణో నివేదేత కిఞ్చి ద్రాజని వేదవిత్,
స్వవీర్యా ద్రాజవీర్యాచ్చ స్వవీర్యం బలవత్తరమ్. 18
వేదముల నెరిగిన బ్రాహ్మణుడు రాజుకడ తన్నుగూర్చి ప్రత్యేకముగా చెప్పికొనరాదు. రాజుశక్తి కంటె బ్రహ్మజ్ఞాని శక్తి అధికమైనది.
తస్మాద్రాజ్ఞః సదా తేజో దుఃసహం బ్రహ్మవాదినామ్,
కర్తా శాస్తా విధాతా చ బ్రాహ్మణో దేవ ఉచ్యతే. 19
తస్మి న్నాకుశలం బ్రూయా న్న శుష్కా మీరయే ద్గిరమ్.
కావున ఎల్లవేళల రాజునకు బ్రహ్మవేత్తల తేజస్సు సహింపనలవి కానిది. అందువలన బ్రహ్మజ్ఞుడు కర్త, శాసించువాడు, విధించువాడు, దేవుడు అని నుతి కెక్కుచున్నాడు. అతని విషయమున క్షేమము కాని దానిని, పొల్లుమాటను పలుకరాదు.
క్షత్రియో బాహువీర్యేణ తరే దాపద మాత్మనః.
ధనై ర్వైశ్యశ్చ శూద్రశ్చ మన్త్రై ర్హోమైశ్శ వై ద్విజః. 20
క్షత్రియుడు తన చేతుల సత్తువతోడను, వైశ్యుడును, శూద్రుడును ధనములతోడను, బ్రాహ్మణుడు మంత్రములతోడను హోమములతోడను తమతమ ఆపదలను దాటుకొనవలయును.
నైవ కన్యా న యువతి ర్నామన్త్రజ్ఞో న బాలిశః,
పరివేష్టాగ్ని హోత్రస్య భవే న్నాసంస్కృత స్తథా. 21
కన్య, యువతి, మంత్రములనెరుగనివాడు, పిల్లతనపుచేష్టలవాడు, సంస్కారములు పొందనివాడును అగ్నిహోత్రమునకు పరివేష్ట కారాదు.
నరకం నిపతన్త్యే తే జుహ్వానాః స చ యస్య తత్,
తస్మా ద్వైతాన కుశలో హోతా స్యా ద్వేద పారగః. 22
ఇట్టివారు హోమమునందు ఆహుతులు వేయుచు (వేసినచో) నరకమున పడిపోవుదురు. ఆ యజమానుడును పడును. అందువలన యజ్ఞవిధియందు నేర్పుగలవాడు, వేదము తుదిముట్ట నభ్యసించినవాడు మాత్రమే ‘హోత’ కావలయును.
ప్రాజాపత్య మదత్వా శ్వ మగ్న్యాధేయస్య దక్షిణామ్,
అనాహితాగ్ని రితి స ప్రోచ్యతే ధర్మదర్శిభిః. 23
అగ్నిని ఆరాధించుటకొరకు ఏర్పరచుకొన్నవాడు ప్రజాపతికి సంబంధించిన అశ్వరూపమైన దక్షిణను ఒసగని యెడల ధర్మమును దర్శించిన వృద్ధులు అట్టివానిని ‘అనాహితాగ్ని’ నిగా అభివర్ణింతురు.
పుణ్యాని యాని కుర్వీత శ్రద్దధానో జితేన్ద్రియః,
అనాప్తదక్షిణై ర్యజ్ఞై ర్న యజేత కథఞ్చన. 24
శ్రద్ధకలవాడై, ఇంద్రియములపై పట్టుకలవాడై మనుజుడు పుణ్యకర్మముల నాచరింపవలయును. తగిన దక్షిణలులేని యజ్ఞముల నెన్నటికిని చేయరాదు.
ప్రజాః పశూంశ్చ స్వర్గం చ హన్తి యజ్ఞో హ్యదక్షిణః,
ఇన్ద్రియాణి యశః కీర్తి మాయు శ్చాప్యవకృన్తతి. 25
సరియగు దక్షిణలు లేని యజ్ఞము సంతానమును, పశువులను, స్వర్గమును, ఇంద్రియములను, యశస్సును, కీర్తిని, ఆయువును తెగగోసి వేయును.
ఉదక్యా మాసతే యే చ ద్విజాః కేచి దనగ్నయః,
హోమం చాశ్రోత్రియం యేషాం తే సర్వే పాపకర్మిణః. 26
ముట్టుదానిని కలియువారు, అగ్నిహోత్రముల నర్చింపనివారు, వేదవిహితము కాని హోమము కలవారు నగు బ్రాహ్మణులు అందరు పాపకర్ములు.
ఉదపానోదకే గ్రామే బ్రాహ్మణో వృషలీపతిః,
ఉషిత్వా ద్వాదశసమాః శూద్రకర్మైవ గచ్ఛతి. 27
బ్రాహ్మణుడు శూద్రవనితకు మగడై నూతినీరే ఆధారమైన పల్లెకొంపలో పండ్రెండేండ్లు నివసించినచో శూద్రకర్మమునే పొందును.
అభార్యాం శయనే బిభ్ర చ్భూ ద్రం వృద్ధం చ వై ద్విజః,
అబ్రాహ్మణం మన్యమాన స్తృణే ష్వాసీత పృష్ఠతః,
తథా సంశుద్ధ్యతే రాజన్ శృణు చాత్ర వచో మమ. 28
భార్యకాని వ్యక్తిని ప్రక్కలో నుంచుకొనువాడు, సేవక ధర్మము కలవానిని గొప్పజ్ఞానము పండినవానినిగా తలపోయువాడు, తన్నుతాను బ్రాహ్మణుడు కానివానినిగా భావించుచు ఆతనివెనుక గడ్డిపరకలపై కూర్చుండువాడును శుద్ధి పొందుమార్గమును చెప్పెదను వినుము.
యదేకరాత్రేణ కరోతిపాపం నికృష్ణ వర్ణం బ్రాహ్మణః సేవమానః,
స్థానాసనాభ్యాం విహరన్ ప్రతీ స త్రిభిర్వర్షః శమయే దాత్మపాపమ్. 29
తక్కువవర్ణము వానికి గొప్పస్థానమును ఆసనమును ఇచ్చి తిరుగుచు సేవించు బ్రాహ్మణుడు ఒకరాత్రి చేసిన పాపమును మూడువత్సరములు వ్రతములయందు నిష్ఠగలవాడై పోగొట్టుకొనును.
న నర్మయుక్త మనృతం హినస్తి న స్త్రీ రాజ న్న వివాహకాలే,
న గుర్వర్థం నాత్మనో జీవితార్థే పఞ్చాన్నతా న్యాహు రపాతకాని. 30
సరసమైన అబద్ధము హింసింపదు. అట్లే స్త్రీల విషయమునందును, వివాహ సమయమునందును, గురువుకొరకును, తన బ్రతుకుకొరకును ఆడు అనృతము హింసింపదు. ఈ అయిదు అసత్యములు పాపములు కానివని పెద్దలు చెప్పుదురు.
శ్రద్దధానః శుభాం విద్యాం హీనా దపి సమాప్నుయాత్,
సువర్ణ మపి చామేధ్యా దాదదీతావిచారయన్. 31
శుభమైన విద్యను శ్రద్ధకలవాడై తక్కువవానినుండియు పొందవలయును. అశుద్ధ పదార్థమునుండియు సువర్ణమును విచారింపక గ్రహింపవలయును.
స్త్రీరత్నం దుష్కులా చ్చాపి విషాదప్యమృతం పిబేత్,
అదూష్యా హి స్త్రియో రత్న మాప ఇత్యేవ ధర్మతః. 32
చెడిన కులమునుండియు మంచివనితను గ్రహింపవలయును. విషము నుండియు అమృతమును త్రావనగును. స్త్రీలు, రత్నము, నీరు చెడునవి కావను ధర్మమువలన ఇవి గ్రహింపదగినవి.
గో బ్రాహ్మణహితార్థం చ వర్ణానాం సంకరేషు చ,
వైశ్యో గృహీత శస్త్రాణి పరిత్రాణార్థ మాత్మనః. 33
గోవులయు, బ్రహ్మవేత్తలయు మేలు కొరకును, వర్ణముల సంకరములు ఏర్పడినపుడును తన్నుతాను రక్షించుకొనుటకై వైశ్యుడు ఆయుధములను చేపట్టవచ్చును.
సురాపానం బ్రహ్మహత్యా గురుతల్ప మథాపి వా,
అనిర్దేశ్యాని మన్యన్తే ప్రాణాంత మితి ధారణా. 34
మద్యము త్రావుట, బ్రహ్మజ్ఞానిని చంపుట, గురుపత్నిని కలియుట అను మహాపాపములు ఎరిగిఎరిగి చేసినచో వానికి ప్రాయశ్చిత్తము లేదు. మరణమే ప్రాయశ్చిత్తమని నిశ్చయము.
సువర్ణహరణం స్తైన్యం విప్రస్వం చేతి పాతకమ్,
విహరన్ మద్యపానాచ్చ అగమ్యాగమనా దపి. 35
పతితైః సంప్రయోగా చ్చ బ్రాహ్మణీయోనిత స్తథా,
అచిరేణ మహారాజ పతితో వై భవత్యుత. 36
బంగారమును దొంగిలించుట, విప్రుని సొమ్మును అపహరించుట అనునవి విచ్చలవిడిగా చేయువాడు మద్యపానదోషము, పొందరాని స్త్రీని పొందుట అనువానికంటె ఘోరమైన పాతకము చేసిన వాడగును.
పతితులతో కలసి మెలసి యుండుటవలనను, బ్రహ్మజ్ఞాని పత్నియందు కామభావనతో మెలగుటవలనను, మహారాజా! శీఘ్రముగా పతితుడగును.
సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్,
యాజనాధ్యాపనా ద్యౌనా న్నతు యానాసనాశనాత్. 37
పతితునితో కూడి యాజనము, అధ్యాపనము, వివాహాది సంబంధము అనువానిని ఆచరించుచు నరుడు పతితుడగును. కలిసి ప్రయాణించుట, కూర్చుండుట అనువాని వలన సంవత్సరకాలములో పతితుడగును.
ఏతాని హిత్వా ఽతోఽన్యాని నిర్దేశ్యానీతి భారత,
నిర్దేశ్యానేన విధినా కాలేనావ్యసనీ భవేత్. 38
వీనిని విడచి ఇతరములైన పాతకములు నిర్దేశ్యములు. ప్రాయశ్చిత్త కార్యముతో వీనిని కడగి వైచుకొని కాలక్రమమున నరుడు వ్యసనములు లేనివాడగును.
అన్నం వీర్యం గ్రహీతవ్యం ప్రేత కర్మణ్యపాతితే,
త్రిషు త్వేతేషు పూర్వేషు న కుర్వీత విచారణామ్. 39
ఈ మొదటి ముగ్గురి విషయమున ప్రేతకర్మము సరిగా జరుగకున్నను అన్నమును, ధనమును గ్రహింపనగును. విచారణ చేయనక్కరలేదు.
అమాత్యా న్వా గురూ న్వాపి జహ్యా ద్ధర్మేణ ధార్మికః,
ప్రాయశ్చిత్తాని కుర్యాచ్చ న తై రర్హన్తి సంవిదమ్. 40
ధర్మముగా ప్రవర్తించువాడు ధర్మము ననుసరించి అమాత్యులనైనను, గురువులనైనను పతితులైన వారిని విడిచివేయవలయును. వారు ప్రాయశ్చిత్తమున కర్హులుకారు. అట్టివారితో మాటాడుటయు చేయరాదు.
అధర్మకారీ ధర్మేణ తపసా హన్తి కిల్బిషమ్,
బ్రువం స్తేన ఇతిస్తేనం తావ త్ప్రాప్నోతి కిల్బిషమ్.
అస్తేనం స్తేన ఇత్యుక్త్వాద్విగుణం పాప మాప్నుయాత్. 41
అధర్మమును చేయువాడు ధర్మముతో, తపస్సుతో ఆపాపమును నశింప జేయును. దొంగను దొంగ అని పలికినంత మాత్రమున పాపమును పొందును. దొంగకానివానిని దొంగ అని పలికి రెట్టింపు పాపమును పొందును.
త్రిభాగం బ్రహ్మహత్యాయాః కన్యా ప్రాప్నోతి దుష్యతీ.
యస్తు దూషయితా తస్యాః శేషం ప్రాప్నోతి పాప్మనః. 42
కన్య తప్పుడు పనిచేసినదై బ్రహ్మహత్యలో మూడువంతుల పాపమును పొందును. ఆమెను చెరచినవాడు మిగిలిన పాపభాగమును పొందును.
బ్రాహ్మణా నవగర్హ్యేహ స్పృష్ట్వా గురుతరం భవేత్,
వర్షాణాం హి శతం తావత్ప్రతిష్ఠాం నాధిగచ్ఛతి. 43
సహస్రం చైవ వర్షాణాం నిపత్య నరకం వసేత్.
తస్మా న్నైవావగర్హ్యేత నైవ జాతు నిపాతయేత్, 44
బ్రహ్మజ్ఞానులను నిందించియు, వారిని చాల ఎక్కువగా అవమానించియు నూరేండ్లు ప్రతిష్ఠ పొందకుండును. వేయియేండ్లు నరకమున బడి యుండును. అందువలన బ్రాహ్మణుని నిందింపరాదు. ఎన్నటికిని మెడబట్టి గెంటివేయరాదు.
శోణితం యావతః పాంసూన్ సంగృహ్ణీ యా ద్ద్విజక్షతాత్,
తావతీః స సమా రాజన్ నరకే ప్రతిపద్యతే. 45
మంత్ర సంస్కారము పొందినవ్యక్తి గాయమునుండి రక్త మెన్ని దుమ్ము కణములను పట్టుకొనునో యన్నియేండ్లు గాయమొనరించినవాడు నరకమున బడి యుండును.
భ్రూణహాఽఽహవమధ్యే తు శుద్ధ్యతే శస్త్రపాతతః,
ఆత్మానం జుహుయా దగ్నౌ సమిద్ధే తేన శుద్ధ్యతే. 46
భ్రూణహత్యచేసినవాడు యుద్ధభూమియందు శస్త్రముతో కూలిపోవుటవలనను, మండుచున్న అగ్నిలో తన్నుతాను వ్రేల్చుకొనుటవలనను శుద్ధి పొందును.
సురాపో వారుణీ ముష్ణాం పీత్వా పాపా ద్విముచ్యతే, 47
తయా స కాయే నిర్దగ్ధే మృత్యుం వా ప్రాప్య శుద్ధ్యతి.
లోకాంశ్చ లభతే విప్రో నాన్యథా లభతే హి సః. 48
మద్యము త్రావు విప్రుడు మరగుచున్న మద్యమును త్రావి ఆ పాపమునుండి విడివడును. అతని కాయము దానితో కాలిపోయినపుడో, మృత్యువును పొందియో అతడు శుద్ధుడగును. ఉత్తమ లోకములను పొందును. మరొక విధముగా అతడు పొందడు.
గురుతల్ప మధిష్ఠాయ దురాత్మా పాపచేతనః,
స్త్య్రాకారాం ప్రతిమాం లింగ్య మృత్యునా సోఽభి శుద్ధ్యతి. 49
గురుభార్యను అనుభవించిన దురాత్ముడు, పాపబుద్ధి స్త్రీ ఆకారముగల ప్రతిమను కాల్చినదానిని కౌగలించుకొని చావుపొందుటవలన పరిశుద్ధుడగును.
అథవా శిశ్నవృషణా వాదాయా ఞ్జలినా స్వయమ్,
నైరృతీం దిశ మా స్థాయ నిపతే త్స త్వజిహ్మగః. 50
లేనిచో గుహ్యాంగములను దోసిలిలోనికి తీసుకొని నైరృతి దిక్కుగా సూటిగా పోవుచు పతనము చెందవలయును.
బ్రాహ్మణార్థేపి వా ప్రాణాన్ సంత్యజేత్తేన శుద్ధ్యతి. 51
అశ్వమేధేన వాపీష్ట్వా అథవా గోసవేన వా.
అగ్నిష్టోమేన వా సమ్యగిహ ప్రేత్య చ పూజ్యతే. 52
మరియు అట్టివాడు బ్రహ్మజ్ఞానికొరకు ప్రాణములను వదలినచో శుద్ధుడగును. అశ్వమేధయాగమునో, గోసవమునో, అగ్నిష్టోమమునో చేసి అతడీ లోకమున శుద్ధుడై మరణించి మన్నన పొందును.
తథైవ ద్వాదశసమాః కపాలీ బ్రహ్మహా భవేత్,
బ్రహ్మచారీ భవేన్నిత్యం స్వకర్మ ఖ్యాపయ న్మునిః. 53
అట్లే బ్రహ్మహత్య చేసినవాడు పుఱ్ఱెను చేత పట్టుకొని పండ్రెండేండ్లు బ్రహ్మచర్యమును పాటించుచు తన పాపమును అందరకు తెలియజెప్పుచు, తక్కినమాటలేవియు పలుకక ఉండవలయును.
ఏవం తు సమభిజ్ఞాతా మాత్రేయీం వా నిపాతయేత్,
ద్విగుణా బ్రహ్మహత్యా వై ఆత్రేయీనిధనే భవేత్. 54
ఇట్లే గర్భవతియని చక్కగా తెలియవచ్చిన స్త్రీని చెరచినవాడును చేయవలయును. ఆత్రేయిని చంపుటచేత బ్రహ్మహత్యకు రెట్టింపు పాపము కలుగును.
సురాపో నియతాహారో బ్రహ్మచారీ క్షితీశయః. 55
ఊర్ధ్వం త్రిభ్యోఽపి వర్షేభ్యో యజేతాగ్నిష్టుతా పరమ్.
ఋషభైక సహస్రం వా గా దత్వా శౌచ మాప్నుయాత్. 56
నియమములు కలవాడు, మద్యముత్రావువాడు ఆహారమున నియమములు కలవాడు బ్రహ్మచర్యమును పాటించువాడు, నేలపై పరుండువాడు నై మూడేండ్లు దాటినతరువాత అగ్నిష్టోమయాగమును చేయవలయును. లేదా వేయి ఎద్దులనో, వేయిగోవులనో దానమొసగి శుద్ధిని పొందును.
వైశ్యం హత్వా తు వర్షే ద్వే ఋషభైకశతం చ గాః,
శూద్రం హత్వా బ్ద మేవైక మృషభం చ శతంచ గాః. 57
వైశ్యునిచంపి రెండేండ్లు నియమములను పాటింపవలయును. వంద ఎద్దులను, వంద గోవులను దానమీవలయును. శూద్రుని చంపి ఒక సంవత్సరము పైనియమములను పాటించి, ఒక ఎద్దును వందగోవులను దాన మొసగవలయును.
శ్వవరాహఖరాన్ హత్వా శౌద్రమేవ వ్రతం చరేత్,
మార్జార చాషమణ్డూకాన్ కాకం వ్యాలంచ మూషికమ్. 58
ఉక్తః పశుసమో దోషో రాజన్ ప్రాణినిపాతనాత్,
ప్రాయశ్చిత్తా న్యథాన్యాని ప్రవక్ష్యా మ్యను పూర్వశః. 59
కుక్క, పంది, గాడిలను చంపినవాడు శూద్రసంబంధమైన వ్రతమునే పాటింపవలయును. పిల్లి, పిచ్చుక, కప్ప, కాకి, పాము, ఎలుక మొదలగు ప్రాణులను కూల్చివేయుటవలనను పై పశువులను చంపిన పాపమునకు సమమగు దోషమునే శాస్త్రములు చెప్పుచున్నవి.
అల్పే వాఽప్యథ శోచేత పృథక్ సంవత్సరం చరేత్,
చిన్నచిన్న పాపములకు పశ్చాత్తాపము పొందవలయును. ఇతర విషయములలో ఒక్కొక్కదానికి విడివిడిగా సంవత్సరకాలము ప్రాయశ్చిత్త వ్రతము నాచరింపవలయును.
త్రీణి శ్రోత్రియభార్యాయాం పరదారే చ ద్వే స్మృతే.
కాలే చతుర్థీ భుంజానో బ్రహ్మచారీ ప్రతీ భవేత్. 60
వేదవిద్వాంసుని భార్యవిషయమున ద్రోహముచేసి మూడేండ్లు, పరభార్య విషయమున రెండేండ్లు దినము నాలుగవ భాగమున మాత్రము భోజనము చేయుచు బ్రహ్మచర్యమును పాటించుచు వ్రతము పాటించువాడు కావలయును.
స్థానాసనాభ్యాం విహరే త్త్రిరహ్నాభ్యుపయ న్నృపః,
ఏవ మేవ నిరాకర్తా యశ్చాగ్నీ నపవిధ్యతి. 61
ప్రత్యేకమైన స్థానముతో ఆసనముతో మూడుదినములు నీరుమాత్రమే తీసికొనుచు తిరుగుచుండవలయును. ఇట్లే నిరాకర్తయు, అగ్నులను చెడగొట్టువాడును ప్రాయశ్చిత్తము నాచరింపవలయును.
త్యజత్యకారణే యశ్చ పితరం మాతరం గురుమ్,
పతితః స్యా త్స కౌరవ్య యథా ధర్మేషు నిశ్చయః.
గ్రాసాచ్ఛాదనమాత్రం తు దద్యాదితి నిదర్శనమ్. 62
తండ్రిని, తల్లిని, గురువును కారణము లేకుండ వదలి వైచువాడే ‘నిరాకర్త’. అతడు పతితుడగునని ధర్మశాస్త్రముల నిశ్చయము. అట్టివానికి కూడుగూడు మాత్రము కల్పింపవలయును.
భార్యాయాం వ్యభిచారిణ్యాం నిరుద్ధాయాం విశేషతః,
యత్పుంసః పరదారేషు తదేనాం చారయే ద్ర్వతమ్. 63
భార్య వ్యభిచారిణి అయినచో, లేదా విశేషించి ఇతరులామెను నిర్బంధించి యున్నచో పరవనితలయందు పాపము చేసిన పురుషు డాచరింపవలసిన వ్రతము నామెచేత చేయింపవలయును.
శ్రేయాంసం శయనం హిత్వా యా న్యం పాపం నిగచ్ఛతి,
శ్వభి స్తా మర్దయే ద్రాజా సంస్థానే బహువిస్తరే. 64
ఉత్తముడగు భర్తను వదలి నీచుని పాన్పును చేరుకొన్న ఆడుదానిని రాజు పెక్కుజనములు గల తావునందు కుక్కలతో కరపింపవలయును.
పుమాంస మున్నయేత్ ప్రాజ్ఞః శయనే తప్త ఆయసే,
అప్యాదదీత దారూణి తత్ర దహ్యేత పాపకృత్. 65
బుద్ధిశాలియగు రాజు ఆ పాపముచేసిన మగవానిని కాలిన ఇనుపమంచమున పడవేయవలయును. మరియు కట్టెలను వైచి కాల్చివేయవలయును.
ఏష దణ్డోమహారాజ స్త్రీణాం భర్తృ ష్వత్రిక్రమాత్,
సంవత్సరోఽభిశప్తస్య దుష్టస్య ద్విగుణో భవేత్. 66
భర్తలను కాదని ఇతరులను చేరెడు స్త్రీలకును, మహారాజా! ఇదియే దండము. అప్పటికప్పుడు ప్రాయశ్చిత్తముచేసి కొనని దుష్టునకు రెట్టింపు దండము.
ద్వే తస్య త్రీణి వర్షాణి చత్వారి సహసేవిని,
కుచరః పఞ్చ వర్షాణి చరేద్భైక్ష్యం మునివ్రతః. 67
అట్టి పతితునితో కలిసి రెండు, మూడు, నాలుగు సంవత్సరములు తిరుగువాడు అయిదేండ్లు మౌనవ్రతము తాల్చినవాడై బిచ్చమెత్తుకొని భూమిపై తిరుగవలయును.
పరివిత్తిః పరివేత్తా యా చైవ పరివిద్యతే,
పాణిగ్రహ స్వధర్మేణ సర్వేతే పతితాః స్మృతాః.
చరేయుః సర్వఏవైతే వీరహా యద్ర్వతం చరేత్. 68
పరివిత్తి, పరివేత్త, వారి భార్య - అధర్మముగా పెండ్లిచేసికొన్న వీరందరు పతితులుగను లెక్కకు వత్తురు. వీరందరు వీరుని చంపినవాడు చేసికొను ప్రాయశ్చిత్తమును చేసికొనవలయును.
చాన్ద్రాయణం చరే న్మాసం కృచ్ఛ్రం వా పాపశుద్ధయే. 69
పాపశుద్ధికొరకు ఒకనెలకాలము చాంద్రాయణ వ్రతమునో, కృచ్ఛ్రవ్రతమునో ఆచరింపవలయును.
పరివేత్తా ప్రయచ్ఛేత తాం స్నుషాం పరివిత్తయే,
జ్యేష్ఠేన త్వభ్యనుజ్ఞాతో యవీయా నప్యనన్తరమ్.
ఏవం చ మోక్ష మాప్నోతి తౌ చ సా చైవ ధర్మతః. 70
అన్నకంటె ముందు పెండ్లాడిన తమ్ముడు ఆమెను అన్నకు కోడలినిగా సమర్పింపవలయును. అన్న అనుమతింపగా పిదప తమ్ముడామెను భార్యగా స్వీకరింపవలయును. ఈవిధముగా ఆమువ్వురును ధర్మము ననుసరించి పాపము
నుండి విడివడుదురు.
అమానుషీషు గోవర్జ్య మనావృష్టి రదుష్యతి,
అధిష్ఠాత్రవమన్తారం పశూనాం పురుషం విదుః. 71
గోవును వదలి పశుజాతులయందు హింస తప్పుకాదందురు. పశువులపై మానవుడు సర్వాధికారములు కలవాడనియు ధర్మజ్ఞు లెరుగుదురు.
పరిధాయోర్ధ్వవాలం తు పాత్ర మాదాయ మృన్మయమ్,
చరేత్సప్త గృహా న్నిత్యం స్వకర్మ పరికీర్తయన్. 72
గోవధ చేసినవాడు మాత్రము చమరీమృగము తోకను కప్పుకొని మట్టిపాత్రను చేతపట్టుకొని తనపాపమును ప్రకటించుచు ప్రతిదినము ఏడు గృహములను తిరుగవలయును.
తత్రైవ లబ్ధభోజీ స్యా ద్ద్వాదశాహా త్సశుద్ధ్యతి,
చరే త్సంవత్సరం చాపి తద్ర్వతం యేన కృన్తతి. 73
ఆ ఏడిండ్లలో దొరకినదానినే తినుచు పండ్రెండు దినములు కడుపగా ఆతడు శుద్ధుడగును. ఆతడు గృహములయందు ఆ చమరితోక భిన్నమగు నంతవరకు ఒక సంవత్సరకాలము ఆవ్రతము నాచరింపవలయును.
భవేత్తు మానుషేష్వేవం ప్రాయశ్చిత్త మనుత్తమమ్,
దానం వా దానశక్తేషు సర్వమేతత్ ప్రకల్పయేత్. 74
మనుష్యుల విషయములో ఇది మిక్కిలి శ్రేష్ఠమగు ప్రాయశ్చిత్తమగును. దానము చేయుశక్తి కలవారియందు అన్నివిధములగు దానమును ప్రాయశ్చిత్తముగా చేయవలయును.
అనాస్తికేషు గోమాత్రం దాన మేకం ప్రచక్షతే,
శ్వవరాహ మనుష్యాణాం కుక్కుటస్య ఖరస్య చ.
మాంసం మూత్రం పురీషం చ ప్రాశ్య సంస్కార మర్హతి. 75
నాస్తికుల విషయమున చేసిన పాపములయందు ఒక్క గోదానమును పరిహారముగా చెప్పుదురు. కుక్క, పంది, మనుష్యులు, కోడి, గాడిద అనువాని విషయమున, మాంసము, మూత్రము, మలము అనువానిని నాలుకపై నుంచుకొని సంస్కారమునకు అర్హుడగును.
బ్రాహ్మణస్తు సురాపస్య గన్ధమాదాయ సోమపః, 76
అప స్త్రహం పిపేదుష్ణం త్ర్యహ ముష్ణం పయః పిబేత్.
త్ర్యహముష్ణం పయః పీత్వా వాయుభక్షో భవేత్త్య్రహమ్. 77
కల్లుత్రాగువాని వాసన చూచిన పాపమునకు సోమపానము చేసిన బ్రాహ్మణుడు మూడుదినములు వేడినీటిని, మూడుదినములు వేడిపాలను త్రాగి యుండవలయును. పిదప మూడుదినములు వాయువును మాత్రము స్వీకరించుచు ఉండవలయును.
ఏవ మేత త్సముద్దిష్టం ప్రాయశ్చిత్తం సనాతనమ్,
బ్రాహ్మణస్య విశేషేణ యదజ్ఞానేన సంభవేత్. 78
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి ప్రాయశ్చిత్తీయే
పఞ్చషష్ట్యధికశతతమోఽధ్యాయః
ఈ విధముగా పెద్దకాలమునుండి వచ్చుచున్న ప్రాయశ్చిత్తవిధిని గూర్చి నీకు చెప్పితిని. ఇదియు విశేషముగా తెలియక తప్పుచేసినపుడు బ్రాహ్మణుడు చేసికొనవలసిన ప్రాయశ్చిత్తము.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మపర్వమున ప్రాయశ్చిత్త
విధానము గల నూట అరువది యైదవ అధ్యాయము
వైశంపాయన ఉవాచ - వైశంపాయను డిట్లు పలికెను.
కధాంతర మథాసాద్య ఖడ్గయుద్ధ విశారదః,
నకులః శరతల్పస్థ మిద మాహ పితామహమ్. 1
కత్తియుద్ధమున ఆరితేరిన నకులుడు, ప్రకృత కథ ముగియుటను గమనించి, అంపశయ్యపై నున్న తాతతో ఇట్లు పలికెను.
నకుల ఉవాచ - నకులుడు ఇట్లనెను.
ధనుః ప్రహరణం శ్రేష్ఠ మతీవాత్ర పితామహ,
మనస్తు మమ ధర్మజ్ఞ ఖడ్గ ఏవ సుశంసితః. 2
తాతా! విల్లు శ్రేష్ఠమైన ఆయుధము. కాని ధర్మజ్ఞా! నా మనస్సును మాత్రము ఖడ్గమే మిక్కిలి ఆకట్టుకొనుచున్నది.
విశీర్ణే కార్ముకే రాజన్ ప్రక్షీణేషు చ వాజిషు,
ఖడ్గేన శక్యతే యుద్ధే సాధ్వాత్మా పరిరక్షితుమ్. 3
రాజా! కార్ముకము ముక్కలు కాగా, గుఱ్ఱములు తరిగిపోగా యుద్ధమున తన్నుతాను రక్షించుకొనుటకు ఖడ్గముతో సాధ్యమగును కదా!
శరాసనధరాం శ్చైవ గదాశక్తిధరాం స్తదా,
ఏకః ఖడ్గధరో వీరః సమర్థః ప్రతిబాధితుమ్. 4
విలుకాండ్రను, గదాధరులను, శక్తితో పోరువారిని కత్తిని తాల్చినవీరుడొక్కడై త్రిప్పికొట్టుటకు సమర్థు డగును.
అత్ర మే సంశయ శ్చైవ కౌతూహల మతీవ చ,
కిం స్వి త్ప్రహరణం శ్రేష్ఠం సర్వయుద్ధేషు పార్థివ. 5
రాజా! ఇందు నాకొక సందియము. దీనిని గూర్చి చాల కుతూహలము కూడ గలదు. అన్నివిధములగు యుద్ధములందును ఏది శ్రేష్ఠమగు ఆయుధము.
కథం చోత్పాదితః ఖడ్గః కస్మై చార్థాయ కేన చ,
పూర్వాచార్యం చ ఖడ్గస్య ప్రబ్రూహి ప్రపితామహ. 6
పెద్దతాతా! ఖడ్గ మెట్లేర్పడినది? ఏ పనికై ఎవనిచేత పుట్టింపబడినది? ఖడ్గమునకు మొదటి ఆచార్యుడెవరు? ఈ విషయములను నాకు వివరముగా చెప్పుము.
వైశంపాయన ఉవాచ - వైశంపాయను డిట్లనెను.
తస్య తద్వచనం శ్రుత్వా మాద్రీపుత్రస్య ధీమతః,
సతు కౌశలసంయుక్తం సూక్ష్మ చిత్రార్థ సంమతమ్. 7
తత స్తస్యోత్తరం వాక్యం స్వరవర్ణోపపాదితమ్,
శిక్షయా చోపపన్నాయ ద్రోణశిష్యాయ భారత. 8
ఉవాచ సతు ధర్మజ్ఞో ధనుర్వేదస్య పారగః,
శరతల్పగతో భీష్మో నకులాయ మహాత్మనే. 9
బుద్ధిమంతుడగు మాద్రికొడుకు పలుకు విని అంపశయ్యపై పరుండిన భీష్ముడు బదులుగా నేర్పుతో కూడినదియు, సూక్ష్మములు, చిత్రములు నగు అర్థములు గలది, చక్కని స్వరములు, వర్ణములు కలదియునగు వాక్యమును పలికెను. ఆ నకులుడు ద్రోణుని తీర్పులో రాటుదేలినవాడు, దొడ్డబుద్ధి. ఈ భీష్ముడు ధర్మజ్ఞుడు. ధనుర్వేదము తుదిముట్ట నభ్యసించినవాడు. అట్టివాడు దొడ్డబుద్ధిగల నకులున కిట్లు చెప్పెను.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
తత్త్వం శృణుష్వ మాద్రేయ యదేత త్పరిపృచ్ఛసి,
ప్రబోధితోఽస్మి భవతా ధాతుమా నివ పర్వతః. 10
నాయనా! మాద్రీకుమారా! నీవడిగినదాని తత్త్వమును తెలిపెదను. వినుము. ధాతువులు గల కొండనువలె నీవు నన్ను మేల్కొల్పితివి.
సలిలైకార్ణవం తాత పురా సర్వ మభూ దిదమ్,
నిష్ప్రకమ్పమనాకాశ మనిర్దేశ్య మహీతలమ్. 11
మునుపు ఇదియంతయు కేవలము ఒక్క సముద్రరూపముగా నుండినది. కదలికలు లేనిది, అవకాశములు లేనిది, గుర్తింపరాని భూతములు గలదియునై యుండెను.
తమసాఽఽ వృత మస్పర్శ మతిగంభీరదర్శనమ్,
నిఃశబ్దం చాప్రమేయం చ తత్ర జజ్ఞే పితామహః. 12
అంతయు చీకటి క్రమ్మియుండినది. స్పర్శలేనిది. కన్నుపొడుచుకొన్నను కానరానిది. శబ్దములేనిది. ఊహకందనిది. అట్టిదానియందు మొట్టమొదటగా బ్రహ్మదేవుడు పుట్టెను.
సోఽసృజద్వాత మగ్నిం చ భాస్కరం చాపి వీర్యవాన్,
ఆకాశ మసృజ చ్చోర్ధ్వ మధోభూమిం చ నైరృతిమ్. 13
సర్వశక్తిసంపన్నుడగు అతడు గాలిని, అగ్నిని, సూర్యుని, పైని ఆకాశమును, క్రింద భూమిని, నైరృతిని సృజించెను. (నైరృతి - నిరృతి దిక్పాలకుని పుత్త్రుడు)
నభః సచన్ద్రతారం చ నక్షత్రాణి గ్రహాం స్తథా,
సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ పక్షా నథ లవాన్ క్షణాన్. 14
చంద్రునితో తారకలతో కూడిన ఆకాశమును, నక్షత్రములను, గ్రహములను, సంవత్సరములను, ఋతువులను, నెలలను, పక్షములను, లవములను, క్షణములను సృష్టిచేసెను.
తతః శరీరం లోకస్య స్థాపయిత్వా పితామహః,
జనయామాస భగవాన్ పుత్రా నుత్తమ తేజసః. 15
అంత బ్రహ్మదేవుడు లోకమునకు శరీరమును నెలకొల్పి గొప్ప తేజస్సుగల పుత్రులను పుట్టించెను.
మరీచి మృషి మత్రించ పులస్త్యం పులహం క్రతుమ్,
వసిష్ఠాఙ్గిరసౌ చోభౌ రుద్రం చ ప్రభు మీశ్వరమ్. 16
మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, అంగిరసుడు, .ప్రభువును ఈశ్వరుడునగు రుద్రుడు అనువారిని పుత్రులనుగా సృజించెను.
ప్రాచేతస స్తథా దక్షః కన్యాషష్టి మజీజనత్,
తావై బ్రహ్మర్షయః సర్వాః ప్రజార్థం ప్రతిపేదిరే. 17
ప్రాచేతసుడగు దక్షుడు అరువదిమంది కన్యలను పుట్టించెను. బ్రహ్మర్షులు సంతానము కొరకు ఆ కన్యలను పత్నులనుగా గ్రహించిరి.
తాభ్యో విశ్వాని భూతాని దేవాః పితృగణా స్తథా,
గర్ధర్వాప్సరసా శ్చైవ రక్షాంసి వివిధాని చ. 18
ఆ దక్షపుత్రికలవలన సర్వవిధములగు భూతములు, దేవతలు, పితృగణములు, గంధర్వులు, అప్సరసలు, వేరువేరు విధముల రక్షస్సులు జనన మొందెను.
పతత్రి మృగమీనా శ్చ ప్లవంగాశ్చ మహోరగాః,
తథా పక్షిగణాః సర్వే జలస్థల విచారిణః.. 19
పక్షులు, మృగములు, చేపలు, కోతులు, పెద్దపెద్ద పాములు, జలమునందును, స్థలమునందును సంచరించు పక్షులగుంపులు అన్నియు వారివలన పుట్టినవి.
ఉద్భిదః స్వేదజాశ్చైవ సాండజాశ్చ జరాయుజాః,
జజ్ఞే తాత జగత్సర్వం తథా స్థావర జంగమమ్. 20
ఉద్భిజ్జములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అనునవియు, స్థావరము జంగమము అయిన సర్వప్రపంచము ఏర్పడెను.
భూతసర్గ మిమం కృత్వా సర్వలోక పితామహః,
శాశ్వతం వేదపఠితం ధర్మం ప్రయుయుజే తతః. 21
సర్వలోకములకు పితామహుడైన బ్రహ్మ ఈ భూతముల సృష్టినంతటిని చేసి వేదము పఠించిన శాశ్వతమగు ధర్మమును నిర్మించెను.
తస్మిన్ ధర్మే స్థితా దేవాః సహాచార్యపురోహితాః,
ఆదిత్యా వసవో రుద్రాః ససాధ్యా మరుదశ్వినః. 22
భృగ్వ త్ర్యంగిరసః సిద్ధాః కాశ్యపాశ్చ తపోధనాః,
వసిష్ఠ గౌతమాగస్త్యా స్తథా నారదపర్వతౌ. 23
ఋషయో వాలఖిల్యా శ్చ ప్రభాసాః సికతా స్తథా,
ఘృతపాః సోమవాయవ్యా వైశ్వానర మరీచిపాః. 24
ఆచార్యులతో, పురోహితులతోపాటు దేవతలు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, అశ్విదేవతలు, భృగువు, అత్రి, అంగిరసులు, సిద్ధులు, కాశ్యపులు మొదలగు తపోధనులు, వాలఖిల్యులు, ప్రభాసులు, సికతులు అను ఋషులు ఘృతము త్రావితపస్సు చేయువారు, సోముడు, వాయవ్యులు, వైశ్వానరులు, మరీచిపులు మొదలైన వారందరు ఆ ధర్మమునకే కట్టుబడి యుండిరి.
అకృష్టాశ్చైవ హంసాశ్చ ఋషయో వాఽగ్ని యోనయః,
వానప్రస్థాః పృశ్నయశ్చ స్థితా బ్రహ్మానుశాసనే. 25
అకృష్టులు, హంసలు, ఋషులు, వానప్రస్థులు, పృశ్నులు, అగ్ని యోనిగాగల ఋషులు మొదలగు వారందరు ఆ బ్రహ్మనెలకొల్పిన శాసనమునందు నిలిచియుండిరి.
దానవేన్ద్రా స్తౄతిక్రమ్య తత్పితామహ శాసనమ్,
ధర్మస్యాపచయం చక్రుః క్రోధలోభ సమన్వితాః. 26
దానవవీరులు మాత్రము ఆ పితామహుని కట్టడిని కాదని క్రోధలోభములతో కూడినవారై ధర్మమునకు భంగమును కలుగజేసిరి.
హిరణ్యకశిపు శ్చైవ హిరణ్యాక్షో విరోచనః,
శంబరో విప్రచిత్తి శ్చ ప్రహ్లాదో నముచి ర్బలః. 27
ఏతే చాన్యే చ బహవః సగణా దైత్యదానవాః,
ధర్మసేతు మతిక్రమ్య రేమిరేఽధర్మ నిశ్చయాః. 28
హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, విరోచనుడు, శంబరుడు, విప్రచిత్తి, ప్రహ్లాదుడు, నముచి, బలుడు వీరును ఇంకను పెక్కండ్రు దితికొడుకులు, దనువు కొడుకులు ఈ ధర్మమను చెలియలి కట్టను అతిక్రమించి అధర్మమునందు నిశ్చయము కలవారై విహరింపజొచ్చిరి.
సర్వే తుల్యాభిజాతీయా యథా దేవా స్తథావయమ్,
ఇత్యేవం ధర్మమాస్థాయ స్పర్థమానాః సురర్షిభిః. 29
ఆ దేవతలవలె మేమును సమానమగు పుట్టుకకలవారము అనుభావనను పట్టి వ్రేలుచు దేవర్షులతో పోటీ పడజొచ్చిరి.
నప్రియం నాప్యనుక్రోశం చక్రు ర్భూతేషు భారత,
త్రీ నుపాయా నుపాక్రమ్య దణేన రురుధుః ప్రజాః.. 30
భూతములయందు ప్రేమను, జాలిని చేయకుండిరి. సామదానభేదము లనెడు మూడు ఉపాయములను కాదని దండముతో ప్రజల నడ్డగింప సాగిరి.
న జగ్ముః సంవిదం తైశ్చ దర్పా దసురసత్తమాః,
దేవర్షులతో ఆ పెద్దరక్కసులు గర్వమువలన సహవాసమును పొందకుండిరి.
అథ వై భగవాన్ బ్రహ్మా బ్రహ్మర్షిభి రుపస్థితః. 31
తదా హిమవతః శృఙ్గే సురమ్యే పద్మతారకే,
శత యోజన విస్తారే మణిరత్న చ యాచితే. 32
తస్మిన్ గిరివరే పుత్ర పుష్పితద్రుమకాననే,
తస్థౌ స విబుధశ్రేష్ఠో బ్రహ్మా లోకార్థసిద్ధయే. 33
అంత నొకప్పుడు మిక్కిలి అందమైనది, పద్మములవంటి తారకలు కలది, నూరుయోజనముల విస్తారము కలది, మణుల, రత్నముల సముదాయముల కూర్పులు గలది, చక్కగా పూచిన చెట్లుతోటలు కలదియగు హిమవంతము శిఖరమున లోకప్రయోజనము సిద్ధికొరకు బ్రహ్మర్షులతో కలిసి కూర్చుండెను.
తతో వర్ష సహస్రాన్తే వితాన మకరో త్ప్రభుః,
విధినా కల్పదృష్టేన యథావచ్చోపపాదితమ్. 34
ఋషిభి ర్యజ్ఞపటుభి ర్యథావత్కర్మకర్తృభిః,
సమిచ్చి పరిసఙ్కీర్ణం దీప్యమానై శ్చ పావకైః. 35
కాఞ్చనై ర్యజ్ఞభాండైశ్చ భ్రాజిష్ణుభి రలంకృతమ్,
వృతం దేవగణైశ్చైవ ప్రవరై ర్యజ్ఞ మణ్డలమ్. 36
అంత వేయి సంవత్సరములు గడచిన తరువాత ఆ ప్రభువు కల్పశాస్త్రము చెప్పిన నియమము ప్రకారము యథాతథముగా చేయబడునట్టి ఒక మహాయజ్ఞమును గావించెను. అందు ఋషులు యజ్ఞకార్యములను క్రమము తప్పకచేయుటలో నిపుణులు. యజ్ఞమండలము సమిధలతో నిండియున్నట్టిది. చక్కగా ప్రజ్వరిల్లుచున్న అగ్నులతో, ప్రకాశించుచున్న బంగారపు యజ్ఞభాండములతో అలంకృతమై యున్నది. శ్రేష్ఠులగు దేవతలు గుంపులుగా అందు కొలువుదీరి యున్నారు.
తథా బ్రహ్మర్షిభి శ్చైవ సదస్యై రుపశోభితమ్,
తత్ర ఘోరతమం వృత్త మృషీణాం మే పరిశ్రుతమ్. 37
అందు సదస్యులందరు బ్రహ్మర్షులై యుండగా అది అలరారుచుండెను. అందు మిక్కిలి ఘోరమైనదొకటి సంభవించెనని ఋషులకును నాకును వినవచ్చినది.
చన్ద్రమా విమలం వ్యోమ యథా భ్యుదిత తారకమ్,
వికీర్యాగ్నిం తథా భూత ముత్థితం శ్రూయతే తదా. 38
మిలమిలలాడు నక్షత్రములు గల స్వచ్ఛమైన ఆకసమున చంద్రుని వలె, అగ్నిని తొలగద్రోసికొనుచు ఒక భూతము పైకి లేచినదని మాకు వినవచ్చినది.
నీలోత్పలసవర్ణాభం తీక్ష్ణదంష్ట్రం కృశోదరమ్,
ప్రాంశుం సుదుర్ధర్ష తరం తథైవ హ్యమితౌజసమ్. 39
ఆ భూతము నల్లకలువల కీడైన కాంతికలదియు, మిక్కిలివాడియైన కోరలుకలదియు, సన్నని నడుము కలదియు, మిక్కిలి పొడవైనదియు, ఎవ్వరికిని సహింపనలవి కానిదియు, పట్టశక్యము కాని శక్తికలదియు నైయుండెను.
తస్మి న్నుత్పతమానే చ ప్రచచాల వసున్ధరా,
మహోర్మి కలితావర్త శ్చుక్షుభే చ మహోదధిః. 40
అది పైకి లేచుచుండగా భూమి కదలాడిపోయెను. మిన్నుముట్టు తరంగములతో సుడులతో సముద్రము గుడుసుళ్లు పడెను.
పేతు రుల్కా మహోత్పాతాః శాఖాశ్చ ముముచు ర్ద్రుమాః,
అప్రశాన్తా దిశః సర్వాః పవన శ్చాశివో వవౌ. 41
ఉల్కలు పడెను. పెద్ద ఉత్పాతములు చెలరేగెను. మహావృక్షముల కొమ్మలు కూలెను. దిక్కులన్నియు గందరగోళముగా నుండెను. వాయువు అమంగళముగా వీవ దొడగెను.
ముహు ర్ముహు శ్చ భూతాని ప్రావ్యథన్త భయాత్తథా,
ప్రాణులన్నియు మాటిమాటికి భయముతో తల్లడిల్లిపోయెను.
తతః స తుములం దృష్ట్వా తం చ భూత ముపస్థితమ్,
మహర్షి సురగన్ధర్వా నువా చేదం పితామహః. 42
ఆ గందరగోళమును, పైకి లేచివచ్చిన ఆ భూతమును గాంచి పితామహుడు మహర్షులతో, దేవతలతో, గంధర్వులతో ఇట్లు పలికెను.
మయైవం చిన్తితం భూత మసి ర్నామైష వీర్యవాన్,
రక్షణార్థాయ లోకస్య వధాయ చ సురద్విషామ్. 43
నేను దీని నిట్లు భావించితిని. ఇది గొప్పశక్తి కలది. దీనిపేరు ‘అసి’. లోకమును రక్షించుట కొరకును, రక్కసులను వధించుట కొరకును దీనిని నిర్మించితిని.
తత స్తద్రూప ముత్సృజ్య బభౌ నిస్త్రింశ ఏవ సః,
విమల స్తీ క్ష్ణధారశ్చ కాలాన్తక ఇవోద్యతః. 44
అంత ఆ భూతము ఆ రూపమును వదలి కేవలము ఖడ్గముగా ప్రకాశించెను. స్వచ్ఛము, వాడి అంచులు కలదియై పైకి లేచిన కాలాంతకుని వలె కన్పట్టెను.
తతః స శితికణ్ఠాయ రుద్రాయార్షభ కేతవే,
బ్రహ్మా దదా వసిం తీక్ష్ణ మధర్మ ప్రతివారణమ్. 45
అంత బ్రహ్మ వాడిఅయినది, అధర్మమును నిలువరించునది యగు ఆ ఖడ్గమును వృషభము కేతనముగా గల శితికంఠుడగు రుద్రున కొసగెను.
తతః సభగవాన్ రుద్రో మహర్షి జనసంస్తుతః,
ప్రగృహ్యాసి మమేయాత్మా రూపమన్య చ్చకార హ. 46
మహర్షులందరు కొనియాడుచుండగా భగవంతుడగు రుద్రుడు ఆ ఖడ్గమును గ్రహించి ఊహింపనలవికాని దేహము కలవాడై మరియొక రూపమున కనుపట్టెను.
చతుర్బహుః స్పృశన్ మూర్ధ్నాభూస్థితోఽపి దివాకరమ్, 47
ఊర్ధ్వ దృష్టి ర్మహాలిఙ్గో ముఖా జ్జ్వాలాః సముత్సృజన్
వికుర్వన్ బహుధా వర్ణాన్ నీలపాణ్డుర లోహితాన్. 48
నాలుగుచేతులు కలవాడు, నేలపై నిలిచియు తలతో సూర్యుని తాకుచున్నవాడు, పైకి సాగెడు చూపులు కలవాడు, గొప్ప లింగస్వరూపుడు, ముఖమునుండి జ్వాలలను వెడలించుచున్నవాడు, నల్లని తెల్లని ఎర్రని రంగులను పెక్కువిధములుగా చేయుచున్నవాడునై కన్పట్టెను.
బిభ్రత్కృష్ణాజినం వాసో హేమప్రవర తారకమ్,
నేత్రం చైకం లలాటేన భాస్కరప్రతిమం వహన్. 49
బంగారు జరీ పోగులుగల నల్లని లేడి చర్మమును వస్త్రముగా తాల్చినవాడు, నొసటిపై సూర్యునితో సమానమగు ఒక కంటిని తాల్చియుండెను.
శుశుభాతేఽతి విమలే ద్వే నేత్రే కృష్ణపింగలే
నల్లని పచ్చని రెండుకనులు అతి స్వచ్ఛములై వెలుగొందుచున్నవి.
తతో దేవో మహాదేవః శూలపాణి ర్భగాక్షిహా.
సంప్రగృహ్య తు నిస్త్రింశం కాలాగ్ని సమ వర్చసమ్. 50
త్రికూటం చర్మ చోద్యమ్య సవిద్యుత మివాంబుదమ్.
చచార వివిధా న్మార్గాన్ మహాబల పరాక్రమః. 51
అంత నామహాదేవుడు, శూలపాణి, భగునినేత్రమును చిదుకబొడిచినవాడు, కాలాగ్నికి సాటియగు కాంతి విశేషముగల ఆ ఖడ్గమును చేతగొని, మెరపుతో కూడిన మేఘమువలె నున్న మూడుబొడిపెల ఒరను పైకి ఎత్తి పట్టుకొని గొప్పబలము, పరాక్రమము కలవాడై పెక్కుమార్గములలో విహరించెను.
విధున్వన్నసి మాకాశే తథా యుద్ధచికీర్షయా,
తస్య నాదం వినదతో మహాహాసం చ ముఞ్చతః. 52
బభౌ ప్రతిభయం రూపం తదా రుద్రస్య భారత.
యుద్ధముచేయుకోరికతో కత్తిని గగనమున విదలించుచుండెను. అట్టహాసముతో బిగ్గరగా అరచుచున్న, వెరపుగొల్పు ఆ రుద్రుని రూపము మిక్కిలిగా ప్రకాశించుచుండెను.
తద్రూపధారిణం రుద్రం రౌద్ర కర్మచికీర్షయా,
నిశమ్య దానవాః సర్వే హృష్టాః సమభిదుద్రువుః. 53
మహాభయంకరమగు పనిని చేయగోరుటచేత అట్టిరూపమును తాల్చిన రుద్రుని
గూర్చి విని దానవులందరు ఉప్పొంగుచున్నవారై ఎదురుగా పరువెత్తుకొని వచ్చిరి.
అశ్మభి శ్చాభ్యవర్షన్త ప్రదీప్తై శ్చ తథోల్ముకైః,
ఘోరైః ప్రహరణై శ్చాన్యైః క్షురధారై రయోమయైః. 54
ఆ రక్కసులు రాలను కురిపించిరి. బాగుగా మండుచున్న కొరవులను, ఘోరములగు ఆయుధములను ఇనుప చురకత్తులను విసరజొచ్చిరి.
తతస్తు దానవానీకం సంప్రణేతార మచ్యుతమ్,
రుద్రం దృష్ట్వా బలోద్భూతం ప్రముమోహ చచాల చ. 55
అంత ఆ దానవసేనను తనబలముతో ఎగురగొట్టుచున్నవాడు, ముందుకు దూసికొని వచ్చుచున్నవాడు, ధైర్యముజారని వాడునగు రుద్రుని గాంచి కొందరు సొమ్మసిల్లిరి. కొందరు చెదరిపోయిరి.
చిత్రం శీఘ్రపదత్వా చ్చ చరన్త మసిపాణినమ్,
త మేక మసురాః సర్వే సహస్ర మితి మేనిరే. 56
వడివడి అడుగులతో, చిత్రముగా కదలాడుచున్న ఆ ఖడ్గధారి ఒక్కడైనను, అతనిని ఆ రాక్షసులందరు వేయిమందిగా తలపోసిరి.
ఛిన్దన్ భిన్దన్ రుజన్ కృన్తన్ దారయన్ పోథయన్నపి.
అచర ద్వైరిసంఘేషు దావాగ్ని రివ కక్షగః. 57
ఎండుపొదలలోని దావాగ్నివలె ఆ రుద్రుడు చీల్చుచు, వ్రేల్చుచు, పీడించుచు, కత్తిరించుచు, పగులగొట్టుచు, నుగ్గు చేయుచు పగవారి మూకలలో విహరించెను.
అసివేగ ప్రభగ్నా స్తే ఛిన్నబాహూరు వక్షసః,
సంప్రకీర్ణాంత్రగాత్రాశ్చ పేతు రుర్వ్యాం మహాబలాః. 58
ఆ గొప్పబలము గల వారందరు కత్తి వేగమునకు తునుకలైనవారై, విరిగిన చేతులు, తొడలు, రొమ్ములు కలవారై, చెల్లాచెదరైన ప్రేవులు, అవయవములు గలవారై నేలగూలిరి.
అపరే దానవా భగ్నాః ఖడ్గపాతావపీడితాః.
అన్యోన్య మభివర్దన్తో దిశః సంప్రతిపేదిరే. 59
మరికొందరు దానవులు కత్తిపాటునకు మిక్కిలిగా పీడనొందినవారై ఒకరినొకరు ఎచ్చరించుకొనుచు దిక్కులకు చేరుకొనిరి.
భూమిం కేచి త్ప్రవివిశుః పర్వతా నపరే తథా,
అపరే జగ్ము రాకాశ మపరేఽమ్భః సమావిశన్. 60
కొందరు భూగర్భములోనికి చొచ్చుకొని పోయిరి. కొందరు కొండలపైకి పరువెత్తిరి. మరికొందరు ఆకసమున కరిగిరి. ఇంకను కొందరు నీటిలోనికి ప్రవేశించిరి.
తస్మిన్ మహతి సంవృత్తే సమరే భృశదారుణే,
బభూవ భూః ప్రతిభయా మాంసశోణిత కర్ధమా. 61
దానవానాం శరీరైశ్చ పతితైః శోణితోక్షతైః.
సమాకీర్ణా మహాబాహో శైలైరివ సకింశుకైః. 62
మిక్కిలి దారుణమగు ఆ మహాయుద్ధ మట్లు సంభవింపగా భూమి మాంసముతో, రక్తముతో బురదబురదగా నైనదియు, భయము గొలుపునదియు నాయెను. రక్తముతో తడిసి కూలియున్న దానవుల శరీరములతో కింశుక (మోదుగచెట్లు) వృక్షములు గల కొండలతో వలె, నిండియుండెను.
స రుద్రో దానవాన్ హత్వా కృత్వా ధర్మోత్తరం జగత్,
రౌద్రం రూప మథోత్షిప్య చక్రే రూపం శివం శివః. 63
ఆరుద్రుడట్లు దానవులను చంపివైచి జగత్తును ధర్మముతో నిండినదానినిగా చేసి రౌద్రరూపమును వదలి వైచి మంగళకరమగు రూపమును తాల్చెను.
తతో మహర్షయః సర్వే సర్వే దేవగణా స్తథా,
జయే నాద్భుత కల్పేన దేవదేవం తథార్చయన్. 64
అంత మహర్షులందరును, దేవగణములన్నియును అచ్చెరువు గొలుపు ఆ జయముతో దేవదేవుని కొనియాడిరి.
తతః స భగవాన్ రుద్రో దానవక్షతజోక్షితమ్,
అసిం ధర్మస్య గోప్తారం దదౌ సత్కృత్య విష్ణవే. 65
అంత రుద్రభగవానుడు రక్కసుల రక్తముతో తడిసిన ఆ కత్తిని, ధర్మమును రక్షించుదానిని సత్కరించి విష్ణువున కొసగెను.
విష్ణు ర్మరీచయే ప్రాదా న్మరీచి ర్భగవానపి,
మహర్షిభ్యో దదౌ ఖడ్గ మృషయో వాసవాయ చ. 66
విష్ణువు మరీచికి, మరీచి మహర్షులకు, మహర్షులు దేవేంద్రునకు ఆ ఖడ్గము నిచ్చిరి.
మహేన్ద్రో లోకపాలేభ్యో లోకపాలాస్తు పుత్రక,
మనవే సూర్యపుత్రాయ దదుః ఖడ్గం సవిస్తరమ్. 67
నాయనా! మహేంద్రుడు లోకపాలురకు, లోకపాలురు సూర్యునిపుత్రుడగు మనువునకు ఆ ఖడ్గమును ఒసగిరి.
ఊచు శ్చైనం తథా వాక్యం మానుషాణాం త్వమీశ్వరః,
అసినా ధర్మగర్భేణ పాలయస్వ ప్రజా ఇతి. 68
లోకపాలురు మనువుతో నీవు మనుష్యులకు ఈశ్వరుడవు. ధర్మము కడుపున పెట్టుకొన్న ఖడ్గముతో నీవు ప్రజలను పాలింపుము - అని పలికిరి.
ధర్మసేతు మతిక్రాన్తాః స్థూల సూక్ష్మాత్మ కారణాత్,
విభజ్య దణ్ణం రక్ష్యాస్స్యు ర్ధర్మతో న యదృచ్ఛయా. 69
స్థూలమగు దేహము సూక్ష్మమగు మనస్సు కారణముగా ధర్మమనెడు సేతువును దాటినవారిని వేరువేరుగా ధర్మముననుసరించి దండమునొసగి రక్షింపవలయును. ఇష్టము వచ్చినట్లు దండింపరాదు.
దుర్వాచా నిగ్రహో దణ్డా హిరణ్యబహుల స్తథా,
వ్యఙ్గతా చ శరీరస్య వధో వా నల్ప కారణాత్. 70
చెడుమాటలతో దండించుట, ధనము అధికముగా అపరాధమునకు రాబట్టుట, అవయవములను లోపింపజేయుట, వధ అను నాలుగు విధములగు దండములలో పెద్దకారణమున్నపుడే మరణశిక్షను ఒసగదగును.
అసే రేతాని రూపాణి దుర్వారాదీని నిర్దిశేత్,
అసే రేవం ప్రమాణాని పరిపాల్య వ్యతిక్రమాత్. 71
చెప్పనలవి కాని ఖడ్గపు ఈ రూపములన్నింటిని లోకమునకు తెలియజేయవలయును. ఈ ప్రమాణములను పరిపాలించుచు, ధర్మవ్యతిక్రమము జరిగినచోట దండించుచుండవలయును.
స విసృజ్యాథ పుత్రం స్వం ప్రజానా మధిపం తతః,
మనుః ప్రజానాం రక్షార్థం క్షుపాయ ప్రదదా వసిమ్. 72
మనువు ఆ ఖడ్గమును వదలి ప్రజల అధిపునిగా తన కుమారుడగు క్షుపుని ఏర్పరచి ప్రజల రక్షణకొరకు ఆ ఖడ్గమును క్షుపున కొసగెను.
క్షుపా జ్జగ్రాహ చేక్ష్వాకు రిక్ష్వాకోశ్చ పురూరవాః
ఆయుశ్చ తస్మా ల్లేభే తం నహుషశ్చ తతో భువి. 73
యయాతి ర్నహుషాచ్చాపి పూరు స్తస్మాచ్చ లబ్ధవాన్. 74
క్షుపుని నుండి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువునుండి పురూరవుడు, అతనినుండి ఆయువు, అతనినుండి నహుషుడు, నహుషునినుండి యయాతి, అతనినుండి పూరువు దానిని గ్రహించిరి.
అమూర్తరయస స్తస్మాత్తతో భూమిశయో నృపః,
భరత శ్చాపి దౌష్యన్తి ర్లేభే భూమిశయా దసిమ్. 75
పూరువునుండి అమూర్తరయసుడు, అతనినుండి భూమిశయుడను రాజు, అతనినుండి దుష్యంతుని కుమారుడగు భరతుడు ఖడ్గమును కైకొనిరి.
తస్మాల్లేభే చ ధర్మజ్ఞో రాజ న్నైలబిల స్తథా,
తత స్త్వైలబిలా ల్లేభే ధున్ధుమారో నరేశ్వరః. 76
అతనినుండి ధర్మజ్ఞుడగు ఐలబిలుడు, అతనినుండి నరేశ్వరుడగు ధుంధుమారుడు పొందిరి.
ధుంధుమారా చ్చ కాంబోజో ముచుకుంద స్తతోఽలభత్,
ముచుకున్దా న్మరుత్తశ్చ మరుత్తా దపి రైవతః. 77
ధుంధుమారుని నుండి కాంబోజుడు, అతనినుండి ముచుకుందుడు, ముచుకుందుని నుండి మరుత్తుడు, మరుత్తుని నుండి రైవతుడు ఆ ఖడ్గమును చేకొనిరి.
రైవతా ద్యువనా శ్వశ్చ యువనా శ్వా త్తతో రఘుః,
ఇక్ష్వాకువంశజ స్తస్మా ద్ధరిణాశ్వః ప్రతాపవాన్. 78
రైవతునినుండి యువనాశ్వుడు, యువనాశ్వునినుండి రఘువు, ఇక్ష్వాకు వంశమువాడైన రఘువు నుండి ప్రతాపవంతుడగు హరిణాశ్వుడు గ్రహించిరి.
హరిణాశ్వా దసిం లేభే శునకః శునకా దపి,
ఉశీనరో వై ధర్మాత్మా తస్మాద్భోజః స యాదవః. 79
హరిణాశ్వునినుండి శునకు డాఖడ్గమును పొందెను. శునకుని నుండి ధర్మాత్ముడగు ఉశీనరుడు, అతనినుండి యదువంశమువాడగు భోజుడు గ్రహించిరి.
యదుభ్యశ్చ శిబి ర్లేభే శిబే శ్చాపి ప్రతర్దనః,
ప్రతర్దనా దష్టకశ్చ పృషదశ్వో ఽష్టకాదపి. 80
యదువులనుండి శిబియు, శిబినుండి ప్రతర్ధనుడు, ప్రతర్దనునినుండి అష్టకుడు, అష్టకుని నుండి పృషదశ్వుడు తీసికొనిరి.
పృషదశ్వా ద్భరద్వాజో ద్రోణ స్త స్మా త్కృప స్తతః,
తతస్త్వం భ్రాతృభిః సార్ధం పరమాసి మవాప్తవాన్. 81
పృషదశ్వునినుండి భరద్వాజుడైన ద్రోణుడు, అతనినుండి కృపుడును గ్రహించిరి. ఆ మహాఖడ్గమును అతని నుండి నీవు నీ సోదరులతోపాటుగా పొందితివి.
కృత్తికా స్తస్య నక్షత్ర మసే రగ్నిశ్చ దైవతమ్,
రోహిణీం గోత్ర మాస్థాయ రుద్రశ్చ గురు రుత్తమః. 82
ఆ ఖడ్గమునకు నక్షత్రము కృత్తిక. అగ్ని దైవతము. రోహిణి గోత్రము ననుసరించి పుట్టినది. రుద్రుడు పరమగురువు.
అసే రష్టౌ హి నామాని రహస్యాని నిబోధ మే,
పాణ్డవేయ సదా యాని కీర్తయన్ లభతే జయమ్. 83
అసికి ఎనిమిది రహస్యమగు పేర్లు కలవు. వానిని నానుండి తెలిసికొనుము. పాండవేయా! నరుడు వానిని కీర్తించుచు జయము పొందును.
అసి ర్విశసనః ఖడ్గ స్తీక్ష్ణధారో దురాసదః,
శ్రీగర్భో విజయశ్చైవ ధర్మపాల స్తథైవ చ. 84
అసి, విశసనము, ఖడ్గము, తీక్ష్ణధారము, దురాసదము, శ్రీగర్భము, విజయము, ధర్మపాలము అనునవి ఆ ఎనిమిది పేర్లు.
అగ్ర్యః ప్రహరణానాం చ ఖడ్గో మాద్రవతీసుత,
మహేశ్వరప్రణీతశ్చ పురాణే నిశ్చయం గతః. 85
మాద్రీపుత్రా! ఖడ్గము ఆయుధములలో శ్రేష్ఠమైనది. మహేశ్వరుడు తీర్చిదిద్దినదని పురాణమునందు నిర్ణయము పొందినది.
పృథు స్తూత్పాదయామాస ధనురాద్య మరిందమః,
తేనేయం పృథివీ దుగ్ధా సస్యాని సుబహూ న్యపి. 86
పృథువు ధనువును మొదటగా సృష్టిచేసెను. దానితో ఈ పృథివినుండి పెక్కువిధములగు పంటలను పిండెను.
ధర్మేణ చ యథాపూర్వం వైన్యేన పరిరక్షితా.
వేనుని కుమారుడగు పృథువు ధర్మముతో ఈ భూమిని చక్కగా రక్షించెను.
తదేత దార్షం మాద్రేయ ప్రమాణం కర్తు మర్హసి,
అసేశ్చ పూజా కర్తవ్యా సదా యుద్ధ విశారదైః. 87
మాద్రీతనయా! ఆ యీ ఖడ్గము ఆర్షమైనది. దీనిని ప్రమాణముగా చేసికొననగును. యుద్ధమున ఆరితేరిన వారు ఖడ్గ పూజను ఎల్లవేళల చేయవలయును.
ఇత్యేష ప్రథమః కల్పో వ్యాఖ్యాత స్తే సవిస్తరాత్,
అసే రుత్పత్తి సంసర్గో యథావ ద్భరతర్షభ. 88
ఇదిగో అన్నివివరములతో ఖడ్గము ఉత్పత్తిని గూర్చి మొదటి కల్పమును ఉన్నదున్నట్లు నీకు వక్కాణించితిని.
సర్వథైత దిదం శ్రుత్వా ఖడ్గసాధన ముత్తమమ్,
లభతే పురుషః కీర్తిం ప్రేత్య చానన్త్య మశ్నుతే. 89
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఖల్గోత్పత్తికథనే
షట్షష్ట్యధిక శతతమోధ్యాయః
ఖడ్గమునకు సంబంధించిన ఉత్తమమగు ఈ వృత్తాంతమును విని పురుషుడు కీర్తిని, మరణించిన తరువాత అనంతమగు సుఖమును పొందును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున ఖడ్గోత్పత్తి
కథనము గల నూట అరువదియారవ అధ్యాయము
వైశమ్పాయన ఉవాచ - వైశంపాయను డిట్లు చెప్పెను.
ఇత్యుక్తవతి భీష్మే తు తూష్ణీంభూతే యుధిష్ఠిరః,
పప్రచ్ఛావసథం గత్వా భ్రాతౄన్ విదురపఞ్చమాన్. 1
ఇట్లు పలికి భీష్ముడు ఊరకుండగా యుధిష్ఠిరుడు ఇంటి కరిగి విదురు డైదవవాడుగా నున్న తమ్ములను ఇట్లు అడిగెను.
ధర్మే చార్థే చ కామే చ లోకవృత్తిః సమాహితా,
తేషాం గరీయాన్ కతమో మధ్యమః కో లఘుశ్చ కః. 2
ధర్మము, అర్థము, కామము అనువానియందు లోకవృత్తి నెలకొని యున్నది. వానిలో గొప్పది ఏది? మధ్యమ మేది? తక్కువది యేది?
కస్మిం శ్చాత్మా నిధాతవ్య స్త్రివర్గ విజయాయ వై,
సంహృష్టా నైష్ఠికం వాక్యం యథావ ద్వక్తు మర్హథ. 3
మూడింటి సముదాయమును గెలుచుటకు దేనియందు ఆత్మను నిలుపవలయును. మీరందరు ఆనందముతో నిష్ఠగల వాక్యమును పలుకదగును.
తతోఽర్థగతి తత్త్వజ్ఞః ప్రథమం ప్రతిభానవాన్,
జగాద విదురో వాక్యం ధర్మశాస్త్ర మనుస్మరన్. 4
అంత అర్థముల నడక యందలి తత్త్వమెరిగినవాడు ప్రతిభావంతుడు నగు విదురుడు ధర్మశాస్త్రమును స్మరించుచు మొదటగా నిట్లు పలికెను.
విదుర ఉవాచ - విదురు డిట్లనెను.
బాహుశ్రుత్యం తపస్త్యాగః శ్రద్ధా యజ్ఞక్రియా క్షమా,
భావశుద్ధి ర్దయా సత్యం సంయమ శ్చాత్మసంపదః. 5
బహువిషయములు నేర్చియుండుట, తపస్సు, త్యాగము, శ్రద్ధ, యజ్ఞ క్రియ, ఓర్పు, భావశుద్ధి, దయ, సత్యము, ఇంద్రియనిగ్రహము - అనునవి ఆత్మ సంపదలు.
ఏత దేవాభిపద్యస్వ మా తేఽభూ చ్చలితం మనః,
ఏత న్మూలౌ హి ధర్మార్థా వేత దేకపదం హి మే. 6
దీనినే నీవు చక్కగా పొందుము. నీ మనస్సు చలింపకుండుగాక! ధర్మము, అర్థము అనువానికి ఇదియే మూలము. నా దృష్టిలో ఇదియంతయు ఒకే స్వరూపము.
ధర్మేణైవర్షయ స్తీర్ణా ధర్మే లోకాః ప్రతిష్ఠితాః,
ధర్మేణ దేవా వవృధు ర్ధర్మే చార్థః సమాహితః. 7
ధర్మముచేతనే ఋషులు తరించిరి. ధర్మమునందే లోకములన్నియు (ప్రతిష్ఠ పొందియున్నవి) నెలకొనియున్నవి. ధర్మముచేత దేవతలు వృద్ధిపొందిరి. ధర్మమునందే అర్థము నెలకొని యున్నది.
ధర్మో రాజన్ గుణః శ్రేష్ఠో మధ్యమో హ్యర్థ ఉచ్యతే,
కామో యవీయానితి చ ప్రవదన్తి మనీషిణః. 8
రాజా! ధర్మమను గుణము శ్రేష్ఠమైనదనియు, అర్థము మధ్యమమనియు, కామము అధమమనియు బుద్ధి సంపన్నులు పలుకుదురు.
తస్మా ద్ధర్మప్రధానేన భవితవ్యం యతాత్మనా,
తథా చ సర్వభూతేషు వర్తితవ్యం యథాత్మని. 9
కనుక మనస్సునదుపున నుంచుకొని నరుడు ధర్మ ప్రధానముగా మెలగవలయును. అట్లే తనయందెట్లు మెలగునో సర్వభూతములయందును అట్లే మెలగవలయును.
సమాప్తవచనే తస్మి న్నర్థశాస్త్ర విశారదః,
పార్థో ధర్మార్థ తత్త్వజ్ఞో జగౌ వాక్యం ప్రచోదితః. 10
అతడు వాక్యము ముగించిన పిదప అర్థశాస్త్రమున ఆరితేరినవాడు, ధర్మార్థముల తత్త్వము తెలిసినవాడునగు అర్జునుడు ధర్మజు డడుగగా ఈ వాక్యమును పలికెను.
అర్జున ఉవాచ - అర్జును డిట్లనెను.
కర్మభూమి రియం రాజ న్నిహ వార్తా ప్రశస్యతే,
కృషిగోరక్షవాణిజ్యం శిల్పాని వివిధాని చ. 11
రాజా! ఇది కర్మభూమి. ఇచట ‘వార్త’ ప్రశస్తమైనది. వ్యవసాయము, గోరక్ష, వాణిజ్యము, వివిధములగు శిల్పములు ప్రశస్తి కెక్కినవి.
అర్థ ఇత్యేవ సర్వేషాం కర్మణా మవ్యతిక్రమః,
నహ్యృతేఽర్థేన వర్తేతే ధర్మకామా వితి శ్రుతిః. 12
అన్ని కర్మములకు అర్థమే మూలము. దానిని దాటిపోనలవి కాదు. అర్థమును విడచి ధర్మకామములు సాగవని వేదము.
విషయై రర్థవాన్ ధర్మ మారాధయితు ముత్తమమ్,
కామం చ చరితుం శక్తే దుప్ర్పాప మకృతాత్మభిః. 13
అర్థముగలవాడు విషయములచేత ఉత్తమమగు ధర్మము నారాధించుటకును, కామము నాచరించుటకును సమర్థుడగును. బుద్ధిసంపదలేనివారు దానిని పొందజాలరు.
అర్థస్యావయవా వేతా ధర్మకామా వితి శ్రుతిః,
అర్థసిద్ధ్యా వినిర్వృత్తా వుభా వేతా భవిష్యతః. 14
ధర్మకామము లనెడి ఇవి అర్థము అవయవములని వేదము చెప్పుచున్నది. ఈ రెండును అర్థము సిద్ధింపగా ఏర్పడునట్టివి.
తద్గతార్థం హి పురుషం విశిష్టతరయోనయః,
బ్రహ్మాణమివ భూతాని సతతం పర్యుపాసతే. 15
సాధించిన ధనము గల పురుషుని విశిష్ట కులమున పుట్టినవారు, సర్వభూతములు బ్రహ్మను వలె, కొలిచి యుందురు.
జటాజినధరా దాన్తాః పఙ్కదిగ్ధా జితేన్ద్రియా:,
ముణ్డా నిస్తన్తవ శ్చాపి వసన్త్యర్థార్థినః పృథక్. 16
జడలు, తోలు ధరించిన నిగ్రహవంతులు, బురదపూసికొన్న జితేంద్రియులు, తలలు గొరిగించుకొన్న బ్రహ్మచారులును అర్థమును కోరువారై నివసింతురు.
కాషాయవసనా శ్చాన్యే శ్మశ్రులా హ్రీనిషేవిణః,
విద్వాంస శ్చైవ శాన్తాశ్చ ముక్తాః సర్వపరిగ్రహైః. 17
అర్థార్థినః సన్తి కేచి దపరే స్వర్గకాంక్షిణః,
కులప్రత్యాగమా శ్చైకే స్వం స్వం ధర్మమనుష్ఠితాః. 18
కాషాయ వస్త్రములు ధరించి గడ్డములు మీసములు పెంచుకొనియున్నవారు, పాడుపనులకు సిగ్గుపడెడువారు, శాంతులు, విద్వాంసులు, అన్నివిధములగు పరిగ్రహములను వదలి వైచువారును ధనమును కోరువారే అగుచున్నారు. మరికొందరు స్వర్గమును కోరుకొనుచుందురు. ఇంకను కొందరు తమతమ ధర్మమును చక్కగా ఆచరించుచు కులధర్మమును పాటించుచుందురు. వీరందరు ధనము కోరువారే.
ఆస్తికా నాస్తికా శ్చైవ నియతాః సంయమే పరే,
అప్రజ్ఞానం తమో భూతం ప్రజ్ఞానం తు ప్రకాశితా. 19
ఆస్తికులు, నాస్తికులు, ఉత్కృష్టమగు నిగ్రహమున కట్టుబడినవారు అందరు ధనము కోరువారే. ధన విషయమున తెలివిలేకపోవుట చిమ్మచీకటి వంటిది. ధనమునకు సంబంధించిన గొప్పతెలివి గొప్పవెలుగు.
భృత్యాన్ భోగై ర్ద్విషో దణ్డై ర్యో యోజయతి సోఽర్థవాన్,
తనపోషణలోని వారిని ఆయాభోగములతో, పగవారిని దండములతో కలుపువాడెవ్వడో వాడే ధనవంతుడు.
ఏత న్మతిమతాం శ్రేష్ఠ మతం మమ యథాతథమ్,
అనయోస్తు నిబోధ త్వం వచనం వాక్యకంఠయోః. 20
బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవగు ధర్మరాజా! ఇది నా స్పష్టమైన అభిప్రాయము. నీవు నోటి చివర వాక్యము నుంచుకొన్న ఈ నకుల సహదేవుల వచనమును కూడ వినుము.
తతో ధర్మార్థకుశలౌ మాద్రీపుత్రా వనన్తరమ్,
నకులః సహదేవశ్చ వాక్యం జగదతు: పరమ్. 21
పిమ్మట ధర్మార్థములయందు నిపుణులు, మాద్రీపుత్రులు నకులసహదేవులు గొప్పదగు వాక్యము నిట్లు పలికిరి.
నకుల సహదేవా వూచతుః - నకుల సహదేవు లిట్లు పలికిరి.
ఆసీనశ్చ శయానశ్చ విచరన్నపి వా స్థితః,
అర్థయోగం దృఢం కుర్యా ద్యోగై రుచ్చావచై రపి. 22
మానవుడు కూర్చున్నవాడు, పరున్నవాడు, తిరుగుచున్నవాడు, నిలుచున్నవాడు కానిమ్ము గట్టిగా గొప్పగొప్పవియగు ఉపాయములతో అర్థసముపార్జనము చేయవలయును.
అస్మింస్తు వై వినిర్వృత్తే దుర్లభే పరమప్రియే,
ఇహ కామా నవాప్నోతి ప్రత్యక్షం నాత్ర సంశయః. 23
పొందశక్యము కానిది, మిక్కిలి ప్రియమైనదియునగు ఈ ధనము సిద్ధించినచో ఈ లోకమున కోరికల నన్నింటిని పొందును. ఇది స్పష్టముగా కానవచ్చునట్టిది. ఇందు సందియము లేదు.
యోఽర్థో ధర్మేణ సంయుక్తో ధర్మో యశ్చార్థ సంయుతః,
తద్ధి త్వాఽమృత సంవాదం తస్మా దేతౌ మతా విహ. 24
ధర్మముతో కలసియున్న అర్థము, అర్థముతో కూడి యున్న ధర్మము అనునది నిశ్చయముగా అమృతముతో సమానమైనదని మా అభిప్రాయము.
అనర్థస్య న కామోఽస్తి తథాఽర్థో ఽధర్మిణః కుతః,
తస్మా దుద్విజతే లోకో ధర్మార్థా ద్యో బహిష్కృతః. 25
ధనము లేనివానికి కామము లేదు. ధర్మము లేనివానికి అర్థమెక్కడిది? కావుననే ధర్మముతో కూడిన అర్థము నుండి దూరమైన వానివలన లోకము కళవళపడుచున్నది.
తస్మాద్ధర్మ ప్రదానేన సాధ్యోఽర్థః సంయతాత్మనా,
విశ్వస్తేషు హి భూతేషు కల్పతే సర్వమేవ హి. 26
అందువలన ధర్మరూపమైన దానముచేత, మనసును నిలువరించుకొనగల నరుడు అర్థమును సాధింపవలయును. సర్వభూతములు నమ్మకము కలిగి యున్నచో అన్నియు సమకూడును.
ధర్మం సమాచరేత్ పూర్వం తతోఽర్థం ధర్మసంయుతమ్,
తతః కామం చరేత్ పశ్చాత్ సిద్థార్థః సహి తత్పరమ్. 27
ముందు ధర్మము నాచరింపవలయును. అటుపై ధర్మముతో కూడిన విధముగా అర్థమును సంపాదింపవలయును. అటు పిమ్మట కామమును తీర్చుకొనవలయును. ఆ పిమ్మట మానవుడు నెరవేరిన ప్రయోజనము కలవాడగును.
వైశమ్పాయన ఉవాచ - వైశంపాయను డిట్లనెను.
విరేమతస్తు తద్వాక్య ముక్త్వా తావశ్వినోః సుతౌ,
భీమసేన స్తదా వాక్య మిదం వక్తుం ప్రచక్రమే. 28
ఆ వాక్యమును పలికి అశ్విసుతులగు నకుల సహదేవులు విరమింపగా భీమసేనుడు తన మాట నిట్లు పలుక నారంభించెను.
భీమసేన ఉవాచ - భీమసేను డిట్లు పలికెను.
నాకామః కామయత్యర్థం నాకామో ధర్మ మిచ్ఛతి,
నాకామః కామయానోఽస్తి తస్మాత్కామో విశిష్యతే. 29
కామము లేనివాడు ధనమును కోరడు. కామములు లేని వాడు ధర్మము నిష్టపడడు. కామములు లేనివాడు కామములను పొందడు. అందువలన కామము గొప్పది యగుచున్నది.
కామేన యుక్తా ఋషయ స్తపస్యేవ సమాహితాః,
పలాశఫలమూలాదా వాయుభక్షా సుసంయతాః. 30
వేదోపవేదే ష్వపదే యుక్తాః స్వాధ్యాయపారగాః,
శ్రాద్ధయజ్ఞ క్రియాయాం చ తథా దానప్రతిగ్రహే. 31
వణిజః కర్షకా గోపాః కారవః శిల్పిన స్తథా,
దేవకర్మకృత శ్చైవ యుక్తాః కామేన కర్మసు. 32
ఏదో ఒక కోరికతో కూడియున్నవారై ఋషులు తపస్సునందు తగులుకొనియున్నారు. మోదుగలు, పండ్లు, దుంపలు తినువారును, వాయువే ఆహారముగా గలవారును, ఎన్నో నియమములను పాటించువారును, వేదములయందు, ఉపవేదములయందును మనసు పెట్టిన వారు, వేదాధ్యయనమున తుదిముట్టినవారు, శ్రాద్ధములు, యజ్ఞక్రియలు, దానప్రతిగ్రహములు అనువాని యందు నిష్ఠ కలవారు, వర్తకులు, కర్షకులు, గోపాలురు, వడ్రంగులు, శిల్పులు, దైవారాధన చేయువారు ఏదో ఒక కోరికతో కూడినవారే అయి ఆయా పనుల యందు ముడివడి యున్నారు.
సముద్రం వా విశన్త్యన్యే నరాః కామేన సంయుతాః,
కామో హి వివిధాకారః సర్వం కామేన సంతతమ్. 33
కొందరు నరులు కామముతో కూడియున్నవారై సముద్రమును గూడ చొచ్చుచున్నారు. కామము పెక్కు ఆకారములు కలది. అంతయు కామముతో అల్లుకొని యున్నట్టిదియే.
నాస్తి నాసీ న్నాభవిష్య ద్భూతం కామాత్మకాత్ పరమ్,
ఏతత్సారం మహారాజ ధర్మార్థా వత్ర సంస్థితౌ. 34
కామాత్మకము కంటె వేరయినది ఇప్పుడు లేదు. మునుపు లేదు. ముందు ఉండదు. మహారాజా! దీని సారమేమనగా ధర్మము, అర్థము అనునవి కామమునందే తిష్ఠ వేసికొని యున్నవి.
నవనీతం యథా దధ్న స్తథా కామోఽర్థ ధర్మతః,
శ్రేయస్తైలం హి పిణ్యాకాద్ ఘృతం శ్రేయ ఉదశ్వితః,
శ్రేయః పుష్పఫలం కాష్ఠాత్ కామో ధర్మార్థయో ర్వరః. 35
పెరుగునుండి వెన్న యెట్లో అర్థ ధర్మముల నుండి కామ మట్టిది. తెలకపిండి కంటె తైలము, మజ్జిగ కంటె నేయి, కట్టెల కంటె పూవులు పండ్లు ఎట్లు మేలైనవో ధర్మార్థముల కంటె కామ మట్లు శ్రేష్ఠమైనది.
పుష్పతో మధ్వివ రసః కామ ఆభ్యాం తథా స్మృతః,
కామో ధర్మార్థయో ర్యోనిః కామశ్చాథ తథాత్మకః. 36
పుష్పమునుండి తేనెరసము వచ్చినవిధముగా ధర్మార్థములనుండి కామము ఏర్పడును. కామము ధర్మార్థములకు పుట్టినతావు. కామము ధర్మార్థముల స్వరూపమే.
నాకామతో బ్రాహ్మణాః స్వన్నమర్థా న్నాకామతో దదతి బ్రాహ్మణేభ్యః,
నాకామతో వివిధా లోకచేష్టా తస్మాత్కామః ప్రాక్త్రివర్గస్య దృష్టః. 37
కామమును కాదని కేవలము ధనమువలననే బ్రాహ్మణులు రుచికరమగు అన్నమును తినరు. కామము లేక మానవులు బ్రహ్మజ్ఞానులకు దానము లొసగరు. కామము లేనిదే వేరువేరు విధములుగ లోకచేష్ట సాగదు. అందువలన కామమును ధర్మార్థ కామముల మూడింటికి కుదురుగా భావింతురు.
సుచారువేషాభి రలంకృతాభి ర్మదోత్కటాభిః ప్రియదర్శనాభిః,
రమస్వ యోషాభి రుపేత్య కామం కామో హి రాజన్ పరమో భవే న్నః. 38
మిక్కిలి అందమైన వేషములు, అలంకారములు కలవారై, మదము పిక్కటిల్లగా, చూడముచ్చట అయిన వనితలతో కూడి కామవిహారము సలుపుము. రాజా! కామము సర్వశ్రేష్ఠ మయినది.
బుద్ధి ర్మమైషా పరిఖాస్థితస్య మాభూ ద్విచార స్తవ ధర్మపుత్ర!
స్యా త్సంహితం సద్భి రఫల్గుసారం మమేతి వాక్యం పరమానృశంసమ్. 39
మూలముట్టుగా శోధించిన నా బుద్ధి ఇది. ధర్మపుత్రా! ఇందు నీకు విచారము అక్కర లేదు. నాయీ వాక్యము సత్పురుషులు అంగీకరింపవలసినట్టిది. పొల్లులేనిది. సారము కలది. ఏమాత్రము గొట్టుతనము లేనిది.
ధర్మార్థ కామాః సమమేవ సేవ్యా యో హ్యేకభక్తః స నరో జఘన్యః
తయోస్తు దాక్ష్యం ప్రవదన్తి మధ్యం స ఉత్తమో యోఽభిరత స్త్రివర్గే. 40
ధర్మము, అర్థము, కామము అనువానిని ఒకేవిధముగా సేవింపవలయును. వీనిలో ఒక్కదానినే సేవించు నరుడు హీనుడు. ధర్మార్థములయందలి దక్షతను మధ్యవిధముగా చెప్పుదురు. మూడింటి సముదాయమున మిక్కిలి ప్రీతిగలవాడు ఉత్తముడు.
ప్రాజ్ఞః సుహృచ్చన్దనసారలిప్తో విచిత్ర మాల్యాభరణై రుపేతః,
తతో వచః సంగ్రహ విస్తరేణ ప్రోక్త్యాథ వీరాన్ విరరామ భీమః. 41
మిక్కిలి ప్రజ్ఞ కలవాడు, మంచి హృదయము కలవాడు, మేలైన మంచిగందపు పూత కలవాడు, వన్నెచిన్నెల పూలమాలలు ఆభరణములు కలవాడునగు భీముడు సంగ్రహముగా, విస్తరముగా వాక్యమును ఆ వీరులతో పలికి ఊరకుండెను.
తతో ముహూర్తా దథ ధర్మరాజో వాక్యాని తేషా మనుచిన్త్య సమ్యక్
ఉవాచ వాచా వితథం స్మయన్ వై లబ్ధశ్రుతాం ధర్మభృతాం వరిష్ఠః. 42
అంత ఒక్క ముహూర్తకాలము వారి వాక్యములను చక్కగా భావన చేసి శ్రద్ధగా శాస్త్రార్థములను వినిన వారిలో, ధర్మమును పరిరక్షించువారిలో శ్రేష్ఠుడగు ధర్మరాజు తేలికగా నవ్వుచు ఇట్లు పలికెను.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను.
నిఃసంశయం నిశ్చితధర్మశాస్త్రాః సర్వే భవన్తో విదిత ప్రమాణాః,
విజ్ఞాతు కామస్య మమేహ వాక్య ముక్తం యద్వై నైష్ఠికం తచ్ఛ్రుతం మే,
ఇదం త్వవశ్యం గదతో మమాపి వాక్యం నిబోధధ్వ మనన్యభావాః. 43
మీరందరు నిస్సంశయముగా ధర్మశాస్త్రములను నిర్ణయింపగలవారు. ప్రమాణములను చక్కగా ఎరిగినవారు. తెలియగోరిన నాకు తెలియబలికితిరి. సిద్ధాంతరూపమైన నా మాట గూడ మీరు వినవలయును. చెదరని హృదయములతో నేను చెప్పబోవుచున్న మాటను తప్పక తెలిసికొనుడు.
యో వై నపాపే నిరతో న పుణ్యే నార్థే న ధర్మే మనుజో న కామే,
విముక్తదోషః సమలోష్ఠకాఞ్చనో విముచ్యతే దుఃఖ సుఖార్థ సిద్ధేః. 44
పాపమునందును, పుణ్యమునందును, అర్థమునందును, ధర్మమునందును, కామమందును తగులము లేకుండు నరుడు దోషములన్నింటినుండియు విడివడినవాడై, మట్టియందును, బంగారమునందను సమభావము కలవాడై దుఃఖము సుఖము మున్నగు వాని స్థితి నుండి విముక్తి పొందును.
భూతాని జాతిస్మరణాత్మకాని జరావికారైశ్చ సమన్వితాని,
భూయశ్చ తైస్తైః ప్రతిబోధితాని మోక్షం ప్రశంసన్తి న తం చ విద్మః. 45
ప్రాణులన్నియు జాతిస్మరణ కలిగినట్టివి. ముసలితనము మొదలగు వికారములతో కూడినట్టివి. మరల ఆయా భావములతో మెలకువ పొందునట్టివి. మోక్షమును కొనియాడుచుండును. కాని దాని స్వరూపమెట్టిదో మన మెరుగము.
స్నేహేన యుక్తస్య న చాస్తి ముక్తి రితి స్వయంభూ ర్భగవా నువాచ,
బుధాశ్చ నిర్వాణపరా భవన్తి తస్మా న్న కుర్యా త్ప్రియ మప్రియం చ. 46
స్నేహముతో (తగులముతో) కూడియుండువానికి ముక్తి లేదని స్వయంభువగు భగవంతుడు చెప్పెను. పండితులు నిర్వాణమే తుదిమెట్టుగా గలవారై యుందురు. అందువలన ప్రియము, అప్రియము అనువానిని చేయరాదు.
ఏతత్ప్రధానం చ న కామకారో యథా నియుక్తోఽస్మి తథా కరోమి,
భూతాని సర్వాణి విధి ర్నియుంక్తే విధి ర్బలీయా నితి విత్త సర్వే. 47
ఇది ప్రధానము. అందువలన నేను కోరికలు త్రిప్పినట్లు తిరుగను. విధి నన్నెట్లు నియోగించునో అట్లు చేయుదును. భూతములన్నింటిని విధియే నియోగించుచున్నది. విధి అన్నిటికంటె బలము గలది యని మీరందరు ఎరుగుడు.
న కర్మణా ప్నో త్యనవాప్య మర్థం యద్భావి తద్వై భవతీతి విత్త,
త్రివర్గహీనో ఽపి హి విన్దతేఽర్థం తస్మాదహో లోకహితాయ గుహ్యమ్. 48
పొందనలవికానిదగు అర్థమును కర్మముచేత మానవుడు పొందడు. జరుగవలసినది జరుగునని యెరుగుడు. ధర్మార్థ కామముల సముదాయము లేనివాడును మోక్షము కొరకు గుహ్యమగు జ్ఞానమును పొందును.
వైశంపాయన ఉవాచ - వైశంపాయను డిట్లు చెప్పెను.
తత స్తదగ్ర్యం వచనం మనోనుగం సమస్త మాజ్ఞాయ తతో హి హేతుమత్,
తదా ప్రణేదుశ్చ జహర్షిరే చ తే కురుప్రవీరాయ చ చక్రిరేఽఞ్జలిమ్. 49
అంత మనస్సునాకట్టుకొన్న, హేతుపూర్వకమైన ఆ ధర్మరాజు చెప్పిన వాక్యము మొత్తమును చక్కగా తెలిసికొని వారందరు సంతోషముతో హర్షనాదములు చేసిరి. కురుప్రవీరునకు అంజలించిరి.
సుచారువర్ణాక్షరచారుభూషితాం మనోఽనుగాం నిర్ధుతవాక్య కణ్టకామ్,
నిశమ్య తాం పార్థివ పార్థభాషితాం గిరం నరేన్ద్రాః ప్రశశంసు రేవ చ. 50
రమణీయములగు అక్షరములతో మంజులముగా అలంకరింపబడినదియు, మనస్సు నాకర్షించినదియు, తొలగింపబడిన పాడుమాటలనెడు ముళ్లు కలదియునగు ఆ ధర్మజుని ఆ వాక్కును విని రాజులందరు ప్రశంసించిరి.
స చాపి తాన్ ధర్మసుతో మహామనా స్తదా ప్రతీతాన్ ప్రశశంస వీర్యవాన్,
పునశ్చ పప్రచ్ఛ సరిద్వరాసుతం తతః పరం ధర్మ మహీనచేతసమ్. 51
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మపర్వణి
షడ్జగీతాయాం సప్త షష్ట్యధికశతతమోఽధ్యాయః
దొడ్డబుద్ధిగల ఆ ధర్మసుతుడు ఆనందించుచున్న వారిని మెచ్చుకొనెను. మరల ఉత్తమ నదికి పుట్టినవాడు, దొడ్డ బుద్ధి గలవాడును అగు భీష్ముని పరమ ధర్మమును గూర్చి ప్రశ్న చేసెను.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున షడ్జగీత గల
నూట అరువది యేడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లు పలికెను.
పితామహ మహాప్రాజ్ఞ కురూణాం ప్రీతివర్ధన,
ప్రశ్నం కంచిత్ప్రవక్ష్యామి తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 1
తాతా! మహాప్రాజ్ఞా! కురువంశమువారికి ప్రీతిని పెంపొందించిన మహానుభావా! ఒక్క ప్రశ్న నడుగుదును. దానిని వివరించి చెప్పుము.
కీదృశా మానవాః సౌమ్యాః కైః ప్రీతిః పరమా భవేత్,
ఆయత్యాం చ తదాత్వే చ కే క్షమా స్తాన్ వదస్వ మే. 2
ఎట్టి మానవులు సౌమ్యులు? ఎవరితో ప్రీతి శ్రేష్ఠమైనదై యుండును? రాబోవు కాలమునందును, అప్పటికిని మేలు కూర్చుటకు తగినవారెవ్వరు? నాకు తెలియ జెప్పుము.
న హి తత్ర ధనం స్ఫీతం న చ సంబంధి బాన్ధవాః,
తిష్ఠన్తి యత్ర సుహృద స్తిష్ఠన్తీతి మతి ర్మమ. 3
మంచి చెలికాండ్రు ఎందు స్థిరముగా నుందురో అందు ధనము బలసి యుండదు. చుట్ట పక్కములు ఉండరు. ఇది నా అభిప్రాయము.
దుర్లభో హి సుహృచ్ఛ్రోతా దుర్లభశ్చ హితః సుహృత్,
ఏత ద్ధర్మభృతాం శ్రేష్ఠ సర్వం వ్యాఖ్యాతు మర్హసి. 4
మంచి హృదయము గల శ్రోతయు, మేలుకోరెడు చెలిమికాడును దొరకుట కష్టము కదా! ధర్మవేత్తలలో ఉత్తముడవగు తాతా! దీని నంతయు నాకు వివరించి చెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
సన్ధేయాన్ పురుషాన్ రాజ న్నసంధేయాంశ్చ తత్త్వతః,
వదతో మే నిబోధ త్వం నిఖిలేన యుధిష్ఠిర. 5
ఎవ్వరితో మైత్రి చేయవచ్చునో, ఎవరితో చేయరాదో మూలముట్టుగా చెప్పెదను. వినుము.
లుబ్ధః క్రూర స్త్యక్తధర్మా నికృతిః శఠ ఏవ చ,
క్షుద్రః పాపసమాచారః సర్వశ ఙ్కీ తథాలసః. 6
పిసినిగొట్టు, క్రూరుడు, ధర్మమును వదలి వైచినవాడు, పాపాత్ముడు, మొండివాడు, క్షుద్రుడు, పాపపుపనులు వదలక చేయుచుండువాడు, అన్నింటిని - అందరిని శంకించువాడు, సోమరి.....
దీర్ఘసూత్రోఽనృజుః క్రుష్టో గురుదార ప్రధర్షకః,
వ్యసనే యః పరిత్యాగీ దురాత్మా నిరపత్రపః. 7
పనులయందు త్వరగా ఒక నిర్ణయమునకు రాజాలనివాడు, కపటప్రవృత్తి కలవాడు, లోకపు నింద పొందినవాడు, గురుభార్యను చెరచినవాడు, కష్టకాలమున వదలిపోవువాడు, చెడుబుద్ధి కలవాడు, సిగ్గుఎగ్గు లేనివాడు .....
సర్వతః పాపదర్శీ చ నాస్తికో వేదనిన్దకః,
సంప్రకీర్ణేన్ద్రియో లోకే యః కామం నిరత శ్చరేత్. 8
అంతట పాపములనే చూచువాడు, నాస్తికుడు, వేదములను దూషించువాడు, ఇంద్రియముల లౌల్యము కలవాడు, ఎల్లప్పుడు కామభావనయందే తగులుకొని తిరుగువాడు ....
అసత్యో లోకవిద్విష్టః సమయే చానవస్థితః,
పిశునోఽథా కృతప్రజ్ఞో మత్సరీ పాపనిశ్చయః. 9
కల్లలాడువాడు, లోకులందరికి ద్వేషింపదగినవాడు, సమయమున (ఆడినమాట పై) నిలువనివాడు, లోభి, తెలివితేటలు లేనివాడు, ఇతరుల ఉన్నతిని సహింపనివాడు, పాపపు పనుల యందు నిశ్చయము కలవాడు....
దుఃశీలోఽథా కృతాత్మా చ నృశంసః కితవ స్తథా,
మిత్రై రపకృతి ర్నిత్య మిచ్ఛతేఽర్థం పరస్య యః. 10
చెడినశీలముకలవాడు, మనస్సుపై అదుపులేనివాడు, క్రూరుడు, జూదగాడు, నిత్యము మిత్రుల కపకారము చేయువాడు, పరునిసొమ్ము కోరుచుండువాడు ....
దదత శ్చ యథాశక్తి యో నతుష్యతి మన్దధీః,
అధైర్య మపి యో యుంక్తే సదా మిత్రం నరర్షభ. 11
ఇతరుడు శక్తి కొలది ఎంత ఇచ్చినను తృప్తినందనివాడు, మందబుద్ధి, ధైర్యము లేని మిత్రుని కూడ ఎప్పుడు అంటిపెట్టుకొని యుండువాడు ....
అస్థానక్రోధనో ఽయుక్తో యశ్చాక స్మా ద్విరుధ్యతే,
సుహృద శ్చైవ కల్యాణా నాశు త్యజతి కిల్బిషే . 12
కానిచోట క్రోధము వెలిగ్రక్కువాడు, శ్రద్ధలేనివాడు, అకస్మాత్తుగ విరుద్ధముగ ప్రవర్తించువాడు, మంచితనము గల మిత్రులను ఒక్కుమ్మడిగా వదలివైచువాడు, తప్పుడు పనులు చేయువాడు ....
అల్పేఽప్యపకృతే మూఢ స్తథాజ్ఞాన కృతేఽపి చ,
కార్యసేవీ చ మిత్రేషు మిత్రద్వేషీ నరాధిప. 13
ఇతరుడు చిన్న తప్పు చేసినప్పటికిని, అదియును తెలియక చేసినప్పటికిని దానిని సరిగా అర్థము చేసికొననివాడు, మిత్రులయందు తన ప్రయోజనము (పని) కొరకే మైత్రితో వర్తించువాడు, మిత్రులను ద్వేషించువాడు......
శత్రు ర్మిత్రముఖో యశ్చ జిహ్మప్రేక్షీ విలోచనః,
న విరజ్యతి కల్యాణే యః కుర్యా త్తాదృశం నరమ్. 14
మిత్రుని మొగముతో నున్న శత్రువు, వంకర చూపులవాడు, విపరీతమైన దృష్టి కలవాడు, శుభమైన పనియందు తోడునీడగా నుండు నరుని యందు పెడసరముగా నుండువాడు ....
పానపో ద్వేషణః క్రోధీ నిర్ఘృణః పరుష స్తథా,
పరోపతాపీ మిత్రధ్రుక్ తథా ప్రాణివధే రతః. 15
మద్యపానము చేయుచుండువాడు, ఊరక ద్వేషించువాడు, క్రోధము మిక్కుటముగా గలవాడు, దయలేనివాడు, కరకుతనము కలవాడు, ఇతరులను ఊరక ఉడికించువాడు, మిత్రులకు ద్రోహము చేయువాడు, ప్రాణులను వధించి సంతసించువాడు ....
కృతఘ్న శ్చాధమో లోకే న సంధేయః కదాచన,
ఛిద్రా న్వేషీ హ్యసన్ధేయః...
చేసిన మేలును మరచు అధముడు - ఎల్లవేళల తప్పులనే వెదకువాడు ఇట్టి వారిని లోకమున ఎన్నటికిని చెలిమితో కలపుకొనరాదు.
.....సంధేయా నపి మే శృణు. 16
మైత్రిని కూర్చుకొనుటకు యోగ్యులైన వారిని గూర్చి చెప్పెదను. వినుము.
కులీనా వాక్యసంపన్నా జ్ఞానవిజ్ఞాన కోవిదాః,
రూపవన్తో గుణోపేతా స్తథాఽలుబ్ధా జితశ్రమాః. 17
మంచి కులమున పుట్టినవారు, పలుకు సంపదలు కలవారు, జ్ఞాన విజ్ఞానముల యందారితేరినవారు, రూపవంతులు, గుణవంతులు, లోభగుణము లేనివారు. శ్రమకోర్చుకొనగలవారు ....
సన్మిత్రా శ్చ కృతజ్ఞా శ్చ సర్వజ్ఞా లోభవర్జితాః,
మాధుర్యగుణసంపన్నాః సత్యసన్ధా జితేన్ద్రియాః. 18
మంచి చెలిమి కలవారు, కృతజ్ఞులు, పెక్కువిషయములు తెలిసినవారు, లోభమును వదలి వైచినవారు, అందరు నిష్టపడెడు గుణములు నిండుగా గలవారు, సత్యమునకు కట్టుబడువారు, ఇంద్రియములను గెలిచినవారు .....
వ్యాయామశీలాః సతతం కులపుత్రాః కులోద్వహాః,
దోషైః ప్రముక్తాః ప్రథితా స్తే గ్రాహ్యాః పార్థివై ర్నరాః. 19
వ్యాయామము శీలముగా కలవారు, ఉత్తమ కులమున పుట్టినవారు, కులము నుద్ధరించువారు, ఎట్టి దోషములు లేనివారు, పేరు ప్రతిష్ఠలు కలవారు నగు నరులను రాజులు గ్రహింపవలయును.
యథాశక్తి సమాచారాః సంప్రతుష్యన్తి హి ప్రభో,
శక్తివంచన లేకుండ మంచి ఆచారములను పాటించువారును, లభించిన దానితో సంతోషపడువారును గ్రహింపదగిన వారు.
నాస్థానే క్రోధవన్తశ్చ న చాకస్మా ద్విరాగిణః,
విరక్తాశ్చ న దుష్యన్తి మనసాఽ ప్యర్థ కోవిదాః. 20
తగనిచోట క్రోధము చూపనివారు, హఠాత్తుగా అనురాగమును త్రెంచుకొననివారు, ప్రభువునందు ప్రీతిలేకపోయినను మనసులో కూడ దుష్టభావనలు చేయనివారు, ప్రయోజనములను సాధించుటలో ప్రజ్ఞ కలవారు.
ఆత్మానం పీడయిత్వాపి సుహృత్కర్మపరాయణాః,
విరజ్యన్తి న మిత్రేభ్యో వాసో రక్త మివావికమ్. 21
తాము కష్టపడియు మిత్రుని పనులను శ్రద్ధగా చేసి పెట్టువారు, ఎఱ్ఱని కంబళివలె మిత్రుల విషయమున రంగులు మార్చనివారు ....
క్రోధాచ్చ లోభమోహాభ్యాం నానర్థే యువతీషు చ,
న దర్శయన్తి సుహృదో విశ్వస్తా ధర్మవత్సలాః. 22
ధనము లేనివానియందు క్రోధమువలనను, లోభమోహములవలన యువతుల యందును అనిష్టభావమును చూపనివారును, మైత్రి, నమ్మకము, ధర్మమునందు వాత్సల్యము కలవారును ....
లోష్ఠకాఞ్చన తుల్యార్థాః సుహృత్సు దృఢబుద్ధయః,
యే చరన్త్యభిమానాని సృష్టార్థ మనుషఙ్గిణః. 23
మట్టిబెడ్డను, బంగారమును ఒకేవిధముగా చూడగలవారు, మిత్రులయందు దృఢమైన బుద్ధిగలవారు, అభిమానములగు శాస్త్రాదులను, ప్రారబ్ధమునుబట్టి లభించిన ధనమును బ్రదుకునకై ఉపయోగించుకొనువారు, తమ్ము తాము గొప్పగా భావింపని వారు ...
సంగృహ్ణన్తః పరిజనం స్వామ్యర్థపరమాః సదా.
ప్రభువు ప్రయోజనమే పరమలక్ష్యముగా భావించి ఎల్లప్పుడు పరిజనమును కూడగట్టుకొనువారును....
ఈదృశైః పురుషశ్రేష్ఠైర్యఃసన్ధిం కురుతే నృపః.
తస్య విస్తీర్యతే రాజ్యం జ్యోత్స్నా గ్రహపతే రివ. 24
ఇట్టి శ్రేష్ఠులగు పురుషులతో మైత్రిని సాధించు రాజు రాజ్యము చంద్రుని వెన్నెలవలె విస్తరిల్లును.
శాస్త్రనిత్యా జితక్రోధా బలవన్తో రణే సదా,
జన్మశీలగుణో పేతాః సన్ధేయాః పురుషోత్తమాః, 25
సర్వకాలములలో శాస్త్రప్రమాణములను వదలనివారు, క్రోధము నదుపులో పెట్టుకొనగలవారు, యుద్ధమున బలము చూపగలవారు, మంచి పుట్టుక, ఉత్తమ శీలము, మంచిగుణములు గల వారునగు ఉత్తమపురుషులు మైత్రి చేయదగినవారు.
యేచ దోష సమాయుక్తా నరాః ప్రోక్తా మయాఽనఘ. 26
తేషా మప్యధమా రాజన్ కృతఘ్నా మిత్రఘాతకాః,
త్యక్తవ్యాస్తు దురాచారాః సర్వేషా మితి నిశ్చయః. 27
నేను చెప్పిన దోషములు కలవారియందును, రాజా! కృతఘ్నులు, మిత్రద్రోహము చేయువారు, దురాచారులు మిక్కిలి అధములు - అందరికి వారు వదల దగినవారే అని నిశ్చయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
విస్తరేణాథ సంబన్ధం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః,
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యఃప్రోక్త స్త ద్వదస్వ మే. 28
ఈ సంబంధమును నేను లోతుగా, విస్తరముగా వినగోరుచున్నాను. మిత్రద్రోహి, కృతఘ్నుడు అని ఎట్టివాని నందురు? దానిని నాకు చెప్పుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
హన్త తే వర్తయిష్యేఽహ మితిహాసం పురాతనమ్,
ఉదీచ్యాం దిశి యద్వృత్తం మ్లేచ్ఛేషు మనుజాధిప. 29
ప్రాతకాలపు ఇతిహాసము నొకదానిని, ఉత్తరదిక్కున మ్లేచ్ఛులయందు జరిగిన దానిని చెప్పెదను. వినుము.
బ్రాహ్మణో మధ్యదేశీయః కశ్చిద్వై బ్రహ్మవర్జితః,
గ్రామం వృద్ధియుతం వీక్ష్య ప్రావిశద్భైక్ష కాంక్షయా. 30
మధ్యదేశమువాడు, వేదమును, అది చెప్పిన కర్మమును వదలివైచినవాడు ఒక బ్రాహ్మణుడు సంపదతో కూడియున్న ఒక గ్రామమును చూచి బిచ్చమెత్తుకోరికతో అందు ప్రవేవించెను.
తత్ర దస్యు ర్ధనయుతః సర్వవర్ణవిశేషవిత్,
బ్రహ్మణ్యః సత్యసన్ధశ్చ దానే చ నిరతోఽభవత్. 31
అందు అన్నివర్ణములవారి విశేషములను తెలిసినవాడు, బ్రాహ్మణభక్తి కలవాడు, సత్యమునకు కట్టుబడి యుండువాడు, దానము నందు శ్రద్ధ కలవాడు, ధనవంతుడునగు ఒక దొంగ యుండెడివాడు.
తస్య క్షయ ముపాగమ్య తతో భిక్ష మయాచత,
ప్రతిశ్రయం చ వాసార్థం భిక్షాం చైవాథ వార్షికీమ్. 32
ఆత డీతని యింటికరిగి ఉండుటకు ఒక యింటిని, ఏడాదికి సరిపడు భిక్షను యాచించెను.
ప్రాదాత్తస్మై స విప్రాయ వస్త్రం చ సదశం నవమ్,
నారీం చాపి వయోపేతాం భర్త్రా విరహితాం తథా. 33
ఆత డావిప్రునకు మంచి అంచులు గల క్రొత్త వస్త్రమును, మంచి వయస్సులో నున్నదియు, భర్త లేనిదియు నగు ఒక యింతిని ఒసగెను.
ఏతత్సంప్రాప్య హృష్టాత్మా దస్యోః సర్వం ద్విజ స్తథా,
తస్మిన్ గృహవరే రాజం స్తయా రేమే స గౌతమః. 34
దొంగనుండి దీనిని పొంది పొంగిన హృదయము గల గౌతముడు, ఆతని యింట నివసించుచు ఆమెతో రమింపజొచ్చెను.
కుటుంబార్థం చ దాస్యాశ్చ సాహాయ్యం చాప్యథాకరోత్,
తత్రావసత్స వర్షాంశ్చ సమృద్దే శబరాలయే. 35
ఆ దాసి కుటుంబముకొరకు, ఆ దాసికి తోడ్పడుటకును ఆతడు ఏర్పాటు చేసెను. అట్లా గౌతముడు ఆ బోయవాని సమృద్ధిగల యింట కొన్నియేండ్లుండెను.
బాణవేధే పరం యత్న మక రోచ్చైవ గౌతమః,
చక్రాంగాన్ స చ వై నిత్యం సర్వతో వనగోచరాన్. 36
జఘాన గౌతమో రాజన్ యథా దస్యుగణా స్తథా,
ఆ గౌతముడు బాణములతో కొట్టుటలో గొప్ప అభ్యాసము చేసెను. ప్రతిదినము అడవిలో కానవచ్చెడు హంసలను, బోయమూకల వలె, చంప నారంభించెను.
హింసాపటు ర్ఘృణాహీనః సదా ప్రాణివధే రతః.
గౌతమః సన్నికర్షేణ దస్యుభిః సమతామియాత్, 37
ఆ గౌతముడు హింసలో ఆరితేరినవాడు, దయాదాక్షిణ్యములు లేనివాడు, ప్రాణులను చంపుటలో ప్రీతి గలవాడునై ఆ బోయవారి దగ్గరతనము చేత వారికి సమానుడాయెను.
తథా తు వసత స్తస్య దస్యుగ్రామే సుఖం తదా,
అగమన్ బహవోమాసా నిఘ్నతః పక్షిణో బహూన్. 38
అట్లు దస్యుల పల్లెలో ఆతడు నివసించుచు పెక్కు పక్షులను చంపుచు పెక్కునెలలు గడపెను.
తతః కదాచి దపరో ద్విజ స్తం దేశభాగతః, 39
జటాచీరాజినధరః స్వాధ్యాయపరమః శుచిః,
వినీతో నియతాహారో బ్రహ్మణ్యో వేదపారగః. 40
అంత కొంతకాలమునకు ఆ గౌతముడున్న దేశభాగమునుండి మరియొక విప్రుడరుదెంచెను. ఆతడు జడలు, నారచీరలు, లేడిచర్మములను తాల్చినవాడు, వేదములను వల్లెవేయుటలో మిక్కిలి శ్రద్ధ కలవాడు, పవిత్రుడు, వినయవంతుడు, ఆహారమునందు నియమములు కలవాడు, బ్రహ్మజ్ఞాని, వేదములను తుదిముట్ట నభ్యసించినవాడు.
స బ్రహ్మచారీ తద్దేశ్యః సఖా తస్యైవ సుప్రియః,
తం దస్యుగ్రామ మగమ ద్యత్రాసౌ గౌతమోఽవసత్. 41
ఆ బ్రహ్మచారి గౌతముని దేశమునకు సంబంధించినవాడు. అతనికి చెలిమి కాడు. మిక్కిలి యిష్టుడు. గౌతముడున్న ఆశబరుల పల్లెకు వచ్చెను.
సతు విప్రగృహాన్వేషీ శూద్రాన్నపరివర్జకః,
గ్రామే దస్యుసమాకీర్ణే వ్యచరత్సర్వతో దిశమ్. 42
అతడు శూద్రుల అన్నమును తినువాడు కాని కారణమున విప్రుల యిండ్లను వెదకుచు శబరులతో నిండిన ఆ గ్రామమున అన్నివైపులను తిరుగుచుండెను.
తతః స గౌతమగృహం ప్రవివేశ ద్విజోత్తమః,
గౌతమ శ్చాపి సంప్రాప్త స్తా వన్యోన్యేన సంగతౌ. 43
అట్లు తిరుగుచు ఆ విప్రశ్రేష్ఠుడు గౌతముని యింటిలోనికి ప్రవేశించెను. గౌతముడును అప్పుడే యింటికి వచ్చుచుండెను. వారిరువురు ఒకరినొకరు కలసి కొనిరి.
చక్రాఙ్గ భారస్కన్ధం తం ధనుష్పాణిం ధృతాయుధమ్,
రుధిరేణావసిక్తాంగం గృహద్వార ముపాగతమ్. 44
తం దృష్ట్వా పురుషాదాభ మపధ్వస్తం క్షయాగతమ్,
అభిజ్ఞాయ ద్విజో వ్రీడ న్నిదం వాక్య మథా బ్రవీత్. 45
హంసల మోపును బుజమున పెట్టుకొని వింటిని, ఆయుధములను తాల్చి, రక్తముతో తడిసిన శరీరముతో ఇంటి ద్వారము కడకు వచ్చిన ఆతనిని చూచి, నరమాంసము తినెడు రక్కసుని వలె, వెలివేయబడినట్లున్న వానిని గుర్తించి ఈ బాపడు సిగ్గుపడుచు నిట్లు పలికెను.
కిమిదం కురుషే మోహా ద్విప్ర స్త్వం హి కులోద్వహః,
మధ్యదేశ పరిజ్ఞాతో దస్యుభావం గతః కథమ్. 46
ఇదేమి పని చేయుచున్నావురా! నీవు విప్రుడవు. కులమునుద్ధరింప వలసినవాడవు. మధ్యదేశమున అందరకు తెలిసినవాడవు. ఈ బోయతనము నెట్లు పొందితివి?
పూర్వాన్ స్మర ద్విజజ్ఞాతీన్ ప్రఖ్యాతాన్ వేదపారగాన్,
తేషాం వంశేఽభిజాతస్త్వ మీదృశః కులపాంసనః. 47
మీ పూర్వులు సుప్రసిద్ధులు, వేదము తుదిముట్ట చదివినవారు. వారినొక్కమారు గుర్తు తెచ్చుకొనుము. అట్టి వారి వంశమున పుట్టిన నీవిట్లు కులమును చెరచువాడవయితివి.
అవబుధ్యా త్మనాత్మానం సత్వం శీలం శ్రుతం దమమ్,
అనుక్రోశం చ సంస్మృత్య త్యజ వాస మిమం ద్విజ. 48
నిన్ను నీవు చక్కగా తెలిసికొని, శీలము, చదువు, నిగ్రహము, దయను స్మరించి యీపాడు కొంపను వదలివేయుము.
స ఏవ ముక్తః సుహృదా తేన తత్ర హితైషిణా,
ప్రత్యువాచ తతో రాజన్ వినిశ్చిత్య తదార్తవత్. 49
ప్రాణమిత్రము, తన మేలుకోరువాడునగు ఆతడట్లు పలుకగా వాడు లోలోపల కుములుచున్న వానివలె నగుచు మనసున నిర్ణయించుకొని యిట్లు బదులు పలికెను.
నిర్ధనోఽస్మి ద్విజశ్రేష్ఠ నా పి వేదవిదప్యహమ్,
విత్తార్థ మిహ సంప్రాప్తం విద్ధి మాం ద్విజసత్తమ. 50
బ్రాహ్మణవరేణ్యా! నేను చిల్లిగవ్వయు లేనివాడను. వేదవిద్య నెరుగనివాడను. ధనముకొరకిట వచ్చితిని. అని ఎరుగుము.
త్వద్దర్శనాత్తు విప్రేన్ద్ర కృతార్థోఽస్మ్యద్య వై ద్విజ,
ఆవాం హి సహ యాస్యావః శ్వో వస స్వాద్య శర్వరీమ్. 51
నిన్ను చూచుటవలన కృతార్థుడ నైతిని. విప్రశ్రేష్ఠా! రేపు మన మిద్దరము కలసి వెళ్లిపోవుదము. ఈ రాత్రి కిందు నిలువుము.
స తత్ర వ్యవస ద్విప్రో ఘృణీ కిఞ్చి దసంస్పృశన్,
క్షుధిత శ్ఛన్ద్యమానోఽపి భోజనం నాభ్యనన్దత. 52
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి ఆపద్ధర్మ పర్వణి కృతఘ్నోపాఖ్యానే
అష్టషష్ట్యధిక శతతమోఽధ్యాయః
జాలిదలచి ఆ బాపడు, దేనిని ముట్టుకొనక, ఎంత బ్రతిమాలినను అన్నము తినక అక్కడ నిలిచెను.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున కృతఘ్నుని ఉపాఖ్యానమున నూట అరువది ఎనిమిదవ అధ్యాయము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
తస్యాం నిశాయాం వ్యుష్టాయాం గతే తస్మిన్ ద్విజోత్తమే,
నిష్క్రమ్య గౌతమోఽగచ్ఛత్ సముద్రం ప్రతి భారత. 1
ఆరాత్రి గడువగా ఆ బ్రాహ్మణుడు వెడలిన తరువాత గౌతముడిల్లు వెడలి సముద్రము వైపు పోయెను.
సాముద్రికాన్ స వణిజ స్తతోఽపశ్యత్ స్థితాన్ పథి,
స తేన సహ సార్థేన ప్రయయౌ సాగరం ప్రతి. 2
అంత దారిలో సముద్ర తీరమున సంచరించు వర్తకుల నాతడు చూచి ఆ గుంపుతో కలిసి సముద్రము వైపున కరిగెను.
స తు సార్థో మహాన్ రాజన్ కస్మింశ్చి ద్గిరి గహ్వరే,
మత్తేన ద్విరదే నాథ నిహతః ప్రాయశోఽభవత్. 3
ఆ వర్తకుల గుంపు ఒకానొక కొండ అడవిలో మదించిన ఏనుగు త్రొక్కిడికి చెల్లాచెదరైపోయెను.
స కథంచి ద్భయా త్తస్మా ద్విముక్తో బ్రాహ్మణ స్తథా,
కాందిగ్భూతో జీవితార్థీ ప్రదుద్రా వోత్తరాం దిశమ్. 4
ఎట్లో వాడాభయమునుండి బయటపడి దిక్కుతోచక, బ్రదుకు పై కోరికతో ఉత్తరము వైపుగా పరువెత్తెను.
సతు సార్థ పరిభ్రష్ట స్తస్మాద్దేశా త్తథా చ్యుతః,
ఏకాకీ వ్యచరత్తత్ర వనే కింపురుషో యథా. 5
గుంపునుండి తప్పిపోయినవాడై, ఆ ప్రదేశమును వదలివైచి దారియు తెన్నును లేనివాని వలె, ఒంటరిగా ఆ అడవిలో తిరుగజొచ్చెను.
స పన్థాన మథా సాద్య సముద్రాభిసరం తదా,
ఆససాద వనం రమ్యం దివ్యం పుష్టిత పాదపమ్. 6
సముద్రము వైపునకు పోవు దారిని బట్టి ఆతడు పోవుచు విరుగబూచిన చెట్లుగల దివ్యము,సుందరమునగు వనమును చేరుకొనెను.
సర్వర్తుకై రామ్రవణైః పుష్పితై రుపశోభితమ్,
నన్దనోద్దేశ సదృశం యక్ష కిన్నర సేవితమ్. 7
ఆ వనమున అన్ని ఋతువులలో పండెడు మామిడితోటలు పూచి యలరారుచుండెను.నందనవనమునకు సాటియగు ఆ వనము యక్షులతో, కిన్నరులతో ఒప్పారుచుండెను.
శాలై స్తాలై స్తమాలైశ్చ కాలాగురువనై స్తథా,
చన్దనస్య చ ముఖ్యస్య పాదపై రుపశోభితమ్.
గిరి ప్రస్థేషు రమ్యేషు తేషు తేషు సుగన్ధిఘ. 8
సాలములు, తాటిచెట్లు, కానుగలు, నల్లని అగురుచెట్లు, శ్రేష్ఠమగు మంచిగందపు చెట్లతో ఆ వనము విరాజిల్లుచుండెను. అందమైన కొండచరియలలో పరిమళములు వెదజల్లుచు ఆ చెట్లు కన్నుల పండువు చేయుచుండెను.
సమన్తతో ద్విజశ్రేష్ఠా స్తత్రా కూజన్త వై తదా,
మనుష్య వదనా శ్చాన్యే భారుణ్డా ఇతి విశ్రుతాః. 9
మానవముఖముల వంటి ముఖముగల భారుండములనెడు పక్షులందు కమ్మని సవ్వడి చేయుచుండెను.
స తాన్యతి మనోజ్ఞాని విహగానాం రుతాని వై,
శృణ్వన్ సురమణీయాని విప్రో గచ్ఛత గౌతమః. 10
మనస్సు నాకట్టుకొను ఆ పక్షుల కలనాదములను వినుచు ఆ గౌతముడను విప్రుడు ముందుకు సాగిపోయెను.
తతోఽపశ్య త్సురమ్యేషు సువర్ణసికతాచితే,
దేశే సమే సుఖే చిత్రే స్వర్గో ద్దేశసమే నృప 11
శ్రియా జుష్టం మహావృక్షం న్యగోధ్రం చ సుమణ్డలమ్. 12
అందు కన్నులకింపైన తావులందొకచోట పసిమివన్నె ఇసుకగల సమము, సుఖము, చిత్రము, స్వర్గధామమా యన్నట్లున్నదియగు ఒక తావున నిలువెల్ల శోభతో వెలుగొందుచు పెద్ద మండలము గలది, గొప్పదియగు ఒక రావిచెట్టును గాంచెను.
శాఖాభి రనురూపాభి ర్భూయిష్ఠం ఛత్ర సన్నిభమ్,
తస్య మూలం చ సంసిక్తం వరచన్దన వారిణా. 13
దాని వైశాల్యమునకు తగిన పెనుకొమ్మలతో విప్పిన గొడుగువలె పెద్దగా ఒప్పియుండెను. దానికుదురు శ్రేష్ఠమగు మంచిగంధపు నీటితో తడిసి యుండెను.
దివ్యపుష్పాన్వితం శ్రీమత్పితామహ సభోపమమ్,
తం దృష్ట్వా గౌతమః ప్రీతో మనః కాన్త మనుత్తమమ్. 14
మేధ్యం సురగ్రహప్రఖ్యం పుష్పితైః పాదపై ర్వృతమ్.
తమాసాద్య ముదాయుక్త స్తస్యాధస్తా దుపావిశత్. 15
దివ్యములగు పూవులతో కూడి శోభలు నిండినదై ఆవృక్షము బ్రహ్మసభను పోలియుండెను. ఆ గౌతముడు దానినిచూచి ప్రీతుడై మనస్సునకు ఇంపు నింపునట్టిది, మిక్కిలి ఉత్తమమైనది, పవిత్రమైనది, దేవతల సముదాయము వలె ప్రస్తుతి కెక్కినది, పూచినచెట్లు చుట్టుకొని యున్నది యగు దానికడకు చేరుకొని ఆనందము వెల్లివిరియగా ఆచెట్టు క్రింద కూర్చుండెను.
తత్రా సీనస్య కౌన్తేయ గౌతమస్య సుఖః శివః,
పుష్పాణి సముపస్పృశ్య ప్రవవా వనిలః శుభః.
హ్లాదయన్ సర్వగాత్రాణి గౌతమస్య తదా నృప. 16
ఆ గౌతము డట్లు కూర్చుండగా పూవులను మెల్లగా తాకివచ్చిన శుభమైన వాయువు ఆతని శరీరభాగము లన్నింటిని ఆనంద పెట్టుచు సుఖముగా వీచెను.
సతు విప్రః ప్రశాన్తశ్చ స్పృష్టః పుణ్యేన వాయునా,
సుఖ మాసాద్య సుష్వాప భాస్కర శ్చాస్త మభ్యయాత్. 17
ఆ విప్రుడును, ప్రశాంతముగా నున్నవాడై చక్కని పరిమళముగల గాలి తాకుచుండగా సుఖముగా నిద్రపోయెను. ఇంతలో సూర్యుడును అస్తమించెను.
తతోఽస్తం భాస్కరే యాతే సన్ధ్యాకాల ఉపస్థితే,
ఆజగామ స్వభవనం బ్రహ్మలోకాత్ ఖగోత్తమః. 18
అట్లు సూర్యు డస్తమింపగా సంధ్యాకాలము రాగా పక్షి రాజొకడు బ్రహ్మలోకమునుండి తనయింటి కరుదెంచెను.
నాడీజంఘ ఇతి ఖ్యాతో దయితో బ్రహ్మణః సఖా,
బకరాజో మహాప్రాజ్ఞః కశ్యప స్యాత్మ సంభవః. 19
అతని పేరు నాడీజంఘుడు. బ్రహ్మకు ప్రియమైన నెచ్చెలి. కొంగలరాజు. గొప్పప్రజ్ఞ కలవాడు. కశ్యపుని కుమారుడు.
రాజధర్మేతివిఖ్యాతో బభూ వాప్రతిమో భువి,
దేవకన్యాసుతః శ్రీమాన్ విద్వాన్ దేవసమప్రభః. 20
రాజధర్ముడని పేరుగన్నవాడు, భూమిపై సాటిలేనివాడు. దేవకన్య కుమారుడు. సంపదగలవాడు. విద్వాంసుడు. దేవతలతో సమమైన దేహ శోభకలవాడు.
మృష్టాభరణ సంపన్నో భూషణై రర్కసన్నిభైః,
భూషితః సర్వగాత్రేషు దేవగర్భః శ్రియా జ్వలన్. 21
సూర్యునివలె వెలుగొందుచున్న సమృద్ధములగు భూషణములతో అన్ని అంగముల నలంకరించుకొన్నవాడు.
త మాగతం ఖగం దృష్ట్వా గౌతమో విస్మితోఽభవత్,
క్షుత్పిపాసా పరిశ్రాన్తో హింసార్థీ చాభ్యవైక్షత. 22
అట్లు వచ్చుచున్న పక్షిని చూచి గౌతముడు విస్మయమందెను. ఆకలిదప్పుల కలమటించినవాడు కావున దానిని హింసింపగోరినవాడై అదను చూచుచుండెను.
రాజధర్మోవాచ - రాజధర్ము డిట్లనెను.
స్వాగతం భవతో విప్ర దిష్ట్యా ప్రాప్తోఽసి మే గృహమ్,
అస్తంచ సవితా యాతః సన్ద్యేయం సముపస్థితా. 23
విప్రా! నీకు స్వాగతము. అదృష్టవశమున నాయింటికి చేరుకొంటివి. సూర్యుడస్తమించెను. సంజవేళ ఆయెను.
మమ త్వం నిలయం ప్రాప్తః ప్రియాతిథి, రనిన్దితః,
పూజితో యాస్యసి ప్రాత ర్విధిదృష్టేన కర్మణా. 24
ఇతి శ్రీమహాభారతే ఆపద్ధర్మపర్వణి కృతఘ్నోపాఖ్యానే
ఏకోనసప్తత్యధికశతతమోఽధ్యాయః
నీవు నాయింటికి వచ్చితివి, ప్రియమైన అతిథివి. ఏదోషము లేనివాడవు. నా మన్ననలు గొని, రేపు ఉదయమున నీపనిపై నీవు పోవచ్చును.
ఇది మహాభారత శాంతిపర్వమున ఆపద్ధర్మ పర్వమున కృతఘ్నోపాఖ్యానమున
నూటఅరువది తొమ్మిదవ అధ్యాయము
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
గిరం తాం మధురాం శ్రుత్వా గౌతమో విస్మిత స్తదా,
కౌతూహలాన్వితో రాజన్ రాజధర్మాణ మైక్షత. 1
తీయనైన ఆ మాటలు విని గౌతము డచ్చెరు వందెను. వేడుక మీరగా ఆ రాజ ధర్ముని గాంచెను.
రాజధర్మోవాచ- రాజధర్ము డిట్లనెను.
భోః కశ్యపస్య పుత్రోఽహం మాతా దాక్షాయణీ చ మే.
అతిథి స్త్వం గుణోపేతః స్వాగతం తే ద్విజోత్తమ. 2
అయ్యా! నేను కశ్యపుని పుత్రుడను. మా అమ్మగారు దాక్షాయణి. మంచి గుణములు గల అతిథివి నీవు. విప్రశ్రేష్ఠా! నీకు స్వాగతము.
భీష్మ ఉవాచ - భీష్ముడిట్లు చెప్పెను.
తస్మై దత్వా స సత్కారం విధిదృష్టేన కర్మణా,
శాల పుష్ప మయీం దివ్యాం బృసీం వై సమకల్పయత్. 3
విధానము ననుసరించి అతడాతనికి సత్కారము కావించి శాలపుష్పములతో నిండిన దివ్యమగు పాన్పు నేర్పరచెను.
భగీరథ రథాక్రాన్త దేశాన్ గఙ్గానిషేవితాన్,
యే చరన్తి మహా మీనాం స్తాంశ్చ తస్యా న్వ కల్పయత్. 4
భగీరథుని రథము సాగిన దేశములందు గంగ జాలువారిన తావులందు తిరిగెడు గొప్ప చేపలను అతనికై కూర్చెను.
వహ్నిం చాపి సుసందీప్తం మీనాం శ్చాపి సుపీవరాన్,
స గౌతమా యాతిథయే న్యవేదయత కాశ్యపిః. 5
కశ్యపుని కుమారుడగు ఆ నాడీజంఘుడు చక్కగా మండెడు అగ్నిని బాగుగా బలసిన చేపలను అతిథియగు గౌతమున కమర్చెను.
భుక్తవన్తం చ తం విప్రం ప్రీతాత్మానం మహాతపాః,
క్లమాపనయనార్థం సపక్షాభ్యా మభ్యవీజయత్. 6
తనివితీర తిన్న ఆ విప్రుని శ్రమను పోగొట్టుటకై ఆ మహాతపస్వి తన రెక్కలతో మెల్లగా వీచెను.
తతో విశ్రాన్త మాసీనం గోత్ర ప్రశ్న మపృచ్ఛత,
సోఽబ్రవీ ద్గౌతమోఽస్మీతి బ్రహ్మ నాన్య దుదాహరత్. 7
విశ్రాంతి కొని కూర్చున్న ఆ బాపనిని ఆ పక్షిరాజు గోత్రమును గూర్చి ప్రశ్నించెను. అతడును నేను బ్రాహ్మణుడను గౌతముడనని చెప్పెను. మరియేమియు చెప్పకుండెను.
తస్మై పర్ణమయం దివ్యం దివ్య పుప్పాధివాసితమ్,
గన్ధాఢ్యం శయనం ప్రాదాత్స శిశ్యే తత్ర వై సుఖమ్. 8
పక్షిరాజు ఆకులతో నమరించినది, దేవపుష్పముల సువాసనలను విరజిమ్మునది యగు శయనము నాతని కొసగెను.అందాతడు సుఖముగా నిదురించెను.
అథోపవిష్టం శయనే గౌతమం ధర్మరాట్ తదా,
పప్రచ్ఛ కాశ్యపో వాగ్మీ కి మాగమన కారణమ్. 9
పిదప లేచి పాన్పుపై కూర్చున్న ఆ గౌతముని, ధర్మముతో విరాజిల్లువాడు, కశ్యపునికుమారుడు, మాట నేర్పరి యగు ఆ రాజధర్ముడు నీ రాకకు కారణమేమి యని యడిగెను.
తతోఽబ్రవీ ద్గౌతమ స్తం దరిద్రోఽహం మహామతే,
సముద్ర గమనా కాంక్షీ ద్రవ్యార్థమితి భారత! 10
అంత నాతడు మహామతీ! నేను దరిద్రుడను, ధనము కొరకు సముద్రము పై ఇతర దేశములకు పోగోరుచున్నాను -అని చెప్పెను.
తం కాశ్యపోఽబ్రవీ త్ర్పీతో నోత్కంఠాం కర్తు మర్హసి,
కృతకార్యో ద్విజ శ్రేష్ఠ సద్రవ్యో యాస్యసే గృహాన్. 11
ఓయి ద్విజవరా! నీవు బెంగపెట్టు కొనకుము. నీపని అయినట్లే భావింపుము. ధనము కలవాడవై యింటి కరిగెదవు అని కాశ్యపుడు ప్రీతి పూర్వకముగా పలికెను.
చతుర్విధా హ్యర్థ సిద్ధి ర్బృహస్పతి మతం యథా,
పారంపర్యం తథా దైవం కామ్యం మైత్ర మితి ప్రభో. 12
అర్థము లభించుట బృహస్పతి భావన ననుసరించి నాలుగు విధములుగా నుండును. తండ్రి తాతల వరుసను వచ్చునది, అదృష్టమును బట్టి ఏర్పడునది, కోరిక ననుసరించి సాధించునది. మిత్రుల వలన పొందునది.
ప్రాదుర్భూతోఽస్మి తే మిత్రం సుహృత్త్వం చ మమ త్వయి,
సోఽహం తథా యతిష్యామి భవిష్యసి యథార్థవాన్. 13
నీకు నేను చెలినైతిని. నాకు నీయందు చెలిమి ఏర్పడినది. కావున నీవు ధనవంతుడగునట్లు నేను ప్రయత్నించెదను.
తతః ప్రభాత సమయే సుఖం దృష్ట్వాఽబ్రవీ దిదమ్,
గచ్ఛ సౌమ్య పథానేన కృత కృత్యో భవిష్యసి. 14
అంత తెల్లవారిన సమయమున సుఖముగా నున్న అతనిని రాజధర్ముడు సౌమ్యుడా! యీదారిని పొమ్ము. కృత కృత్యుడ వయ్యెదవు.
ఇత స్త్రియోజనం గత్వా రాక్షసాధిపతి ర్మహాన్,
విరూపాక్ష ఇతి ఖ్యాతః సఖా మమ మహాబలః, 15
ఇట నుండి మూడు ఆమడలు పోగా అచట గొప్ప రాక్షసరాజు కలడు. విరూపాక్షుడని పేరుగన్న వాడు. గొప్ప బలముగల ఆతడు నాకు మిత్రము.
తం గచ్ఛ ద్విజముఖ్య త్వం స మద్వాక్య ప్రచోదితః,
కామా నభీప్సితాం స్తుభ్యం దాతా నాస్త్యత్ర సంశయః. 16
ఓయి బ్రాహ్మణా! నీ వాతని కడ కరుగుము.నామాటపై నాతడు నీకు కోరిన దెల్ల నొసగును. ఇందు సంశయము లేదు.
ఇత్యుక్తః ప్రయయౌ రాజన్ గౌతమో విగతక్లమః,
ఫలా న్యమృత కల్పాని భక్షయన్ స యథేష్టతః. 17
అని కాశ్యపుడు పలుకగా గౌతముడు దిగులు తీరినవాడై ఇచ్చవచ్చినట్లు అమృతమునకు సాటి వచ్చు పండ్లను తినుచు నత డరిగెను.
చన్దనాగురుముఖ్యాని త్వ త్పత్రాణాం వనాని చ,
తస్మిన్ పథి మహారాజ సేవమానో ద్రుతం యయౌ. 18
మంచి గందపు చెట్లు,అగురుచెట్లు మున్నగు వానిని, లవంగపు తోటలను మార్గమున రుచిగొనుచు అతడు వడివడిగా నరుగజొచ్చెను.
తతో మేరు ప్రజం నామ నగరం శైల తోరణమ్,
శైల ప్రాకార వస్త్రం చ శైల యన్త్రా కులం తథా. 19
పిమ్మట అతడు పర్వతముల తోరణములు, పర్వతముల ప్రాకారములు, పర్వతముల యంత్రములతో నిండిన మేరువ్రజమను నగరమును గాంచెను.
విదిత శ్చాభవ త్త స్య రాక్షసేన్ద్ర స్య ధీమతః,
ప్రహితః సుహృదా రాజన్ ప్రీయమాణః ప్రియాతిథిః. 20
బుద్ధి శాలియగు రాక్షసరాజునకు, తన చెలికాడు ప్రీతితో పంపిన ప్రియమైన అతిథి వచ్చెనని తెలిసెను.
తతః స రాక్షసేన్ద్రః స్వాన్ ప్రేష్యా నాహ యుధిష్ఠిర,
గౌతమో నగరద్వారా చ్ఛీ ఘ్ర మానీయతా మితి. 21
యుధిష్ఠిరా! అంత ఆ రాక్షసరాజు తన సేవకులతో ఆ గౌతముని నగరద్వారమునుండి త్వరగా కొని రండని పలికెను.
తతః పురవరా త్తస్మా త్పురుషాః శ్యేన చేష్టనాః,
గౌతమే త్యభి భాషన్తః పురద్వార ముపాగమన్. 22
అంత నా సేవకులు పురవరము నుండి డేగల వలె ఎగురుచుపోయి గౌతమా!గౌతమా!అని పిలుచుచు పురద్వారము కడ కరిగిరి.
తే తమూచు ర్మహారాజ రాజప్రేష్యా స్తదా ద్విజమ్,
త్వరస్వ తూర్ణ మా గచ్ఛ రాజా త్వాం ద్రష్టు మిచ్ఛతి. 23
మహారాజా! రాజు పంపిన ఆ సేవకులు ఆ బాపనితో అయ్యా! త్వరపడుము. వడిగా పద! రాజు నిన్ను చూడగోరుచున్నాడని పలికిరి.
రాక్షసాధిపతి ర్వీరో విరూపాక్ష ఇతి శ్రుతః,
స త్వాం త్వరతి వై ద్రష్టుం తత్ క్షిప్రం సంవిధీయతామ్. 24
రాక్షసుల రాజు,వీరుడు, విరూపాక్షుడనువాడు నిన్ను చూచుటకు త్వరపడుచున్నాడు. కనుక త్వరగా నాతని కడకు రావలయును.
తతః స ప్రాద్రవ ద్విప్రో విస్మయా ద్విగతక్లమః,
గౌతమః పరమర్ధిం తాం పశ్యన్ పరమవిస్మితః. 25
అంత నాగౌతముడు అలసట తీరినవాడై పరమాశ్చర్యముతో అతని మహాసంపదను చూచుచు పరుగున అతని కడ కరిగెను.
తై రేవ సహితో రాజ్ఞో వేశ్మ తూర్ణ ముపాద్రవత్,
దర్శనం రాక్షసేన్ద్రస్య కాంక్షమాణో ద్విజ స్తదా. 26
ఇతి శ్రీ మహా భారతే శాన్తి పర్వణి ఆపద్ధర్మ పర్వణి కృతఘ్నోపాఖ్యానే
సప్తత్యధిక శతతమోఽధ్యాయః
అంత నా బాపనయ్య వారితో కలిసి రాక్షసేంద్రుని దర్శనమును కోరుచు రాజభవమును పరుగులెత్తుచు ప్రవేశించెను.
ఇది శ్రీ మహాభారతము శాంతి పర్వమున ఆపద్ధర్మ పర్వమున
కృత ఘ్నోపాఖ్యానమున నూట డెబ్బదియవ అధ్యాయము.
ఏకషష్ట్యధిక శతతమోఽధ్యాయః
161
తపస్సు ప్రశంస
161
162
ద్విషష్ట్యధిక శతతమోఽధ్యాయః
సత్య ప్రశంస
162
త్రిషష్ట్యధిక శతతమోఽధ్యాయః
163
లోభమును నిరూపించుట
163
164
చతుఃషష్ట్యధిక శతతమోఽధ్యాయః
క్రూరుని విషయము
164
పఞ్చ షష్ట్యధిక శతతమోఽధ్యాయః
165
ప్రాయశ్చిత్తవిధి
165
షట్షష్ట్యధిక శతతమోఽధ్యాయః
166
ఖడ్గము పుట్టుక
166
సప్తషష్ట్యధిక శతతమోఽధ్యాయః
167
షడ్జ గీత
167
అష్టషష్ట్యధిక శతతమోఽధ్యాయః
168
కృతఘ్నుని కథ
168
ఏకోనసప్తత్యధిక శతతమోఽధ్యాయః
169
కృతఘ్నుని కథ
169
170
సప్తత్యధిక శతతమోఽధ్యాయః
కృతఘ్నుని కథ
170