| Book | Shanthi Parvam-II |
|---|---|
| Chapter No | 11 |
| Pages | 93 |
| Read Time | 102 Minutes |
ఏకాధిక ద్విశతతమోఽధ్యాయః
యుధిష్ఠిర ఉవాచ - ధర్మరా జిట్లనెను
కిం ఫలం జ్ఞానయోగస్య వేదానాం నియమస్య చ,
భూతాత్మా చ కథం జ్ఞేయ స్తన్మే బ్రూహి పితామహ. 1
తాతా! జ్ఞానయోగము ఫలమేమి? వేదములను అధ్యయనము చేయగా కలుగు ఫలమెట్టిది? నియమమునకు ఫలమేమి? జీవుని గూర్చి తెలియదగు విధమేది? దీనిని నాకు తెలియజెప్పుము.
భీష్మ ఉవాచ -భీష్ము డిట్లు చెప్పెను.
అత్రా ప్యుదాహ రన్తీమ మితిహాసం పురాతనమ్,
మనోః ప్రజాపతే ర్వాదం మహర్షి శ్చ బృహస్పతేః 2
ఇందును ప్రాతకాలపు ఇతిహాసమును చెప్పుకొనుచుందురు. అది ప్రజాపతియగు మనువునకును, మహర్షి బృహస్పతికిని అయిన సంవాదము.
ప్రజాపతిం శ్రేష్ఠతమం ప్రజానాం
దేవర్షిసంఘప్రవరో మహర్షిః,,
బృహస్పతిః ప్రశ్న మిమం పురాణం
పప్రచ్ఛ శిష్యోఽథ గురుం ప్రణమ్య. 3
ప్రజలలో మిక్కిలి గొప్పవాడగు ప్రజాపతిని గురువుగా భావించి దేవర్షుల సముదాయములో శ్రేష్ఠుడు, మహర్షి అయిన బృహస్పతి, శిష్యుడై ప్రణమిల్లి ప్రాతకాలపు ఈప్రశ్నను అడిగెను.
యత్కారణం యత్ర విధిః ప్రవృత్తో
జ్ఞానే ఫలం యత్ర వదన్తి విప్రాః,
యన్మన్త్ర శబ్దై రకృత ప్రకాశం
తదుచ్యతాం మే భగవన్ యథావత్. 4
ఓ భగవంతుడా! ఈజగత్తునకు కారణమేదో, ఏకారణముగా కర్మకాండము ఏర్పడినదో, జ్ఞానము కలుగగా ఏ ఫలము సమకూడునని విప్రులు చక్కగా వక్కాణింతురో, ఏది మంత్రశబ్దములచేత విస్పష్టముగా తెలియరాదో దానిని ఉన్నదున్నట్లు నాకు తెలియజెప్పుము.
యచ్చార్థశాస్త్రాగమ మన్త్రవిద్భి -
ర్యజ్ఞై రనేకై రథ గోప్రదానైః,
ఫలం మహద్భి ర్యదుపాస్యతే చ
కిం తత్కథం వా భవితా క్వ వా తత్. 5
అర్థశాస్త్రములను, ఆగమములను, మంత్రములను తెలిసినవారు పెక్కు యజ్ఞములతోడను, రథములను గోవులను పెల్లుగా దానమిచ్చుటలచేతను, ఇంకను గొప్పవారిచేత ఏఫలము ఉపాసింపబడుచున్నదో అది ఏమి?, దానిని పొందుటెట్లు? ఎందు లభించును?
మహీ మహీజాః పవనోఽన్తరిక్షం
జలౌకస శ్చైవ జలం దివం చ,
దివౌకస శ్చాపి యతః ప్రసూతా
స్తదుచ్యతాం మే భగవన్ పురాణమ్. 6
ఈభూమి, దానియందేర్పడిన స్థావరములు, జంగమములు, వాయువు, అంతరిక్షము, నీటిజీవులు, నీరు, ఆకాశము, దేవతలు ఈ యన్నియు ఎందునుండి పుట్టినవి? అన్నింటికంటె మొదటిదగు ఆతత్త్వమును గూర్చి నాకు తెలియ జెప్పుము.
జ్ఞానం యతః ప్రార్థయతే నరో వై
తత స్తదర్థా భవతి ప్రవృత్తిః,
న చాప్యహం వేద పరం పురాణం
మిథ్యా ప్రవృత్తిం చ కథం ను కుర్యామ్. 7
నరుడు ఏ విషయమునందలి జ్ఞానమును మిక్కిలిగా తెలియగోరునో ఆజ్ఞానమునకు సంబంధించి ప్రవృత్తి కలుగును. నేను పరము, పురాణము నైన తత్త్వము నెరుగను. తెలియనిదానియందు ప్రవృత్తి నెట్లు చేయుదును?
ఋక్సామసంఘాంశ్చ యజూంషి చాపి
చ్ఛ న్దాంసి నక్షత్రగతిం నిరుక్తమ్,
అధీత్య చ వ్యాకరణం సకల్పం
శిక్షాం చ భూతప్రకృతిం న వేద్మి. 8
ఋక్కులను, సామమంత్రముల సముదాయములను, యజుర్వేద మంత్రములను, ఛందస్సులను, జ్యోతిషమును, నిరుక్తమును, కల్పశాస్త్రముతో పాటు వ్యాకరణమును చదివియు నేను భూతముల ప్రకృతిని తెలియకున్నాను.
స మే భవాన్ శంసతు సర్వమేత-
త్సామాన్య శబ్దైశ్చ విశేషణై శ్చ
స మే భవాన్ శంసతు తావదేత-
జ్జ్ఞానే ఫలం కర్మణి వా యదస్తి.
యథాచ దేహా చ్చ్యవతే శరీరీ
పునః శరీరం చ యథాఽప్యుపైతి 9
తమరు నాకు దీని నంతటిని సామాన్య శబ్దములతోడను, విశేషణములతోడను ఎరుగజెప్పుడు. మరియు ఫలమునందా? కర్మమునందా అనుదానిని కూడ తమరు నాకు బోధింపవలయును. అంతే కాదు ఈ శరీరమునందున్న జీవాత్మ దేహమునుండి ఎట్లు జారిపోవును? మరల శరీరమునం దెట్లు ప్రవేశించును - దీనిని కూడ తమరు తెలియజెప్పవలయును.
మను రువాచ - మను విట్లు పలికెను
యద్యత్ర్పియం యస్య సుఖం తదాహు-
స్త దేవ దుఃఖం ప్రవదన్త్యనిష్టమ్, 10
ఇష్టం చ మే స్యా దితరచ్చ న స్యా –
దేతత్కృతే కర్మవిధిః ప్రవృత్తః.
ఇష్టం త్వనిష్టం చ న మాం భజేతే-
త్యేతత్కృతే జ్ఞానవిధిః ప్రవృత్తః. 11
ఎవనికి ఏది ఏది ప్రియమో దానిని సుఖమనియు, ఏది అప్రియమో అది దుఃఖమనియు నందురు. నాకిష్టము కలుగవలయును. అనిష్టము కలుగరాదు అనుకొనుటవలన కర్మవిధి బయలుదేరినది. ఇష్టముగాని అనిష్టముగాని నన్ను చెందవు - అనుభావముతో జ్ఞానవిధి ఏర్పడినది.
కామాత్మకా శ్ఛన్దసి కర్మయోగా
ఏభి ర్విముక్తః పర మశ్నువీత,
నానావిధే కర్మపథే సుఖార్థీ
నరః ప్రవృత్తో నిరయం ప్రయాతి.
వేదము చెప్పిన కర్మయోగములన్నియు కామప్రధానములు. ఈ కామములు విడనాడినవాడు పరమఫలము ననుభవించును. సుఖములు కోరెడు నరుడు పెక్కువిధములుగల కర్మమార్గమున తిరుగాడుచు నరకమున కరుగుచున్నాడు.
బృహస్పతి రువాచ - బృహస్పతి యిట్లనెను
ఇష్టం త్వనిష్టం చ సుఖాసుఖే చ
సాశీ స్త్వవచ్ఛన్దతి కర్మభి శ్చ. 12
ఇష్టము, అనిష్టము, సుఖము దుఃఖముగా నగును. ఆ ప్రార్థన కర్మములతో ప్రార్థించువానిని వ్యాపించును.
మను రువాచ - మను విట్లు పలికెను.
ఏభి ర్విముక్తః పర మావిశేశ
ఏతత్కృతే కర్మవిధిః ప్రవృత్తః,
కామాత్మకాంశ్ఛన్దతి కర్మయోగ
ఏభి ర్విముక్తః పర మాదదీత. 13
కామములను విడనాడి కర్మముల నాచరించినచో నరుడు పరమును బ్రహ్మమును ప్రవేశించును. దానికొరకే కర్మముల అనుష్ఠానము బయలుదేరినది. కాని కర్మయోగము కామాత్మకములనే క్రమ్ముకొనుచున్నది. అందువలన కోరికలను విడనాడినచో బ్రహ్మమునే పొందును.
ఆత్మాదిభిః కర్మభి రిధ్యమానో
ధర్మే ప్రవృత్తో ద్యుతిమాన్ సుఖార్థీ,
పరం హి తత్కర్మపథా దపేతం
నిరాశిషం బ్రహ్మపరం హ్యవైతి. 14
నిత్యములగుకర్మములచేత దోషములు తొలగి ప్రకాశించుచున్న చిత్తము ధర్మమునందు ప్రవృత్తి కలదై కాంతితో వెలిగిపోవుచు మోక్షసుఖమును కోరునదిగా రూపొందును. అటుపై మిక్కిలిగా ఆ కర్మమార్గమునుండి తొలగినది, ఆశలు లేనిదియగు బ్రహ్మమునందు లగ్నమగు స్థితిని పొందును.
ప్రజాః సృష్టా మనసా కర్మణా చ
ద్వావేవైతౌ సత్పథౌ లోకజుష్టౌ,
దృష్టం కర్మ శాశ్వతం చాన్తవచ్చ
మనస్త్యాగః కారణం నాన్య దస్తి. 15
జీవులందరు మనస్సుతో కర్మముతో పాటు, సృజింపబడిరి. లోకము తగులముగల ఈ రెండును మంచిదారులే. ఇది ప్రత్యక్షము. శాశ్వతమగు మోక్షమునకు గాని, అంతము గల క్షుద్రఫలమునకు కాని కారణమగు కర్మమునందు మనస్త్యాగము మోక్షసాధకమగును. మరియొకటికాదు.
స్వేనాత్మనా చక్షు రివ ప్రణేతా
నిశాత్యయే తమసా సంవృతాత్మా,
జ్ఞానం తు విజ్ఞాన గుణేన యుక్తం
కర్మాశుభం పశ్యతి వర్జనీయమ్. 16
చీకటితో మూసికొనిపోయిన కన్ను అను నాయకుడు రాత్రి కడచినంతనే తన స్వరూపముతో అంతయు చూచునట్లు, జ్ఞానము విజ్ఞానగుణముతో కూడినదై వదలివేయదగిన అశుభ కర్మమును కనుగొనును.
సర్పాన్ కుశాగ్రాణి తథోదపానం
జ్ఞాత్వా మనుష్యాః పరివర్జయన్తి
అజ్ఞానత స్తత్ర పతన్తి కేచి-
జ్జ్ఞానే ఫలం పశ్య యథా విశిష్టమ్. 17
పాములను, దర్భముండ్లను, నూతిని చక్కగా తెలిసికొని మనుష్యులు ఆ వంకకు పోకుందురు. కొందరు తెలియక అందు పడుదురు. చూడు! జ్ఞానమునందు ఫలమెంత గొప్పదియో!
కృత్స్న స్తు మన్త్రో విధివత్ప్రయుక్తో
యథా యథోక్తా స్త్విహ దక్షిణాశ్చ,
అన్నప్రదానం మనసః సమాధిః
పఞ్చాత్మకం కర్మఫలం వదన్తి. 18
సమగ్రమైన మంత్రము, శాస్త్రముననుసరించి ప్రయోగించిన విధానము, శాస్త్రము చెప్పిన విధముగానున్న దక్షిణలు, అన్నదానము, మనస్సునే కాగ్రము చేయుట అను అయిదు తీరులుగల కర్మము ఫలవంతమగునని చెప్పుదురు.
గుణాత్మకం కర్మ వదన్తి వేదా-
స్తస్మా న్మన్త్రో మన్త్రపూర్వం హి కర్మ
విధి ర్విధేయం మనసోపపత్తిః
ఫలస్య భోక్తా తు తథా శరీరీ. 19
వేదములు కర్మమును గుణాత్మకమని చెప్పును. ఆకారణమున మంత్రము కూడ గుణాత్మకము. మంత్రపూర్వకమగు కర్మ కూడ అట్లే. విధియు నట్టిదే మనస్సును బట్టి ఏర్పడు ఫలముకూడ గుణాత్మకముగా నుండును. ఫలమును అనుభవించు భోక్తయు అదే తీరున నుండును.
శబ్దాశ్చ రూపాణి రసాశ్చ పుణ్యాః
స్పర్మాశ్చ గన్ధాశ్చ శుభా స్తథైవ,
నరో న సంస్థానగతః ప్రభుః స్యా
దేత త్ఫలం సిద్ధ్యతి కర్మలోకే. 20
చక్కని శబ్దములు, రూపములు, పుణ్యములగు రసములు, స్పర్శలు, ఇంపైన వాసనలు - ఇవి యన్నియు కర్మములఫలములు, కర్మలోకమునందు కలుగును. కాని నరుడు మరణింపక ముందే జ్ఞాన ఫలమునందు అధికారి కావలయును.
యద్య చ్ఛరీరేణ కరోతి కర్మ
శరీరయుక్తః సముపాశ్నుతే తత్,
శరీర మే వాయతనం సుఖస్య,
దుఃఖస్య చాప్యాయతనం శరీరమ్. 21
శరీరముతో ఏ యే కర్మము నాచరించునో ఆఫలమును శరీరముతో కూడినవాడై అనుభవించును. సుఖమునకును, దుఃఖమునకును శరీరమే ఆశ్రయము.
వాచా తు యత్కర్మ కరోతి కిఞ్చి-
ద్వాచైవ సర్వం సముపాశ్నుతే తత్,
మనస్తు యత్కర్మ కరోతి కిఞ్చి -
న్మనఃస్థ ఏవాయ ముపాశ్నుతే తత్. 22
వాక్కుతో చేసిన కర్మము ఫలము వాక్కుతోడనే నరు డనుభవించును. మనస్సు చేయు పని ఏకొంచెమైనను మనస్సునందున్న వాడయియే నరు డనుభవించును.
యథా యథా కర్మగుణం ఫలార్థీ
కరోత్యయం కర్మఫలే నివిష్టః,
తథా తథాఽయం గుణసంప్రవిష్టః
శుభాశుభం కర్మఫలం భునక్తి. 23
ఫలమును కోరువాడై కర్మఫలమునందు మునిగి తేలుచు కర్మగుణమును ఎట్లెట్లు ఆచరించునో అట్లట్లు ఆ గుణములయందు చొరబారినవాడై శుభాశుభ కర్మఫలము ననుభవించును.
మత్స్యో యథా స్రోత ఇవాభిపాతీ
తథా కృతం పూర్వ ముపైతి కర్మ,
శుభే త్వసౌ తుష్యతి దుష్కృతే తు
న తుష్యతే వై పరమః శరీరీ. 24
చేప ప్రవాహమున (కు ఎదురుగా) పోవు విధమున పూర్వ మొనరించిన కర్మము పురుషుని చేరుకొనును. దేహమునందలి జీవుడు శుభ ఫలమునందు సంతసించును. దుష్కృతమునందు దుఃఖించును.
యతో జగత్సర్వ మిదం ప్రసూతం
జ్ఞాత్వాఽఽ త్మవన్తో వ్యతియాన్తి యత్తత్,
యన్మన్త్ర శబ్దై రకృతప్రకాశం
తుదుచ్యమానం శృణు మే పరం తత్. 25
ఈ జగత్తు మొత్తము దేనినుండి పుట్టినదో, దేనిని తెలిసికొని ఆత్మవంతులు ఈ జగత్తును దాటిపోవుదురో, ఏది మంత్రశబ్దములతో ప్రకాశింపదో ఆ పరమవస్తువును గూర్చి చెప్పుచున్నాను. వినుము.
రసై ర్విముక్తం వివిధైశ్చ గన్ధై -
రశబ్ద మస్పర్శ మరూపవచ్చ,
అగ్రాహ్య మవ్యక్త మవర్ణ మేకం
పఞ్చ ప్రకారాన్ ససృజే ప్రజానామ్. 26
ఆ పరమబ్రహ్మము, రసములు, వివిధములైన గంధములు, శబ్దములు, స్పర్శలును, రూపములును లేనిది. పట్టుకొననలవి కానిది, తక్కిన వస్తువులవలె తెలియరానిది, వర్ణములు లేనిది. ఏకరూపమైనది - అయినను అయిదు విధములుగల ప్రజలను సృజించెను.
న స్త్రీ పుమాన్నాపి నపుంసకం చ,
న సన్న చాసత్సదసచ్చ తన్న,
పశ్యన్తి యద్బ్రహ్మవిదో మనుష్యా -
స్తదక్షరం నక్షరతీతి విద్ధి. 27
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్ష ధర్మపర్వణి
మనుబృహస్పతి సంవాదే ఏకాధిక ద్విశతతమోఽధ్యాయః
ఆబ్రహ్మము ఆడుది కాదు, పురుషుడు కాడు, పేడియు కాదు. సత్తుకాదు, అసత్తుకాదు. సత్తు అసత్తు అయినదియు కాదు. బ్రహ్మమునెరిగిన మనుష్యులు దానిని దర్శింతురు. అది అక్షరము. నశించునది కాదని యెరుగుము .
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మపర్వమున మనుబృహస్పతి సంవాదము గల రెండువందలయొకటవ అధ్యాయము.
మను రువాచ - మను విట్లు పలికెను.
అక్షరాత్ఖం తతో వాయు స్తతో జ్యోతి స్తతో జలమ్,
జలాత్ప్రసూతా జగతీ జగత్యాం జాయతే జగత్. 1
అక్షరమునుండి ఆకాశము, దానినుండి వాయువు, దానినుండి అగ్ని, దానినుండి నీరు, నీటి నుండి భూమి, భూమినుండి జగత్తు పుట్టును.
ఏతైః శరీరై ర్జల మేవ గత్వా
జలాచ్చ తేజః పవనోఽన్తరిక్షమ్,
ఖాద్వై నివర్తన్తి న భావిన స్తే
మోక్షం చ తేవై పర మావ్నువన్తి. 2
ఈ శరీరములతో మరల జలమునే పొంది, దానినుండి అగ్నిని, గాలిని, ఆకాశమును చేరుకొని ఆకాశమును దాటి మరలుచున్నవి. మరియు అవి పరమైన మోక్షమును పొందుచున్నవి.
నోష్ణం న శీతం మృదునాఽపి తీక్ష్ణం
నామ్లం కషాయం మధురం న తిక్తమ్,
న శబ్దవన్నాపి చ గన్ధవత్త -
న్న రూపవత్తత్పర మస్వభావమ్. 3
అది వేడిది, చల్లనిది, మెత్తనిది, కఠినమైనది, పులుపు, చేదు, తీపి, ఒగరు మొదలగు రుచులు కలది, శబ్దము, గంధము, రూపము అను గుణములు కలదియు కాదు. ఆ పరమము అస్వభావము.
స్పర్శం తను ర్వేద రసం చ జిహ్వా
ఘ్రాణం చ గన్ధాన్ శ్రవణౌ చ శబ్దాన్,
రూపాణి చక్షు ర్న చ తత్పరం యద్
గృహ్ణ న్త్యనధ్యాత్మవిదో మనుష్యాః. 4
స్పర్శను చర్మము, రసమును నాలుకయు, వాసనలను ముక్కు, శబ్దములను చెవులును, రూపములను కన్ను తెలియును. ఆవిధముగా ఆ పరమైన దానిని అధ్యాత్మజ్ఞానములేని మనుజులు గ్రహింపజాలరు.
నివర్తయిత్వా రసనాం రసేభ్యో
ఘ్రాణం చ గన్ధా చ్ఛ్రవణౌ చ శబ్దాత్,
స్పర్శా త్త్వచం రూపగుణాత్తు చక్షు -
స్తతః పరం పశ్యతి స్వం స్వభావమ్. 5
నాలుకను రుచులనుండి, ముక్కును గంధములనుండి, చెవులను శబ్దమునుండి చర్మమును స్పర్శనుండి, కంటిని రూపగుణమునుండియు మరలించి పరమైన స్వస్వభావమును యోగి దర్శించును.
యతో గృహీత్వా హి కరోతి యచ్చ
యస్మిం శ్చ తామారభతే ప్రవృత్తిమ్,
యస్మింశ్చ యద్యేన చ యశ్చ కర్తా
యత్కారణం తే సముదాయ మాహుః. 6
కర్త దేనినుండి దేనిని కైకొని దేనియందు ప్రవృత్తిని ఆరంభించునో దేనియందు దేనిచేత ఏది కారణముగా ప్రవర్తించునో దానిని సముదాయమని మునులు చెప్పుదురు.
యద్వ్యాప్య భూ ద్వ్యాపకం సాధకం చ
యన్మన్త్ర వత్ స్థాస్యతి చాపి లోకే,
యః సర్వహేతుః పరమాత్మకారీ
తత్కారణం కార్య మతో మదన్యత్. 7
అన్నింటిని వ్యాపించియున్నది, సాధకము, మంత్రమునందు చెప్పినట్లు లోకమున కదలక మెదలక యుండునది, సర్వమునకు కారణమైనది, తనంత తాను సర్వమును చేయునది అగు పరతత్త్వమే ఆకారణము. దీనికంటె వేరైనది కార్యము.
యథా హి కశ్చి త్సుకృతై ర్మనుష్యః
శుభాశుభం ప్రాప్నుతే ఽథావిరోధాత్,
ఏవం శరీరేషు శుభాశుభేషు
స్వకర్మణై ర్జ్ఞానమిదం నిబద్ధమ్. 8
ఒకానొక నరుడు చక్కగా ఆచరించిన పనులచేత విరుద్ధము కాని విధముగా శుభమును అశుభమును పొందుచుండును. అట్లే (తన కర్మములవలన ఏర్పడిన) శుభము, అశుభము అయిన శరీరములయందు ఇది కట్టువడి యుండును.
యథా ప్రదీప్తః పురతః ప్రదీపః
ప్రకాశ మన్యస్య కరోతి దీప్యన్,
తథేహ పఞ్చేన్ద్రియదీప వృక్షా
జ్ఞాన ప్రదీప్తాః పరవన్త ఏవ. 9
ఎదురుగా వెలిగించి పెట్టిన దీపము తాను ప్రకాశించుచు ఇతరమునకును ప్రకాశమును కలిగించుచున్నది. అట్లే అయిదు ఇంద్రియములనెడు దీపముల వృక్షములు జ్ఞానముచే ప్రకాశింపజేయబడుచు పరాధీనములే యగుచున్నవి.
యథా చ రాజ్ఞా బహవో హ్యమాత్యాః
పృథక్ ప్రమాణం ప్రవదన్తి యుక్తాః,
తద్వచ్ఛరీరేషు భవన్తి పఞ్చ
జ్ఞానైకదేశః పరమః స తేభ్యః. 10
ఒకరాజు నియమించిన పెక్కండ్రు అమాత్యులు విడివిడిగా ప్రమాణ వాక్యమును పలుకుచుందురు. అదే విధముగా శరీరములయందు అయిదు ఇంద్రియములు పనిచేయుచుండును. జ్ఞానమునకు ముఖ్యస్థానమగు ఆస్వభావము వానికంటె పరమము.
యథార్చిషో ఽగ్నేః పవనస్య వేగో
మరీచయోఽర్కస్య నదీషు చాపః,
గచ్ఛన్తి చాయాన్తి చ సఞ్చరన్త్య -
స్తద్వచ్ఛరీరాణి శరీరిణాం తు. 11
అగ్నియెక్క జ్వాలలు, గాలి వేగము, సూర్యుని కిరణములు, నదులయందు నీరు వచ్చుచుండును. పోవుచుండును. సంచరించుచుండును. శరీరుల శరీరములు కూడ అట్టివే.
యథా చ కశ్చి త్పరశుం గృహీత్వా
ధూమం నపశ్యే జ్జ్వలనం చ కాష్ఠే,
తద్వచ్ఛరీరోదరపాణి పాదం
ఛిత్వా న పశ్యన్తి తతో యదన్యత్. 12
ఒకానొకడు గొడ్డలితో కట్టెలను నరుకును. కాని దానియందున్న అగ్నిని గాని పొగను గాని చూడజాలడు. అట్లే శరీరమునందు పొట్టను, చేతులను, కాళ్ళను నరకియు వానికంటె వేరైన ఆత్మను కనుగొనజాలరు.
తాన్యేవ కాష్ఠాని యథా విమథ్య
ధూమం చ పశ్యే జ్జ్వలనం చ యోగాత్,
తద్వత్సబుద్ధిః సమ మిన్ద్రియాత్మా
బుద్ధిం పరం పశ్యతి తం స్వభావమ్. 13
ఆ కట్టెలనే ఉపాయముతో మథించి అందున్న పొగను, నిప్పును మనుజుడు చూచుచున్నాడు. అట్లే జీవుడు బుద్ధితో కూడినవాడై పరమైన స్వభావమును, బుద్ధిని ఏక కాలమున చూచుచున్నాడు.
యథాత్మనో ఽ ఙ్గం పతితం పృథివ్యాం
స్వప్నాన్తరే పశ్యతి చాత్మనోఽ న్యత్,
శ్రోత్రాదియుక్తః సమనాః సబుద్ధి
ర్లి ఙ్గా త్తథా గచ్ఛతి లిఙ్గ మన్యత్. 14
కలలో ఒకడు తనదేహము నేలపై పడియుండగా తనకంటె వేరుగా దానిని చూచును. అట్లే మనస్సు బుద్ధి అనువానితో, చెవిమున్నగువానితో కూడినవాడై ఒక స్థూలదేహము నుండి మరియొక స్థూలదేహమునకు జీవు డరుగును.
ఉత్పత్తి వృద్ధి వ్యయ సన్నిపాతై -
ర యుజ్యతేఽసౌ పరమః శరీరీ,
అనేన లిఙ్గేన తు లిఙ్గ మన్యద్
గచ్ఛ త్యదృష్టః ఫలసన్నియోగాత్. 15
పుట్టుట, పెరుగుట, తరుగుట, నశించుట అనువానితో ఈ పరమమైన ఆత్మకు అంటుసొంటులు లేవు. ఫల సంబంధముచేత ఎవరికి కానరానిదై ఈ దేహమునుండి మరియొక దేహమున కరుగును.
న చక్షుషా పశ్యతి రూప మాత్మనో
న చాపి సంస్పర్శ ముపైతి కిఞ్చిత్,
న చాపి తైః సాధయతే తు కార్యం
తే తం న పశ్యన్తి స పశ్యతే తాన్. 16
మనుజుడు కంటితో ఆత్మరూపమును చూడజాలడు. స్పర్శను ఏ మాత్రమును పొందడు. వానితో ఏ కార్యమును సాధింపడు. అవి అతనిని చూడవు. అతడు వానిని చూచును.
యథా సమీపే జ్వలతోఽనలస్య
సంతాపజం రూప ముపైతి కశ్చిత్,
న చాపరం రూపగుణం బిభర్తి
తథైవ తద్దృశ్యతి రూప మస్య. 17
సమీపమున మండుచున్న అగ్నిరూపమును వేడిమివలన ఒకడు తెలిసికొను చున్నాడు. మరియొక రూపగుణము అగ్ని తాల్చుటలేదు. అట్లే దానిరూపము తెలియవచ్చుచున్నది.
తథా మనుష్యః పరిముచ్య కాయ -
మదృశ్య మన్య ద్విశతే శరీరమ్,
విసృజ్య భూతేషు మహత్సు దేహం
తదాశ్రయం చైవ బిభర్తి రూపమ్. 18
మనుష్యుడు తన దేహమును మొత్తముగా విడచివైచి కనులకు కానరాని మరియొక శరీరమును చేరుకొనుచున్నాడు. మహాభూతములలో తనదేహమును వదలివైచి మరియొక దేహము నాశ్రయించిన రూపమును పొందుచున్నాడు.
ఖం వాయు మగ్నిం సలిలం తథోర్వీం
సమన్తతోఽ భ్యావిశతే శరీరీ,
నానాశ్రయాః కర్మసు వర్తమానాః
శ్రోత్రాదయః పఞ్చ గుణాన్ శ్రయన్తి. 19
జీవుడు మరణసమయమున ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, నేల అనువానిని దేహమునందలి ఆయా అంశములతో చేరుకొనును. అట్లే చెవి మొదలగునవియు పెక్కు ఆశ్రయములు కలవియై కర్మములయందు ప్రవర్తించుచు అయిదు గుణములను ఆశ్రయించును.
శ్రోత్రం ఖతో ఘ్రాణ మథో పృథివ్యా -
స్తేజోమయం రూప మథో విపాకః,
జలాశ్రయం తేజ ఉక్తం రసం చ
వాయ్వాత్మకః స్పర్శకృతో గుణశ్చ. 20
ఆకాశగుణము చెవిగా, భూమిగుణము ముక్కు గానగును. అగ్నిమయమగు రూపము కన్నుగా పాకమునకు వచ్చును. నీటి నాశ్రయించిన తేజస్సు నాలుకగా నగును. వాయు స్వరూపము స్పర్శకొరకు ఏర్పడిన గుణముగా - త్వగింద్రియముగా మారును.
మహత్సు భూతేషు వసన్తి పఞ్చ
పంచేద్రియార్థాశ్చ తథేన్డ్రియేషు,
సర్వాణి చైతాని మనోనుగాని
బుద్ధిం మనో౨ న్వేతి మతిః స్వభావమ్ 21
మహాభూతములయిదింటియందును అయిదుగుణములు వసించును. ఆ అయిదు ఇంద్రియముల విషయములును ఇంద్రియములందు నెలకొనియుండును. ఇవి యన్నియు మనస్సు ననుసరించి యుండును. మనస్సు బుద్ధిని, బుద్ధి స్వభావమును అనుసరించును.
శుభా శుభం కర్మ కృతం యదన్య -
త్తదేవ ప్రత్యాదదతే స్వదేహే,
మనోఽను వర్తన్తి పరావరాణి
జలౌకసః స్రోత ఇవానుకూలమ్. 22
వెనుక దేహమున చేసిన శుభాశుభ కర్మమునే ఇంద్రియాదులు క్రొత్తది యగు తమ దేహమున గ్రహించును. నీటి ప్రాణులు వాలుగానున్న ప్రవాహము ననుసరించునట్లు అర్థములు బుద్ధిమొదలగునవి మనస్సు ననుసరించును.
చలం యథా దృష్టి పథం పరైతి
సూక్ష్మం మహద్రూప మివాభిభాతి,
స్వరూప మాలోచయతే చ రూపం
పరం తథా బుద్ధిపథం పరైతి. 23
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి
మను బృహస్పతి సంవాదే ద్వ్యధిక ద్విశతతమోఽధ్యాయః
జనుడు దృష్టిపథమును చంచలమైనదిగా ఎట్లు తెలిసికొనుచున్నాడో, సూక్ష్మమైన దానిని గొప్పరూపము కల దానినిగా భావించుచున్నాడో, రూపమును స్వరూపముగా చూచుచున్నాడో అట్లే పరతత్వము బుద్ధి పథమును పొందుచున్నది.
ఇది శ్రీమహా భారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున మను బృహస్పతి సంవాదముగల రెండువందల రెండవ అధ్యాయము.
మను రువాచ - మను విట్లు పలికెను.
యదిన్ద్రియై స్తూపహితం పురస్తాత్
ప్రాప్తాన్ గుణాన్ సంస్మరతే చిరాయ,
తేష్విన్ద్రియే షూపహతేషు పశ్చాత్
స బుద్ధిరూపః పరమః స్వభావః. 1
ఏ జీవచైతన్యము ఇంద్రియములతో కూడుకొన్నదై ముందు లభించిన గుణములను పెద్దకాలము స్మరించుచుండునో అది, ఆ ఇంద్రియములు విలీనములై పోగా తరువాత బుద్ధిరూపమైన పరమస్వభావమై నిలిచియుండును.
యథేన్ద్రియార్థాన్ యుగప త్సమన్తా -
న్నోపేక్షతే కృత్స్న మతుల్యకాలమ్,
తథా చలం సంచరతే స విద్వాం -
స్తస్మాత్స ఏకః పరమః శరీరీ. 2
ఆ పరముడు ఆత్మ ఒక్కడు. ఇంద్రియార్థములను అన్నివైపుల ఒక్క కాలమునను, పెక్కు కాలములందును మొత్తముగా ఉపేక్షింపడు. అట్లే సాక్షిరూపుడై అన్ని అవస్థల యందును సంచరించుచుండును.
రజస్తమ స్సత్త్య మథో తృతీయం
గచ్ఛత్యసౌ స్థానగుణాన్ విరూపాన్,
తథేన్ద్రియా ణ్యావిశతే శరీరీ
హుతాశనం వాయు రివేన్దనస్థమ్. 3
ఈ శరీరి (జీవాత్మ) రజస్సును, తమస్సును, మూడవదియగు సత్త్వమును, బుద్ధి స్థానములైన జాగ్రదాది దశల విరూపములగు గుణములను తెలియు చున్నాడు. అట్లే కట్టెలో నున్న అగ్నిని వాయువువలె, ఇంద్రియములను ఆవేశించును.
న చక్షుషా పశ్యతి రూప మాత్మనో
న పశ్యతి స్పర్శన మిన్ద్రియేన్ద్రియమ్,
న శ్రోత్రలిఙ్గం శ్రవణేన దర్శనం
తథా కృతం పశ్యతి తద్వినశ్యతి. 4
ఆత్మరూపమును ఎవ్వడును కంటితో చూడజాలడు. ఇంద్రియములకు ఇంద్రియమైన దానిని స్పృశింపజాలడు. అట్లే అది చెవికి తెలియబడునది కాదు. శ్రవణముతో దర్శనము అగును. అపుడు చూచును. కాని అపుడా యింద్రియము నశించును.
శ్రోత్రాదీని న పశ్యన్తి స్వస్వ మాత్మాన మాత్మనా,
సర్వజ్ఞః సర్వదర్శీ చ సర్వజ్ఞ స్తాని పశ్యతి. 5
చెవి మొదలగు ఇంద్రియములు తమస్వరూపముతో తమస్వరూపమునే చూడజాలవు. సర్వము నెరిగినవాడు, సర్వమును చూచువాడు అగు సర్వజ్ఞుడు వానిని చూచును.
యథా హిమవతః పార్శ్వం పృష్ఠం చన్ద్రమసో యథా,
న దృష్టపూర్వం మనుజై ర్న చ తన్నాస్తి తావతా. 6
మంచుకొండ ప్రక్కభాగమును, చంద్రుని వెనుక భాగమును మనుజులు చూడలేదు - అన్నంత మాత్రమున అవి లేక పోవుటలేదు కదా!
త ద్వ ద్భూతేషు భూతాత్మా సూక్ష్మో జ్ఞానాత్మవానసౌ,
అదృష్టపూర్వ శ్చక్షుర్భ్యాం నచాసౌ నాస్తి తావతా. 7
అట్లే సర్వభూతముల యందు సూక్ష్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడైయున్న ప్రత్యగాత్మ మునుపెన్నడు కన్నులకు కానరాకున్నచో అతడు లేడని చెప్పుటకు
వీలు లేదుకదా!
పశ్య న్నపి యథా లక్ష్మ జగత్సోమేన విన్దతి,
ఏవ మస్తి న చోత్పన్నం న చ త న్నపరాయణమ్. 8
చంద్రునియందు ప్రతిబింబించిన జగత్తును మచ్చరూపమున చూచుచు కూడ నరుడు తెలియకున్నాడు. ఇట్లు ఆత్మ ఉన్నది. అది పుట్టలేదు. అది పరాయణము కాకుండుటయు లేదు.
రూపవన్త మరూపత్వా దుదయాస్తమనే బుధాః,
ధియా సమనుపశ్యన్తి తద్గతాః సవితు ర్గతిమ్. 9
ఉదయమునందును, అస్తమయమునందును రూపములేని దగుటవలన రూపము కల పదార్థమును, వానిని చూచువారు బుద్ధితో చక్కగా దర్శించుచున్నారు. అట్లే సూర్యుని గతిని కూడ చక్కగా తెలిసికొనుచున్నారు.
తథా బుద్ధిప్రదీపేన దూరస్థం సువిపశ్చితః,
ప్రత్యాసన్నం నినీషన్తి జ్ఞేయం జ్ఞానాభిసంహితమ్. 10
అట్లే చక్కని వివేకము కలవారు బుద్ధి అనెడు పెద్దదీపముతో జ్ఞానమను పేరు కలదియు, మిక్కిలి దూరముగా నున్న జ్ఞేయమును - ప్రపంచమును జ్ఞానమను పేరుగల బ్రహ్మమునుగా పొందగోరుదురు.
న హి ఖల్వనుపాయేన కశ్చిదర్థోఽభిసిద్ధ్యతి,
సూత్రజాలై ర్యథా మత్స్యాత్ బధ్నన్తి జలజీవినః. 11
ఉపాయము లేకుండ ఏదియును లభింపదు గదా! బెస్తవారు వలలతో చేపలను పట్టుకొందురు.
మృగై ర్మృగాణాం గ్రహణం పక్షిణాం పక్షిభి ర్యథా,
గజానాం చ గజై రేవ జ్ఞేయం జ్ఞానేన గృహ్యతే. 12
మృగములతో మృగములను, పక్షులతో పక్షులను, ఏనుగులతో ఏనుగులను వశముచేసికొను తీరున జ్ఞానముతోడనే జ్ఞేయమును పట్టుకొనవలయును.
అహి రేవ హ్యహే పాదాన్ పశ్యతీతి హి నః శ్రుతమ్,
తద్వన్మూర్తిషు మూర్తిస్థం జ్ఞేయం జ్ఞానేన పశ్యతి. 13
పాము కాళ్లను పామే చూచునని మాకు వినవచ్చినది. అట్లే ఆకారముగల వానియందే మూర్తియందున్న జ్ఞేయమును జ్ఞానముతో సాధకుడు చూచును.
నో త్సహన్తే యథా వేత్తు మిన్ద్రియై రిన్ద్రియాణ్యపి,
తథై వేహ పరా బుద్ధిః పరం బోధ్యం న పశ్యతి. 14
ఇంద్రియములతో ఇంద్రియములను తెలియుటకు జనులు ఉత్సహింపరు. అట్లే ఇందును పరయైన బుద్ధి పరమైన బోధ్యమును చూడదు.
యథా చన్ద్రో హ్యమావాస్యా మలిఙ్గత్వా న్న దృశ్యతే,
న చ నాశోఽస్య భవతి తథా విద్ధి శరీరిణమ్. 15
అమావాస్యనాడు చంద్రుడు, చిహ్నములు లేని కారణముగా, కానరాకుండును. అంతమాత్రమున చంద్రునకు నాశనము లేదుగదా! ఆత్మను కూడ అదేవిధముగా తెలియుము.
క్షీణకోశో హ్యమావాస్యాం చన్ద్రమా న ప్రకాశతే,
తద్వ న్మూర్తి విముక్తోఽ సౌ శరీరీ నోపలభ్యతే. 16
అమావాస్యనాడు క్షీణించిన స్థూలశరీరము గల చంద్రుడు ప్రకాశింపడు. అట్లే మూర్తి నుండి విముక్తుడగు శరీరి చిక్కకున్నాడు.
యథాకాశాన్తరం ప్రాప్య చన్ద్రమా భ్రాజతే పునః,
తల్లిఙ్గా న్తరం ప్రాప్య శరీరీ భ్రాజతే పునః. 17
మరియొక అవకాశమును పొంది చంద్రుడు మరల విరాజిల్లుచున్నాడు. అట్లే మరియొక స్థూల దేహమును పొంది ప్రత్యగాత్మ మరల ప్రకాశించుచున్నాడు.
జన్మ వృద్ధిః క్షయశ్చాస్య ప్రత్యక్షేణోపలభ్యతే,
సా తు చాన్ద్రమసీ వృత్తి ర్నతు తస్య శరీరిణ:. 18
పుట్టుక, పెరుగుదల, నశించుట అనునవి దేహమునకు ప్రత్యక్షముగా కన్పట్టుచున్నవి. అది చంద్రమండలము యొక్క ధర్మము. కాని ఆత్మకు అట్టి స్థితి లేదు.
ఉత్పత్తి వృద్ధివయసా యథా స ఇతి గృహ్యతే,
చన్ద్ర ఏవ త్వమావాస్యాం తథా భవతి మూర్తిమాన్. 19
ఏర్పడుట, పెరుగుట, వయస్సుచేత అతడే ఇతడని చంద్రుని తెలిసికొనుచున్నాము. అట్లే అమావాస్యనాడును ఆ చంద్రుడే మూర్తికలవాడై యుండెనని తెలియవలయును.
నోపసర్ప ద్విముఞ్చద్వా శశినం దృశ్యతే తమః,
విసృజం శ్చోపసర్పంశ్చ తద్వత్పశ్య శరీరిణమ్. 20
రాహువు చంద్రుని చొరబారుటయో, వదలివైచుటయో స్పష్టముగా తెలియరాదు. అట్లే ఆత్మ ఒక దేహమును వదలి మరియొక దేహమును చేరుకొనుటయు తెలియరాదు.
యథా చన్ద్రార్కసంయుక్తం తమ స్తదుపలభ్యతే,
తద్వచ్ఛరీర సంయుక్తః శరీరీత్యుపలభ్యతే. 21
సూర్యచంద్రుల కలయిక కలవాడు రాహువు అని తెలియవచ్చుచున్నది. అట్లే శరీరముతో కలసియున్నదై ఆత్మ శరీరి యని తెలియవచ్చుచున్నది.
యథా చన్ద్రార్కనిర్ముక్తః సరాహు ర్నోపలభ్యతే,
తద్వచ్ఛరీర నిర్ముక్తః శరీరీ నోపలభ్యతే. 22
చంద్రుడు, సూర్యుడు వదలివైచిన రాహువు కానరాడు. అట్లే తానుగల శరీరమును వదలిన శరీరి ప్రకాశింపడు.
యథా చన్ద్రో హ్యమావాస్యాం నక్షతై ర్యుజ్యతే గతః,
తద్వచ్ఛరీర నిర్ముక్తః ఫలై ర్యుజ్యతి కర్మణః. 23
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
మనుబృహస్పతి సంవాదే త్ర్యధికద్విశతతమోఽధ్యాయః
అమావాస్యను పొందిన చంద్రుడు నక్షత్రములతో కూడియే యున్నాడు. అట్లే శరీరమును వదలిన జీవుడు కర్మఫలములతో కూడి ఉన్నాడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున మను బృహస్పతిసంవాదముగల రెండు వందల మూడవ అధ్యాయము.
యథా వ్యక్త మిదం శేతే స్వప్నే చరతి చేతనమ్,
జ్ఞాన మిన్ద్రియ సంయుక్తం తద్వత్ప్రేత్య భవాభవే. 1
ఈస్థూలదేహము నిద్రించునపుడు చేతనము స్వప్నమున తిరుగాడుచుండును. ఇంద్రియములతో కూడిన లింగశరీరము కూడ నిద్రించును. జ్ఞానము లింగమునుండి విడివడి తిరుగుచుండును. ఇవియే భవము, అభవము అనునవి.
యథామ్భసి ప్రసన్నే తు రూపం పశ్యతి చక్షుషా,
తద్వ త్ప్రసన్నేన్ద్రియత్వా జ్జ్ఞేయం జ్ఞానేన పశ్యతి. 2
ప్రసన్నమగు నీటియందు జనుడు కంటితో తనరూపమును చూచుచున్నాడు. అట్లే ఇంద్రియములు ప్రసన్నముగా నుండుట వలన జ్ఞేయమును జ్ఞానముతో చూచును.
స ఏవ లులితే తస్మిన్ యథా రూపం న పశ్యతి,
తథేన్ద్రియాకులీభావే జ్ఞేయం జ్ఞానే న పశ్యతి. 3
ఆ నీరు చెదరినపుడు అట్టివాడే రూపమును చూడజాలడు. అట్లే ఇంద్రియములు చెల్లాచెదరైనపుడు ఆత్మతత్త్వమును బుద్ధియందు పట్టుకొనజాలడు.
అబుద్ధి రజ్ఞానకృతా అబుద్ధ్యా కృష్యతే మనః,
దుష్టస్య మనసః పఞ్చ సంప్రదుష్యన్తి మానసాః. 4
అవిద్య అజ్ఞానముచేత ఏర్పడునది, అవిద్య మనస్సు నాకర్షించును. మనసు చెడినపుడు మనస్సునకు సంబంధించిన అయిదును (శ్రోత్రాదులు) మిక్కిలిగా పాడైపోవును.
అజ్ఞాన తృప్తో విషయే ష్వవగాఢో న తృప్యతే,
అదృష్టవచ్చ భూతాత్మా విషయేభ్యో నివర్తతే. 5
అజ్ఞానము చేత తృప్తినందువాడు, విషయములందు మునిగిపోయినవాడునగు జీవుడు అదృష్టముననుసరించి తృప్తినందడు. విషయముల భోగములకై మరలి వచ్చును.
తర్షచ్ఛేదో న భవతి పురుషస్యేహ కల్మషాత్,
నివర్తతే తదా తర్షః పాప మన్తగతం యదా. 6
పురుషునకు ఇచట దాహము ఆగిపోవుట, పాపమువలన, కలుగదు. ఎప్పుడు పాపము అంతమును పొందునో అప్పుడు తృష్ణ మరలిపోవును.
విషయేషు తు సంసర్గా చ్ఛాశ్వతస్య తు సంశ్రయాత్,
మనసా చాన్యథా కాంక్షన్ పరం న ప్రతిపద్యతే. 7
విషయములు తగులమువలనను, అదియే శాశ్వతమని ఆశ్రయించుటవలనను మనస్సుతో కోరదగినదానికంటె వేరైనదానిని కాంక్షించుచు పరతత్వమును పొందకున్నాడు.
జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః,
యథాఽఽ దర్శతలే ప్రఖ్యే పశ్యత్యాత్మాన మాత్మని. 8
పాపకర్మము నశించినపుడు పురుషులకు జ్ఞానము పుట్టును. స్వచ్ఛమైన అద్దమునందు తనస్వరూపమును చూచినట్లు ఆత్మయందు ఆత్మను దర్శించును.
ప్రసృతై రిన్ద్రియై ర్దుఃఖీ తై రేవ నియతః సుఖీ,
తస్మా దిన్ద్రియరూపేభ్యో యచ్ఛే దాత్మాన మాత్మనా. 9
ఈ విషయములవైపు స్రవించు శీలముగల ఇంద్రియములతో నరుడు దుఃఖము కలవాడగును. వానినే నిలువరించినచో సుఖముకలవాడగును. అందువలన ఇంద్రియరూపముల నుండి ఇంద్రియమును మనస్సుతోడనే నిగ్రహింప వలయును.
ఇన్ద్రియేభ్యో మనః పూర్వం బుద్ధిః పరతరా తతః,
బుద్ధేః పరతరం జ్ఞానం జ్ఞానాత్ పరతరం మహత్. 10
ఇంద్రియములకంటె మనస్సు వెనుకటిది. దానికంటె మరింత ఆవలిది బుద్ధి. బుద్ధికంటె ఇంకను పరమైనది జ్ఞానము. జ్ఞానముకంటెను ఇంకను మించినది మహత్తు.
అవ్యక్తా త్ర్పసృతం జ్ఞానం తతో బుద్ధి స్తతో మనః,
మనఃశ్రోత్రాదిభి ర్యుక్తం శబ్దాదీన్ సాధు పశ్యతి. 11
అవ్యక్తమునుండి జ్ఞానము వెలువడును. దానినుండి బుద్ధి, దానినుండి మనస్సు వెలువడును. చెవి మొదలగువానితో కూడిన మనస్సు శబ్దము మొదలగు వానిని చక్కగా పరికించును.
యస్తాం సృజతి శబ్దాదీన్ సర్వాశ్చ వ్యక్తయ స్తథా,
విముఞ్చేత్ ప్రాకృతాన్ గ్రామాం స్తాన్ముక్త్యాఽ మృతమశ్నుతే. 12
శబ్దాదులను, సర్వవ్యక్తులను వదలివైచినవాడును, ప్రకృతివలన నేర్పడు గ్రామములను వదలివైచువాడు వానిని వదలి అమృతమును అనుభవించును.
ఉద్యన్ హి సవితా యద్వత్ సృజతే రశ్మిమణ్డలమ్,
స ఏవాస్త మపాగచ్ఛం స్తదేవాత్మని గచ్ఛతి. 13
సూర్యుడు ఉదయించుచు కిరణములసముదాయమును సృజించును. అతడే అస్తమించుచు ఆకిరణములసమదాయమును తనయందే కలుపుకొనును.
అన్తరాత్మా తథా దేహ మావిశ్యేన్ద్రియరశ్మిభిః,
ప్రాప్యేన్ద్రియగుణాన్ పఞ్చ సోఽస్త మావృత్య గచ్ఛతి. 14
అట్లే అంతరాత్మయు దేహమును ఆవేశించి ఇంద్రియములనెడు కిరణములతో ఇంద్రియగుణము లయిందింటిని పొంది మరల అస్తమించును.
ప్రణీతం కర్మణా మార్గం నీయమానః పునఃపునః,
ప్రాప్నోత్యయం కర్మఫలం ప్రవృత్తం ధర్మ మాప్తవాన్. 15
కర్మము తెచ్చిపెట్టిన దారిలోనికి కర్మముతోడనే తీసికొనిరాబడినవాడై మరల మరల కర్మఫలము ననుభవించును. ప్రవృత్తి ప్రధానమైన ధర్మమును పొందెనుకదా!
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః,
రసవర్జం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 16
ఆహారమును వదలివైచిన దేహికి విషయములు మరలిపోవును. రసము మాత్రము పోదు. పరమును దర్శించినపుడు అతని రసము కూడ మరలిపోవును.
బుద్ధిః కర్మగుణై ర్హీనా యదా మనసి వర్తతే,
తదా సంపద్యతే బ్రహ్మ తత్రైవ ప్రళయంగతమ్. 17
కర్మగుణములులేనిదై బుద్ధి మనసున ప్రవర్తించునపుడు అతడు బ్రహ్మమే యగును. మనస్సు అందే ప్రళయము నందెను కదా!
అస్పర్మన మశృణ్వాన మనాస్వాద మదర్శనమ్,
అఘ్రాణ మవితర్కంచ సత్త్వం ప్రవిశతే పరమ్. 18
స్పృశింపనిది, విననిది, రుచి నందనిది, చూడనిది, మూర్కొననిది, తర్కమున కందనిది అగుపరమును సత్త్వము చేరుకొనును.
మనస్యాకృతయో మగ్నా మనస్త్వభిగతం మతిమ్,
మతి స్త్వభిగతా జ్ఞానం జ్ఞానం చాభిగతం పరమ్. 19
ఆకృతులన్నియు మనస్సునందు మునిగి పోవును. మనస్సు మతిని చేరుకొనును. మతి జ్ఞానమునందు చొరబారును. జ్ఞానము పరమాత్మయందు ప్రవేశించును.
ఇన్ద్రియై ర్మనసః సిద్ధి ర్న బుద్ధిం బుధ్యతే మనః,
న బుద్ధి ర్బుధ్యతే వ్యక్తం సూక్ష్మం త్వేతాని పశ్యతి. 20
ఇతి శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మ పర్వణి
మను బృహస్పతి సంవాదే చతురధికద్విశతతమోఽధ్యాయః
ఇంద్రియములతో మనస్సునకు సిద్ధిలేదు. మనస్సు బుద్ధిని ఎరుగదు. బుద్ధి అవ్యక్తమును తెలియజాలదు. సూక్ష్మము మాత్రము ఈఅన్నింటిని దర్శించును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్ష పర్వమున మనుబృహస్పతి సంవాదము గల రెండువందల నాలుగవ అధ్యాయము.
మను రువాచ - మనువు చెప్పెను.
దుఃఖోపఘాతే శారీరే మానసే చాప్యుపస్థితే,
యస్మి న్న శక్యతే కర్తుం యత్నం తం నానుచిన్తయేత్ 1
శరీరమునకును, మనసునకును సంబంధించిన దుఃఖరూపమైన యోగవిఘ్నము వచ్చినపుడు యోగాభ్యాసము చేయుటకు సాధ్యముకాని స్థితిలో ఆ విఘ్నమును గూర్చి భావించుచుండరాదు.
భైషజ్య మేత ద్దుఃఖస్య యదేత న్నాను చిన్తయేత్,
చిన్త్యమానం హి చాభ్యేతి భూయ శ్చాపి ప్రవర్తతే. 2
అట్లు చింతింపకుండుటయే దుఃఖమను ఆరోగమునకు చికిత్స. చింతించుచున్న యెడల నదియే మరల మరల వచ్చిపడును. మరియు తనయందే మెలగుచుండును.
ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యా చ్ఛారీర మౌషధైః,
ఏతద్విజ్ఞాన సామర్థ్యం న బాలైః సమతా మియాత్ 3
ప్రజ్ఞతో మనస్సునకు చెందినదుఃఖమును, మందులతో శరీరదుఃఖములను రూపుమాపవలయును. పిల్లతనము కలవారు ఈ విజ్ఞానసామర్థ్యమును క్రమ బద్ధము చేయజాలరు.
అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్యసఞ్చయః,
ఆరోగ్యం ప్రియసంవాసో గృధ్యే త్తత్ర న పణ్డితః. 4
యౌవనము, రూపము, బ్రదుకు, ధనములప్రోవు, ఆరోగ్యము, ప్రియులతో కలసి యుండుట - అనునది యంతయు అనిత్యము. తెలివికలవాడు దానియందు లోభపడరాదు.
న జానపదికం దుఃఖ మేకః శోచితు మర్హతి,
అశోచన్ ప్రతికుర్వీత యది పశ్యేదుపక్రమమ్. 5
మందికి చెందిన దుఃఖమును గూర్చి తానొక్కడు కుమిలి పోరాదు. కుమిలిపోకుండ, తాను ప్రతిక్రియను కనుగొన్నచో దానిని ఆచరణలో పెట్ట వలయును.
సుఖా ద్బహుతరం దుఃఖం జీవితే నాస్తి సంశయః,
స్నిగ్ధస్య చేన్ద్రియార్థేషు మోహా న్మరణ మప్రియమ్. 6
బ్రదుకున సుఖముకంటె దుఃఖము మిక్కిలి ఎక్కువ. సంశయము లేదు. ఇంద్రియ విషయములయందు స్నేహముకలవానికి మోహమువలన చావు అప్రియమైన దగును.
పరిత్యజతి యో దుఃఖ సుఖం చాప్యుభయం నరః,
అభ్యేతి బ్రహ్మ సోఽత్యన్తం న తే శోచన్తి పణ్డితాః. 7
సుఖదుఃఖములను రెండింటిని పట్టించుకొనని నరుడు బ్రహ్మమును మిక్కిలిగా పొందును. అట్లు బ్రహ్మమును పొందిన పండితులు శోకింపరు.
దుఃఖ మర్థా హి యుజ్యన్తే పాలనేన చ తే సుఖమ్,
దుఃఖేన చాధిగమ్యన్తే నాశ మేషాం న చిన్తయేత్ 8
అర్థములు - ధనములు - దుఃఖపడి సాధింపవలసినవి. రక్షించుటయందును సుఖము లేదు. దుఃఖముతోడనే నాశమును పొందుచున్నవి. కనుక వానిని గూర్చి చింతింపరాదు.
జ్ఞానం జ్ఞేయాభినిర్వృత్తం విద్ధి జ్ఞానగుణం మనః,
ప్రజ్ఞాకరణ సంయుక్తం తతో బుద్ధిః ప్రవర్తతే. 9
తెలియదగినదానినుండి ఏర్పడునది జ్ఞానము. కనుకనే మనస్సును జ్ఞానమే గుణముగా గలదిగా ఎఱుగుము. అది జ్ఞానేంద్రియములతో కూడినదై నపుడు బుద్ధి ప్రవర్తిల్లును.
యదా కర్మగుణోపేతా బుద్ధి ర్మనసి వర్తతే,
తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ ధ్యానయోగసమాధినా. 10
కర్మగుణములతో కూడిన బుద్ధి మనస్సునందు ప్రవర్తించునపుడు ధ్యానయోగ సమాధిచేత బ్రహ్మము చక్కగా తెలియవచ్చును.
సేయం గుణవతీ బుద్ధి ర్గుణేష్వే వాభివర్తతే,
అపరా దభినిః సృత్య గిరేః శృఙ్గా దివోదకమ్. 11
ఇంద్రియాది గుణములు గల అబుద్ధి అజ్ఞానమువలన వెడలినదై, కొండ కొమ్మునుండి జాలువారు నీటివలె, గుణములయందే తిరుగాడుచుండును.
యదా నిర్గుణ మాప్నోతి ధ్యానం మనసి పూర్వజమ్,
తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ నికషం నికషే యథా. 12
అన్నింటికంటె ముందే ఏర్పడియున్న ఆధ్యేయవస్తువు బుద్ధివృత్తియందు గుణములు లేనిదై సిద్ధించునపుడు, ఒరగంటియందు బంగారురేఖవలె, బ్రహ్మము అనుభవమునకు వచ్చును.
మనస్త్వపహృతం పూర్వ మిన్ద్రియార్థ నిదర్శకమ్,
న సమక్షగుణాపేక్షి నిర్గుణస్య నిదర్శకమ్. 13
మనస్సు ఇంద్రియార్థములను నిరూపించునది కావున అది ముందే రూపుమాసిపోయినది. ఆస్థితి ఇంద్రియములకు చాల దగ్గరగా నున్న గుణమును కోరునట్టిది కాదు. గుణములు లేని దానిని - బ్రహ్మమును - ప్రదర్శించునట్టిది.
సర్వాణ్యేతాని సంవార్య ద్వారాణి మనసి స్థితః,
మనస్యేకాగ్రతాం కృత్వా తత్పరం ప్రతిపద్యతే. 14
ఇంద్రియములను ద్వారములనన్నింటిని మూసివైచి మనస్సునందు నిలుప వలయును. దానిని కూడ బుద్ధియందు లయమొనర్చి ఏకాగ్రతను సాధింప వలయును. దానితో తరువాతి స్థితిని - పరమాత్మస్థితిని - పొందును.
యథా మహాన్తి భూతాని నివర్తన్తే గుణక్షయే,
తథేన్ద్రియాణ్యుపాదాయ బుద్ధి ర్మనసి వర్తతే. 15
గుణములగు శబ్దాదులు నశింపగా వాని కార్యములగు మహాభూతములు లయము చెందిన విధముగా మనసునందు లయమొందుచున్న బుద్ధి ఇంద్రియములను గ్రహించియే లయమొందును.
యదా మనసి సా బుద్ధి ర్వర్తతేఽ న్తరచారిణీ,
వ్యవసాయగుణోపేతా తదా సంపద్యతే మనః. 16
మనసునందు లోపల తిరుగునట్టిదై బుద్ధి ప్రవర్తించునపుడు, అది నిశ్చయాత్మకమగు గుణముతో కూడినదైనను మనస్సే యగును.
గుణవద్భి ర్గుణోపేతం యదా ధ్యానగుణం మనః,
తదా సర్వాన్ గుణాన్ హిత్వా నిర్గుణం ప్రతిపద్యతే. 17
ధ్యాన గుణముగల మనస్సు గుణములగు శబ్దాదులతోపాటు గుణములను పొందిన దైనపుడు గుణముల నన్నింటిని పట్టుకొని నిర్గుణమగు బ్రహ్మమును పొందును.
అవ్యక్త స్యేహ విజ్ఞానే నాస్తి తుల్యం నిదర్శనమ్,
యత్ర నాస్తి పదన్యాసః క స్తం విషయ మాప్నుయాత్. 18
అవ్యక్తమునకు సంబంధించిన విజ్ఞానమునందు సమానమగు దృష్టాంత మేదియును లేదు. ఎందు వాగ్వ్యవహారములేదో అట్టి విషయమును పొందువాడెవడు?
తపసా చానుమానేన గుణై ర్జాత్యా శ్రుతేన చ,
నినీషే త్పరమం బ్రహ్మ విశుద్ధే నాన్తరాత్మనా. 19
తపస్సుచేతను, అనుమానముచేతను, గుణములచేతను, జాతిచేతను, వేదాంతము చేతను, విశుద్ధమగుఅంతరాత్మచేతను ఆపరమబ్రహ్మమును తెలియగోరదగును.
గుణోహీనో హి తం మార్గం బహిః సమనువర్తతే,
గుణాభావాత్ర్పకృత్యా వాని స్తర్క్యం జ్ఞేయసమ్మితమ్. 20
గుణముల అంటుసొంటులు లేనివాడు ఆపరమాత్మను వెలుపలి ఆకారము లందును సమన్వయించుకొనును. తెలియదగినదిగా ప్రసిద్ధికెక్కిన ఆపరమాత్మ గుణములు లేని కారణముననో, స్వభావసిద్ధముగనో తర్కముల కందనిది.
నైర్గుణ్యా ద్బహ్మ చాప్నోతి సగుణత్వా న్నివర్తతే,
గుణప్రచారిణీ బుద్ధి ర్హుతాశన ఇవేన్ధవే. 21
గుణములయందు తిరుగమరిగిన బుద్ధి గుణములు లేకుండ చేసికొనుటవలన బ్రహ్మమును పొందును. గుణముల సంపర్కముండుటవలన దానినుండి మరలిపోవును. తడికట్టెయందు అగ్ని ప్రవర్తింపదు. ఎండుకట్టెయందు సుఖముగా
చొరబడునుగదా!
యథా పఞ్చ విముక్తాని ఇంద్రియాణి స్వకర్మభిః,
తథా హి పరమం బ్రహ్మ విముక్తం ప్రకృతేః పరమ్. 22
సుషుప్తిదశలో అయిదు ఇంద్రియములును తమ వ్యాపారములనుండి విడివడి పోయినట్లు పరబ్రహ్మము ప్రకృతినుండి సంపర్కము లేని దగును.
ఏవం ప్రకృతితః సర్వే ప్రవర్తన్తే శరీరిణః,
నివర్తన్తే నివృత్తే చ స్వర్గం చైవోపయాన్తిచ. 23
ఇట్లు జీవులందరు ప్రకృతివలన ప్రవర్తించుచున్నారు. ప్రకృతి మరలి పోయినపుడు ముక్తులగుచున్నారు. అట్టి నివృత్తిలేనిచో స్వర్గమును - ప్రవృత్తి ఫలముగా పొందుచున్నారు.
పురుషః ప్రకృతి ర్బుద్ధి ర్విషయా శ్చేన్ద్రియాణి చ,
అహంకారోఽభిమానశ్చ సమూహో భూతసంజ్ఞకః 24
పురుషుడు, ప్రకృతి, బుద్ధి, విషయములు, ఇంద్రియము, అహంకారము, అభిమానము అను నీసముదాయము భూతమను పేరు కలిగినట్టిది.
ఏతస్యాద్యా ప్రవృత్తి స్తు ప్రధానా త్సంప్రవర్తతే,
ద్వితీయా మిథునవ్యక్తి మవిశేషా న్నియచ్ఛతి. 25
ఈ భూతసంఘపు మొదటి సృష్టి ప్రధానమువలన కొనసాగుచున్నది. రెండవసృష్టి విశేషములేకుండుటవలన మిథునధర్మముతో ఏర్పడుటను నియమించు చున్నది.
ధర్మా దుత్కృష్యతే శ్రేయ స్తథాఽశ్రేయోఽప్యధర్మతః,
రాగవాన్ ప్రకృతిం హ్యేతి విరక్తో జ్ఞానవాన్ భవేత్. 26
ఇతిశ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
మనుబృహస్పతి సంవాదే పఞ్చాధికద్విశతతమోఽధ్యాయః
ధర్మమువలన భూతసంఘము శ్రేయస్సును సాధించుచున్నది. అధర్మమువలన ప్రేయస్సును పొందుచున్నది. రాగముకలవాడు ప్రకృతిని పొందుచున్నాడు. విరక్తుడు జ్ఞానము కలవాడగుచున్నాడు
ఇది శ్రీమహాభారతము శాంతి పర్వమున మోక్షధర్మ పర్వమున మనుబృహస్పతి సంవాదమున రెండువందల అయిదవ అధ్యాయము
మను రువాచ - మను విట్లు పలికెను.
యదా తైః పఞ్చభిః పఞ్చ యుక్తాని మనసా సహ,
అథ తద్రక్ష్యతే బ్రహ్మ మణౌ సూత్ర మివార్పితమ్. 1
ఈ అయిదు విషయములతో అయిదు ఇంద్రియములను మనస్సుతోపాటు నిగ్రహించినపుడు మణియందు నిక్షిప్తమైన సూత్రమువలె బ్రహ్మము దర్శింప బడును.
తదేవ చ యథా సూత్రం సువర్ణే వర్తతే పునః,
ముక్తా స్వథ ప్రవాళేషు మృన్మయే రాజతే తథా. 2
తద్వద్గోఽ శ్వమనుష్యేషు తద్వద్ధస్తి మృగాదిషు,
తద్వత్కీటపతఙ్గేషు ప్రసక్తాత్మా స్వకర్మభిః. 3
అదే సూత్రము సువర్ణమునందు, ముత్యములయందు, పగడములయందు, మట్టిపూసలయందు, వెండినగయందు ఉండును. అట్లే తగులము పొందిన చిత్తము
కలవాడు తన కర్మములతో ఆవు, గుఱ్ఱము, మనుష్యులు, ఏనుగులు, మృగములు, పురుగులు, పక్షులు అనువాని యందు తిరుగాడుచుండును.
యేన యేన శరీరేణ యద్యత్కర్మ కరోత్యయమ్,
తేన తేన శరీరేణ తత్తత్ఫల ముపాశ్నుతే. 4
జీవుడు ఏయే శరీరముతో ఏయే కర్మమును చేయునో ఆయాశరీరముతో ఆయాఫలమును అనుభవించును.
యథా హ్యేకరసా భూమి రోషధ్యర్థానుసారిణీ,
తథా కర్మానుగా బుద్ధి రన్తరాత్మాను దర్శినీ. 5
ఒకేరసము గలదైనను భూమి ఓషధుల లక్షణములను అనుసరించి వేరువేరు పంటలను పండించునది అయినవిధముగా బుద్ధి అంతరాత్మ సాక్షిగా గలది యయినను కర్మముల ననుసరించునది యగును.
జ్ఞానపూర్వా భవే ల్లి ప్సా లిప్సా పూర్వా ఽ భిసన్ధితా,
అభిసన్ధిపూర్వకం కర్మ కర్మమూలం తతః ఫలమ్. 6
బుద్ధినిబట్టి రాగము, రాగమును బట్టి ప్రయత్నము, ప్రయత్నమునుబట్టి కర్మము, కర్మమూలముగా ఫలము ఏర్పడును.
ఫలం కర్మాత్మకం విద్యాత్ కర్మజ్ఞేయాత్మకం తథా,
జ్ఞేయం జ్ఞానాత్మకం విద్యాద్ జ్ఞానం సదసదాత్మకమ్. 7
ఫలము కర్మమునుబట్టి, కర్మము జ్ఞేయమునుబట్టి, జ్ఞేయము జ్ఞానమును బట్టి, జ్ఞానము సదసదాత్మకమైనదానిని బట్టి పుట్టునని తెలియదగును.
జ్ఞానానాం చ ఫలానాం చ జ్ఞేయానాం కర్మణాం తథా,
క్షయాన్తే యత్ఫలం విద్యా జ్ఞానం జ్ఞేయప్రతిష్ఠితమ్. 8
జ్ఞానములు ఫలములు, జ్ఞేయములు, కర్మములు అనువాని క్షయముతుదిని ఏదిఫలమో అది విద్యాజ్ఞానము. అది జ్ఞేయమునందు చక్కగా కుదురుకొని యుండునట్టిది.
మహద్ధి పరమం భూతం యత్ప్రపశ్యన్తి యోగినః,
అబుద్ధాస్తం న పశ్యన్తి హ్యాత్మస్థం గుణబుద్ధయః. 9
మహత్తు అనునది పరమమగు భూతము. దానిని యోగులు చక్కగా దర్శింతురు. గుణములందే బుద్ధిగల అబుద్ధులు ఆత్మయందున్న దానిని చూడజాలరు.
పృథివీరూపతో రూప మపా మిహ మహత్తరమ్,
అద్భ్యో మహత్తరం తేజ స్తేజసః పవనో మహాన్. 10
పవనా చ్చ మహ ద్వ్యోమ తస్మా త్పరతరం మనః,
మనసో మహతీ బుద్ధి ర్బుద్ధేః కాలో మహాన్ స్మృతః. 11
కాలా త్స భగవాన్ విష్ణు ర్యస్య సర్వమిదం జగత్,
నాది ర్న మధ్యం నైవాన్త స్తస్య దేవస్య విద్యతే. 12
పృథివి రూపముకంటె నీటిరూపము మిక్కిలి పెద్దది. దానికంటె మహత్తర మైనది అగ్ని. అగ్నికంటె గొప్పది వాయువు. వాయువుకంటె ఆకాశము గొప్పది. దానికంటె మించినది మనస్సు, మనస్సుకంటె గొప్పది బుద్ధి. బుద్ధికంటె కాలము, కాలముకంటె, ఈజగత్తు అంతయు తనదే అయిన విష్ణు భగవానుడు గొప్ప. ఆదేవునకు ఆది, మధ్యము, అంతము లేదు.
అనాదిత్వా దమధ్యత్వా దనన్తత్వాచ్చ సోఽ వ్యయః
అత్యేతి సర్వదుఃఖాని దుఃఖం హ్యస్తవదుచ్యతే. 13
ఆది మధ్యము, అంతములేనివాడగుటవలన అతడు అవ్యయుడు. సర్వదుః ఖములను అతిక్రమించినవాడు. దుఃఖము అంతము కలది యని చెప్పుదురు.
తద్ర్బహ్మ పరమం ప్రోక్తం తద్ధామ పరమం పదమ్,
తద్గత్వా కాలవిషయా ద్విముక్తా మోక్ష మాశ్రితాః 14
ఆబ్రహ్మమును పరమమని చెప్పుదురు. ఆతనిస్థానము పరమపదము. దానిని చేరుకొని కాల విషయమునుండి విముక్తులై మోక్షము నాశ్రయింతురు.
గుణేష్వేతే ప్రకాశన్తే నిర్గుణత్వా త్తతః పరమ్,
నివృత్తిలక్షణో ధర్మ స్తథా నన్త్యాయ కల్పతే. 15
వీరు గుణములయందు ప్రకాశింతురు. ఆపరమైనది గుణములు లేనిది కనుక అంతకు మించినట్టిది. ఆవిధముగా నివృత్తిలక్షణమైన ధర్మము మోక్షమునకు కారణమగును.
ఋచో యజూంషి సామాని శరీరాణి వ్యపాశ్రితాః,
జిహ్వాగ్రేషు ప్రవర్తన్తే యత్నసాధ్యా వినాశినః. 16
ఋక్కులు, యజుస్సులు, సామములు శరీరములను చేరుకొన్నవై నాలుకకొనల యందు మెలగుచుండును. అవి యత్నముచేత సాధింపబడునవి. వినాశము పొందునట్టివి.
న చైవ మిష్యతే బ్రహ్మ శరీరాశ్రయసంభవమ్,
న యత్న సాధ్యం తద్ర్బహ్మ నాదిమధ్యం నచాన్తవత్. 17
శరీరము నాశ్రయించి ఆవిర్భావము కలదియైనను బ్రహ్మము ఇట్టిదిగా దొరకునది కాదు. ఆబ్రహ్మము ప్రయత్నముతో సాధింపబడునది కాదు. ఏలయన దానికి ఆది, మధ్యము, అంతము అనునవి లేవు.
ఋచా మాది స్తథా సామ్నాం యజుషా మాది రుచ్యతే,
అన్త శ్చాదిమతాం దృష్టో నత్వాది ర్బ్రహ్మణః స్మృతః 18
ఋక్కులకు, సామములకు, యజుస్సులకు మొదలు కలదని చెప్పుదురు. ఆది కలవానికి అంతము కానవచ్చుచున్నది. బ్రహ్మమునకు ఆది అనునది తలపునకు రాని విషయము.
అనాదిత్వా దనన్తత్వా త్తదనన్త మథావ్యయమ్,
అవ్యయత్వా చ్చ నిర్దుఃఖం ద్వన్ద్వాభావ స్తతఃపరమ్. 19
ఆది, అంతములు లేనిదైన కారణమున అది అనంతము, అవ్యయము అగును. అవ్యయమగుటవలన దుఃఖము లేనిదగును. అటుపై ద్వంద్వములు లేనిదగును.
అదృష్టతోఽ నుపాయాచ్చ ప్రతిసన్ధేశ్చ కర్మణః,
న తేన మర్త్యాః పశ్యన్తి యేన గచ్ఛన్తి తత్పదమ్. 20
అదృష్టము వలనను, ఉపాయములేని కారణమునను, కర్మము ప్రతిసంధివలనను మర్త్యులు దేనితో ఆ బ్రహ్మపదము నెరుగుదురో ఆ మార్గమును కానకున్నారు.
విషయేషు చ సంసర్గా చ్ఛాశ్వతస్య చ దర్శనాత్,
మనసా చాన్య దాకాంక్షన్ పరం న ప్రతిపద్యతే. 21
విషయములందలి తగులమువలనను, శాశ్వతమును చూచుటవలనను, మనసుతో మరియొక దానిని గట్టిగా పొందగోరుచు నరుడు పరమును పొంద కున్నాడు.
గుణా న్యదిహ పశ్యన్తి తదిచ్ఛన్త్యపరే జనాః,
పరం నైవాభికాంక్షన్తి నిర్గుణత్వా ద్గుణార్థినః. 22
మఱికొందరు జనులు ఇందు గుణములు చూచిన కారణముగా వానినే కోరుచుందురు. గుణములను కోరువారు నిర్గుణమగుటవలన పరమును నిశ్చయముగా కోరరు.
గుణైర్య స్త్వవరై ర్యుక్తః కథం విద్యా త్పరాన్ గుణాన్,
అనుమానాద్ధి గన్తవ్యం గుణై రవయవైః పరమ్. 23
తక్కువజాతివైన గుణములతో కూడినవాడు పరములైన గుణముల నెట్లు ఎరుగును? అవయవములైన గుణములతో అనుమానము వలన కదా పరము పొందదగినది!
సూక్ష్మేణ మనసా విద్మో వాచా వక్తుం న శక్నుమః,
మనో హి మనసా గ్రాహ్యం దర్శనేన చ దర్శనమ్. 24
సూక్ష్మమగు మనస్సుతో దానిని తెలిసికొందుము. కాని వాక్కుతో దానిని చెప్పజాలము. మనస్సు చేత మనస్సు, కంటిచేత కన్ను మాత్రమే గ్రహింపబడునది యగును.
జ్ఞానేన నిర్మలీకృత్య బుద్ధిం బుద్ధ్యా మనస్తథా,
మనసా చేన్ద్రియగ్రామ మక్షరం ప్రతిపద్యతే. 25
జ్ఞానముచేత బుద్ధిని, బుద్ధిచేత మనస్సును, మనస్సుచేత ఇంద్రియముల సముదాయమును నిర్మలముగా చేసి అక్షరమును పొందగలుగును.
బుద్ధిప్రవీణో మనసా సమృద్ధో
నిరాశిషం నిర్గుణ మభ్యుపైతి,
పరం త్యజన్తీహ విలోడ్యమానా
హుతాశనం వాయు రివేన్ధనస్య. 26
బుద్ధివృత్తిని రూపుమాపినవాడు, మనస్సుతో సమృద్ధుడునైన వ్యక్తి ఆశలులేనిది, గుణములు లేనిది అగు పరమాత్మను పొందును. ఆశలతో అల్లకల్లోలముగానయినవారు కట్టెలోని అగ్నిని వాయువువలె పరమును త్యజింతురు.
గుణాదానే విప్రయోగే చ తేషాం
మనః సదా బుద్ధిపరావరాభ్యామ్,
అనేనైవ విధినా సంప్రవృత్తో
గుణాపాయే బ్రహ్మ శరీర మేతి. 27
గుణాదానమునందును, వాని ఎడబాటునందును మనస్సు ఎల్లవేళల బుద్ధిపరమైన బ్రహ్మముకొరకు, బుద్ధిఅవరమైన ఐశ్వర్యముకొరకును సిద్ధమగును. ఇదే విధితో గుణములు తొలగిపోవుట యందు మెలగువాడు బ్రహ్మశరీరమును పొందును.
అవ్యక్తాత్మా పురుషో వ్యక్త కర్మా
సో ఽ వ్యక్తత్వం గచ్ఛతి హ్యన్తకాలే,
తై రేవాయం చేన్ద్రియై ర్వర్ధమానై
రాయద్భి ర్వా వర్తతే ఽ కామరూపః 28
అవ్యక్తమగు ఆత్మకల పురుషుడు వ్యక్తములగు కర్మములు కలవాడగు చున్నాడు. మరియు అంతకాలమున అవ్యక్తతను పొందును. వృద్ధి పొందుచున్నవి, నలిగిపోవుచున్నవి వలెనున్న ఆ యింద్రియముల తోడనే అకామరూపుడై తిరుగు చుండును.
సర్వై రయం చేన్ద్రియైః సంప్రయుక్తో
దేహం ప్రాప్తః పఞ్చభూతాశ్రయః స్యాత్,
నాసా మర్థ్యా ద్గచ్ఛతి కర్మణే హ
హీనస్తేన పరమేణావ్యయేన. 29
సర్వములగు ఇంద్రియములతో కూడి యున్నదై ఈ జీవతత్త్వము దేహమును పొంది పంచభూతములుగా ఆశ్రయముగా నగుచున్నది. పరమము, అవ్యయము నగు తత్త్వము అందులేని కారణముచేత, అసమర్థతవలన అది కర్మముకొరకు పోజాలకున్నది.
పృథ్వ్యాం నరః పశ్యతి నాన్త మస్యా
హ్యన్త శ్చాస్యా భవితా చేతి విద్ధి,
పరం నయన్తీ హ విలోడ్యమానం
యథా ప్లవం వాయు రివార్ణవస్థమ్. 30
నరుడు భూమి అంతమును చూడడు. కాని అది దానికి కలదు. అట్లే దుఃఖ సంతతికిని అంతము కలదని ఎరుగుము. సముద్రములో నున్న గడ్డిమున్నగు దానిని ప్రవాహము నకనుగుణముగా గాలి కదలించుచు ఒడ్డునకు చేర్చు విధముగా కర్మములే జీవుని ఒడ్డునకు చేర్చుచున్నవి.
దివాకరో గుణ ముపలభ్య నిర్గుణో
యథా భవే దపగతరశ్మి మణ్డలః,
యథా హ్యసౌ ముని రిహ నిర్విశేషవాన్
స నిర్గుణం ప్రవిశతి బ్రహ్మ చావ్యయమ్. 31
సూర్యుడు కిరణముల సముదాయమును స్వీకరించియు, గుణములను వదలి తొలగిన కిరణముల సముదాయము కలవాడు నగునో అట్లే జీవుడును పోయిన సుఖిత్వాదిధర్మములు కలవాడై అవ్యయము, నిర్గుణమునగు బ్రహ్మమును ప్రవేశించును.
అనాగతం సుకృతవతాం పరాం గతిం
స్వయంభువం ప్రభవనిధాన మవ్యయమ్,
సనాతనం యదమృత మవ్యయం ధ్రువం
నిచాయ్య తత్పర మమృతత్వ మశ్నుతే. 32
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి
మనుబృహస్పతి సంవాదే షడధిక ద్విశతతమోఽధ్యాయః
రాకడ లేనిది, పుణ్యవంతులకు పరమమగుగతి యయినది, స్వయంభువు, సర్వమునకు ప్రభవము, నిధానము అయినది, సనాతనము, అమృతము, అవ్యయము, ధ్రువము అయిన పరబ్రహ్మమును చక్కగా తెలిసికొని ఆ పరమమగు అమృతత్వమును మానవుడు అనుభవించును.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మనుబృహస్పతి సంవాదముగల రెండువందల ఆరవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
పితామహ మహాప్రాజ్ఞ పుణ్డరీకాక్ష మచ్యుతమ్,
కర్తార మకృతం విష్ణుం భూతానాం ప్రభవాప్యయమ్. 1
నారాయణం హృషీకేశం గోవిన్ద మపరాజితమ్,
తత్త్వేన భరతశ్రేష్ఠ శ్రోతు మిచ్ఛామి కేశవమ్. 2
మహాప్రాజ్ఞా! తాతా! పుండరీకాక్షుడు, అచ్యుతుడు, సర్వమునకు కర్త తనకు కర్తలేనివాడు, విష్ణువు, సర్వభూతములకు పుట్టుకస్థానమైనవాడు, నారాయణుడు, హృషీకేశుడు, గోవిందుడు, అపరాజితుడు అయిన కేశవుని గూర్చి తత్త్వపూర్వకముగా వినగోరుచున్నాను.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
శ్రుతోఽయ మర్థో రామస్య జామదగ్న్యస్య జల్పతః,
నారదస్య చ దేవర్షేః కృష్ణ ద్వైపాయనస్య చ. 3
జమదగ్ని కొడుకు పరశురాముడు, దేవర్షియగు నారదుడు, కృష్ణద్వైపాయనుడు అనువారి మాటల వలన నాకీ యర్థము వినవచ్చినది.
అసితో దేవల స్తాత వాల్మీకిశ్చ మహాతపాః,
మార్కణ్డేయశ్చ గోవిన్దే కథయన్త్యద్భుతం మహత్. 4
నాయనా! అసితుడగు దేవలుడు, మహాతపశ్శాలి వాల్మీకి, మార్కండేయుడును
గోవిందునియందు అద్భుతమైన మాహాత్యమును చెప్పుచుందురు.
కేశవో భరతశ్రేష్ఠ భగవా నీశ్వరః ప్రభుః,
పురుషః సర్వమిత్యేవ శ్రూయతే బహుధా విభుః. 5
భరతశ్రేష్ఠా! కేశవుడు భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభువు, పురుషుడు, విభువు, సర్వము అని పెక్కు విధముల వినవచ్చుచున్నది.
కింతు యాని విదు ర్లోకే బ్రాహ్మణాః శార్ఙ్గధన్వని,
మహాత్మని మహాబాహో శృణు తాని యుధిష్ఠిర. 6
యుధిష్ఠిరా! శార్ఙ్గధన్వుడు, మహాత్ముడునగు శ్రీకృష్ణునియందు బ్రాహ్మణు లెరిగిన కర్మములెట్టివో చెప్పెదను. వానిని వినుము.
యాని చాహు ర్మనుష్యేన్ద్ర యే పురాణవిదో జనాః,
కర్మాణి త్విహ గోవిన్దే కీర్తయిష్యామి తాన్యహమ్. 7
పురాణవేత్తలగు జనులు గోవిందునియందలి యేయేకర్మములను ప్రీతితో చెప్పుకొందురో వానిని కొనియాడెదను.
మహాభూతాని భూతాత్మా మహాత్మా పురుషోత్తమః,
వాయు ర్జ్యోతి స్తథా చాపః ఖం చ గాం చాన్వకల్పయత్. 8
మహాత్ముడు, భూతాత్ముడునగు పురుషోత్తముడు మహాభూతములగు వాయువు, అగ్ని, జలము, ఆకాశము, భూమి అనువానిని సృజించెను.
స సృష్ట్వా పృథివీం చైవ సర్వభూతేశ్వరః ప్రభుః,
అప్స్వేవ భవనం చక్రే మహాత్మా పురుషోత్తమః. 9
మహాత్ముడు, పురుషోత్తముడు, సర్వభూతేశ్వరుడు నగు ప్రభువు పృథివిని స్పజించి జలములయందే నివాసమును చేసికొనెను.
సర్వతేజోమయ స్తస్మిన్ శయానః పురుషోత్తమః.
సోఽ గ్రజం సర్వభూతానాం సంకర్షణ మకల్పయత్. 10
సర్వతేజోమయుడు, అందు పవ్వళించినవాడునగు పురుషోత్తముడు భూతములన్నింటికి మొదటపుట్టిన సంకర్షణుని సృష్టించెను.
ఆశ్రయం సర్వభూతానాం మనసేతీహ శుశ్రుమ,
స ధారయతి భూతాని ఉభే భూతభవిష్యతీ. 11
మనస్సుతోపాటుగా అట్లు సృష్టినందిన ఆసంకర్షణుడు సర్వభూతములకు ఆశ్రయమని మేము వినియుంటిమి. అతడు కడచిన, కడవనున్న భూతములను రెండు విధములను పట్టినిలుపుచున్నాడు.
తత స్తస్మిన్ మహాబాహౌ ప్రాదుర్భూతే మహాత్మని,
భాస్కర ప్రతిమం దివ్యం నాభ్యాం పద్మ మజాయత. 12
ఆ విధముగా మహాబాహువు, మహాత్ముడునగు నతడు పుట్టగా అతని బొడ్డునందు సూర్యునివలె వెలుగొందెడు దివ్యమగు పద్మము పుట్టెను.
స తత్ర భగవాన్ దేవః పుష్కరే భ్రాజయన్ దిశః,
బ్రహ్మా సమభవ త్తాత సర్వభూతపితామహః. 13
ఆపద్మమునందు, నాయనా! దిక్కులను వెలుగొందజేయుచు, దేవుడు, భగవంతుడు, సర్వభూతములకు పితామహుడునగు బ్రహ్మ పుట్టెను.
తస్మిన్నపి మహాబాహౌ ప్రాదుర్భూతే మహాత్మని,
తమసా పూర్వజో జజ్ఞే మధు ర్నామ మహాసురః. 14
మహాత్ముడు, మహాబాహువునగు ఆబ్రహ్మ అట్లు పుట్టగా తమోగుణముతో అనాదియగు మధువను మహాసురుడు పుట్టెను.
తముగ్ర ముగ్ర కర్మాణ ముగ్ర కర్మ సమాస్థితమ్,
బ్రహ్మణోపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమః. 15
ఉగ్రుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రమగు కర్మమునందే నిలుకడకలవాడునగు నతనిని, బ్రహ్మకు ఉన్నతిని చేయుచు, పురుషోత్తముడు సంహరించెను.
తస్య తాత వధా త్సర్వే దేవదానవ మానవాః,
మధుసూదన మిత్యాహు రృషభం సర్వసాత్వతామ్. 16
ఆమధువును వధించుటవలన దేవతలు, దానవులు, మానవులు-అందరును యోగీశ్వరుడగు ఆపురుషోత్తముని మధుసూదనుడని పలికిరి.
బ్రహ్మానుససృజే పుత్రాన్ మానసాన్ దక్షసప్తమాన్,
మరీచి మత్ర్యంగిరసం పులస్త్యం పులహం క్రతుమ్. 17
బ్రహ్మ మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను వారిని, ఏడవవాడగు దక్షుని - ఈ మానసులగు పుత్రులను సృజించెను.
మరీచిః కశ్యపం తాత పుత్ర మగ్రజ మగ్రజః,
మానసం జనయామాస తైజసం బ్రహ్మవిత్తమమ్. 18
మానసపుత్రులలో పెద్దవాడగు మరీచి తేజస్సు రూపమైనవాడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అగు కశ్యపుని మానసపుత్రునిగా పుట్టించెను.
అంగుష్ఠా త్ససృజే బ్రహ్మా మరీచే రపి పూర్వజమ్,
సోఽభవ ద్భరతశ్రేష్ఠ దక్షో నామ ప్రజాపతిః. 19
బ్రహ్మ తనబొటనశ్రేలినుండి మరీచికంటె ముందున్నవానిని సృజించెను. అతడు దక్షుడను ప్రజాపతి ఆయెను.
తస్య పూర్వ మజాయన్త దశ తిస్రశ్చ భారత,
ప్రజాపతే ర్దుహితర స్తాసాం జ్యేష్ఠోఽభవ ద్దితిః. 20
అతనికి పూర్వము ప్రజాపతి కూతుండ్రు నలుబది మంది పుట్టిరి. వారిలో పెద్దది దితి.
సర్వధర్మవిశేషజ్ఞః పుణ్యకీర్తి ర్మహాయశాః,
మారీచః కశ్యప స్తాత సర్వాసా మభవ త్పతిః. 21
ధర్మములన్నింటి విశేషముల నెరిగినవాడు, పుణ్యకీర్తి గొప్పయశస్సు కలవాడు, మరీచి తనయుడునగు కశ్యపుడు వారికి పతి యాయెను.
ఉత్పాద్య తు మహాభాగ స్తాసా మవరజా దశ,
దదౌ ధర్మాయ ధర్మజ్ఞో దక్ష ఏవ ప్రజాపతిః. 22
ఆ నలువదిమందిలో చివరి పదిమందిని కని పుణ్యాత్ముడు, ధర్మజ్ఞుడునగు దక్షప్రజాపతి వారిని ధర్మునకు ఒసగెను. (భార్యలుగా)
ధర్మస్య వసవః పుత్రా రుద్రా శ్చామిత తేజసః,
విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ మరుత్వన్తశ్చ భారత. 23
ధర్మునకు వసువులు, అమితమగు తేజస్సుగల రుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, మరుత్వంతులు అనువారు పుత్రులు.
అపరాశ్చ యవీయస్య స్తాభ్యో ఽ న్యాః సప్తవింశతిః,
సోమ స్తాసాం మహాభాగః సర్వాసా మభవ త్పతిః. 24
వారికి చెల్లెండ్రయిన కన్యలు ఇరువది యేడుగురు మహాభాగుడగుచంద్రుడు వారందరికి పతియాయెను.
ఇతరాస్తు వ్యజాయన్త గన్ధర్వాం స్తురగాన్ ద్విజాన్,
గాశ్చ కింపురుషాన్ మత్స్యా నుద్భిజ్జాంశ్చ వనస్పతీన్. 25
కశ్యపుని స్త్రీలు తక్కినవారు గంధర్వులను, గుఱ్ఱములను, పక్షులను, గోవులను, కింపురుషులను, చేపలను, ఉద్భిజ్జములను (వృక్షజాతులను) వనస్పతులను పుట్టించిరి.
ఆదిత్యా నదితి ర్జజ్ఞే దేవశ్రేష్ఠాన్ మహాబలాన్,
తేషాం విష్ణు ర్వామనోఽ భూద్గోవిన్ద శ్చాభవత్ప్రభుః. 26
ఆదితి మహాబలము గలవారు, దేవశ్రేష్ఠులునగు ఆదిత్యులను కనెను. వారిలో విష్ణువు, గోవిందుడునగు ప్రభువు వామనుడును కలడు.
తస్య విక్రమణా చ్చాపి దేవానాం శ్రీ ర్వ్యవర్ధత,
దానవాశ్చ పరాభూతా దైతేయీ చాసురీ ప్రజా. 27
అతని విక్రమమువలన దేవతల సంపద వృద్ధిచెందెను. దానవులు పరాభవము నొందిరి. దితి సంతానమగు ఆసురసంతతి కూడ పరాభవమునొందెను.
విప్రచిత్తి ప్రధానాంశ్చ దానవా నసృజ ద్దనుః,
దితిస్తు సర్వా నసురాన్ మహాసత్త్వా నజీజనత్. 28
దనువు విప్రచిత్తి మొదలగు దానవులను సృజించెను. దితి గొప్పబలము గల అసురుల నందరను పుట్టించెను.
అహోరాత్రం చ కాలం చ యథర్తు మధుసూదనః,
పూర్వాహ్ణం చాపరాహ్ణం చ సర్వ మేవాను కల్పయత్. 29
మధుసూదనుడు ఋతువులననుసరించి, రాత్రింబగళ్లు గల కాలము, పూర్వాహ్ణము, ఆపరాహ్ణము అను కాల భాగములను అన్నింటిని ఏర్పరచెను.
ప్రధ్యాయ సోఽసృజ న్మేధాం స్తథా స్థావర జఙ్గమాన్,
పృథివీం సోఽసృజ ద్విశ్వాం సహితాం భూరితేజసా. 30
ఆ మధుసూదనుడు చక్కగా భావనచేసి మేధను, స్థావరజంగమములను, సమస్తము, సహితమునగు పృథివిని గొప్ప తేజస్సుతో సృజించెను.
తతః కృష్ణో మహాభాగః పున రేవ యుధిష్ఠిర,
బ్రాహ్మణానాం శతం శ్రేష్ఠం ముఖా దేవాసృజ త్ప్రభుః. 31
అంత పుణ్యాత్ముడు, ప్రభువునగు (వాసుదేవుడు) తనముఖమునుండి అనంతసంఖ్యలో శ్రేష్ఠులగు బ్రాహ్మణులను సృజించెను.
బాహుభ్యాం క్షత్రియశతం వైశ్యానా మూరుతఃశతమ్,
పద్భ్యాం శూద్రశతం చైవ కేశవో భరతర్షభ. 32
భరతవరేణ్యా! కేశవుడు బాహువులనుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, పాదములనుండి శూద్రులను మహాసంఖ్యలో పుట్టించెను.
స ఏవం చతురో వర్ణాన్ సముత్పాద్య మహాతపాః,
అధ్యక్షం సర్వభూతానాం ధాతార మకరో త్స్వయమ్. 33
ఆమహాభావుకుడు ఇట్లు నాలుగువర్ణములను పుట్టించి సర్వభూతములకు అధ్యక్షునిగా బ్రహ్మను స్వయముగా ఏర్పరచెను.
వేదవిద్యావిధాతారం బ్రహ్మాణ మమితద్యుతిమ్,
భూత మాతృగణాధ్యక్షం విరూపాక్షం చ సోఽసృజత్. 34
వేదవిద్యకు రూపకల్పన చేసినవాడు, గొప్పవర్చస్సు కలవాడు నగు బ్రహ్మను, భూతములకు మాతృగణములకు అధ్యక్షుడు అగు విరూపాక్షుని ఆకేశవుడు సృష్టి చేసెను.
సిపితారం చ పాపానాం పితౄణాం సమవర్తినమ్,
అసృజత్ సర్వభూతాత్మా నిధిపం చ ధనేశ్వరమ్, 35
పాపములను (పాపులను) పితృదేవతలను శాసించెడు సమవర్తిని (యముని) ధనముల కీశ్వరుడగు కుబేరుని సర్వభూతాత్ముడగు ఆ విష్ణువు సృజించెను.
యాదసా మసృజ న్నాథం వరుణం చ జలేశ్వరమ్,
వాసవం సర్వదేవానా మధ్యక్ష మకరో త్ప్రభుః. 36
జలజంతువులకు నాథుడు, జలములకు ఈశ్వరుడునగు వరుణుని సృజించెను. ఆప్రభువు దేవతలందరకు అధ్యక్షునిగా ఇంద్రుని ఏర్పరచెను.
యావద్యావ దభూ చ్ఛ్రద్ధా దేహం ధారయితుం నృణామ్,
తావత్తావదజీవం స్తే నాసీ ద్యమకృతం భయమ్. 37
నరులకు దేహమును నిలుపుకొను శ్రద్ధ ఎంతెంతగా కలదో అంతంతగా వారు బ్రదికిరి. వారికి యమునివలన కలుగు భయము లేకుండెను.
న చైషాం మైథునో ధర్మో బభూవ భరతర్షభ,
సంకల్పాదేవ చైతేషా మపత్య ముపపద్యతే. 38
ఆనాటి వారికి మిథున కర్మరూపమైన ధర్మము (స్త్రీపురుషుల కలయిక) లేకుండెను. సంకల్పమాత్రము చేతనే వారికి సంతానము కలుగుచుండెను.
తత స్త్రేతాయుగే కాలే సంస్పర్శా జ్జాయతే ప్రజా,
న హ్య భూ న్మైథునో ధర్మ స్తేషామపి జనాధిప. 39
జనాధిపా! అటుపై త్రేతాయుగ సమయమున తాకుటవలన ప్రజ పుట్టెను. ఆకాలమునాటి వారికిని మిథున ధర్మము లేకుండెడిది.
ద్వాపరే మైథునో ధర్మః ప్రజానా మభవ న్నృప,
తథా కలియుగే రాజన్ ద్వంద్వ మాపేదిరే జనాః. 40
ద్వాపరయుగమున ప్రజలకు మైథునధర్మము ఏర్పడెను. అట్లే రాజా! కలియుగమునందును జంటలుగా నగుటను ప్రజలు పొందిరి.
ఏష భూతపతి స్తాత స్వధ్యక్షశ్చ తథోచ్యతే,
నిరపేక్షాం శ్చ కౌన్తేయ కీర్తయిష్యామి తచ్ఛృణు. 41
నాయనా! ఇతడు (కేశవుడు) భూతపతి, అందరకు గొప్ప అధ్యక్షుడు. అతనిని గూర్చి ఇంతవరకు చెప్పితిని. ఇక నిరపేక్షులను గూర్చి కౌంతేయా!, వివరించెదను. దానిని వినుము.
దక్షిణాపథజన్మానః సర్వే నరవరాన్ధ్ర కాః,
గుహాః పులిన్దాః శబరా శ్చూచుకా మద్రకైఃసహ. 42
దక్షిణాపథమున జన్మించినవారు ఆంధ్రకులు, గుహులు, పుళిందులు, శబరులు, చూచుకులు, మద్రులు - వీరు నిరపేక్షులు.
ఉత్తరాపథజన్మానః కీర్తయిష్యామి తా న పి,
యౌన కాంబోజ గాన్ధారాః కిరాతా బర్బరైః సహ. 43
ఉత్తరాపథమున జన్మించినవారిలో అట్టివారిని గూర్చి చెప్పెదను. యౌనులు, కాంబోజులు, గాంధారులు, కిరాతులు, బర్బరులు.
ఏతే పాప కృత స్తాత చరన్తి పృథివీ మిమామ్,
శ్వపాకబల గృధ్రాణాం సధర్మాణో నరాధిప. 44
నాయనా! వీరందరు పాప కార్యములు చేయుచు ఈభూమిలో తిరుగు చుందురు. కుక్కమాంసము తినువారు, రాబందులు, గ్రద్దలు అనువానితో సమానులగు వారు.
నైతే కృతయుగే తాత చరన్తి పృథివీ మిమామ్,
త్రేతాప్రభృతి వర్ధనే తే జనా భరతర్షభ. 45
భరతవరేణ్యా! ఇట్టివారు కృతయుగమున ఈభూమియందు తిరుగాడలేదు. త్రేత మొదలుకొని ఇట్టివారు పెరుగజొచ్చిరి.
తత స్తస్మిన్ మహాఘోరే సన్ధ్యాకాల ఉపస్థితే,
రాజానః సమసజ్జన్త సమాసాద్యేత రేతరమ్. 46
అంత ఆమహాఘోరమగు సంధికాలము (త్రేతాద్వాపరముల నడిమికాలము) దాపురింపగా రాజులు ఒకరినొకరు తలపడి యుద్ధము లొనర్చిరి.
ఏవ మేష కురుశ్రేష్ఠ ప్రాదుర్భూతో మహాత్మనా,
దేవం దేవర్షి రాచష్ట నారదః సర్వలోకదృక్. 47
కురుశ్రేష్ఠా! మహాత్ముడగు శ్రీకృష్ణునిచేత ఈ విధముగా ఈభూతసృష్టి ఏర్పడెను. సర్వలోకములను దర్శించు దేవర్షి నారదుడు దేవుని గూర్చి దీనిని చెప్పెను.
నారదోఽ ప్యథ కృష్ణస్య పరం మేనే నరాధిప,
శాశ్వతత్వం మహాబాహో యథావ దృరతర్షభ. 48
మహాబాహూ! నరాధిపా! నారదుడు కృష్ణుని సమున్నతమగు శాశ్వతత్వమును చక్కగా ఉన్నదున్నట్లు భావించెను.
ఏవ మేష మహాబాహుః కేశవః సత్యవిక్రమః,
అచిన్త్యః పుణ్డరీకాక్షో నైష కేవల మానుషః 49
ఇతి శ్రీమహాభారతే శాన్తి పర్వణి మోక్ష ధర్మపర్వణి సర్వ
భూతోత్పత్తి కథనే సప్తాధిక ద్విశతతమోఽధ్యాయః
ఇట్లు ఈమహాబాహువు, సత్యవిక్రముడు, పుండరీకాక్షుడు, చింతింపనలవి కానివాడు. ఈకేశవుడు కేవలము మానుషుడు కాడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున సర్వభూతోత్పత్తి కథనముగల రెండువందల యేడవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
కే పూర్వ మాసన్ పతయః ప్రజానాం భరతర్షభ,
కే చర్షయో మహాభాగ దిక్షు ప్రత్యేకశః స్మృతాః. 1
మహాభాగా! మునుపు ఆయాదిక్కులయం దొక్కొక్కదానికి ప్రజలకు రాజులెవరైరి? ఋషులెవ్వరు?
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
శ్రూయతాం భరతశ్రేష్ఠ యన్మాం త్వం పరిపృచ్ఛసి,
ప్రజానాం పతయో యేఽ స్మిన్ దిక్షు యే చర్షయః స్మృతాః. 2
భరతశ్రేష్ఠా! నన్ను నీవడిగిన దానిని గురించి వినుము. ఏ దిక్కులందు ప్రజలకు నాథులెవ్వరో, ఋషులెవ్వరో చెప్పెదను.
ఏకః స్వయంభూ ర్భగవా నాద్యో బ్రహ్మా సనాతనః,
బ్రహ్మణః సప్త వై పుత్రా మహాత్మానః స్వయంభువః. 3
మొట్టమొదటివాడు, తనకు తానై పుట్టినవాడు, సనాతనుడు అగు భగవానుడు బ్రహ్మ ఒక్కడే. ఆతనికి మహాత్ములగు పుత్రులు ఏడుగురు కలరు.
మరీచి రత్ర్యంగిరసౌ పులస్త్యః పులహః క్రతుః,
వసిష్ఠ శ్చ మహాభాగః సదృశో వై స్వయంభువా. 4
మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, సాక్షాత్తు స్వయంభువున కెనయగు మహాభాగుడు వసిష్ఠుడు - వీరు ఆ యేడుగురు పుత్రులు.
సప్త బ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః,
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి సర్వా నేవ ప్రజాపతీన్. 5
ఈ ఏడుగురును బ్రహ్మలని పురాణములందు నిశ్చయము పొందినవారు. ఇటుపై ప్రజాపతులందరిని గూర్చి వక్కాణించెదను.
అత్రి వంశసముత్పన్నో బ్రహ్మయోనిః సనాతనః,
ప్రాచీనబర్హి ర్భగవాం స్తస్మా త్ర్పాచేతసో దశ. 6
అత్రివంశమున పుట్టినవాడు, బ్రహ్మయే జన్మకారణమైనవాడు, సనాతనుడు అగు భగవానుడు ప్రాచీనబర్హి. అతనినుండి ప్రాచేతసులు పదుగురు జన్మించిరి.
దశానాం తనయ స్త్వేకో దక్షో నామ ప్రజాపతిః,
తస్య ద్వే నామనీ లోకే దక్షః క ఇతి చోచ్యతే. 7
ఆ పదిమందికి దక్షుడను ప్రజాపతి ఒక్కడే కుమారుడు. అతనికి దక్షుడని, 'క' అని రెండు పేర్లు.
మరీచేః కశ్యపః పుత్ర స్తస్య ద్వే నామనీ స్మృతే,
అరిష్టనేమి రిత్యేకే కశ్యపేత్యపరే విదుః. 8
మరీచికి కశ్యపుడు పుత్రుడు. అతనికి రెండు పేర్లు కలవు. కొందరు అరిష్టనేమి యందురు. మరికొందరు కశ్యపుడని ఎరుగుదురు.
అత్రే శ్చైవౌరసః శ్రీమాన్ రాజా సోమశ్చ వీర్యవాన్, 9
సహస్రం యశ్చ దివ్యానాం యుగానాం పర్యుపాసితా.
అత్రి ఔరసపుత్రుడు శ్రీమంతుడు, వీర్యవంతుడు, రాజునగు సోముడు. అతడు వేయి దివ్యయుగముల కాలము తపమాచరించెను.
అర్యమా చైవ భగవాన్ యే చాస్య తనయా విభో,
ఏతే ప్రదేశాః కథితా భువనానాం ప్రభావనాః. 10
ఆర్యముడనియు నొక ప్రజాపతి కలడు. అతడును, అతని కుమారులును ఈ భువనము లన్నింటికి స్రష్టలై పాలించు శీలము కలవారైరి.
శశబిన్దోశ్చ భార్యాణాం సహస్రాణి దశాచ్యుత,
ఏకైకస్యాం సహస్రం తు తనయానా మభూ త్తదా. 11
శశబిందునికి పదివేలమంది భార్యలు గలరు. వారి కొక్కరికి వేయిమంది చొప్పున పుత్రులు కలిగిరి.
ఏవం శతసహస్రాణి దశ తస్య మహాత్మనః,
పుత్రాణాం చ న తే కఞ్చి దిచ్ఛంత్యన్యం ప్రజాపతిమ్. 12
ఇట్లు ఆ మహాత్మునకు పదినూరు వేల సంఖ్యలవారు కుమారులు కలిగిరి. వారిలో ఏ ఒక్కడును ఏ ఒక్కనిని ప్రజాపతిగా ఉండుటకు ఇష్టపడలేదు.
ప్రజా మాచక్షతే విప్రాః పురాణాః శాశబిన్దవీమ్,
సవృష్టి వంశ ప్రభవో మహావంశః ప్రజాపతేః. 13
చక్కని విద్యారహస్యముల నెరిగినపురాణతత్త్వవేత్తలు శశబిందుని సంతానమును గూర్చి చక్కగా చెప్పుకొనుచుందురు. అతడు వృష్ణివంశమునకు మూలకారణమైనవాడు. ఆ ప్రజాపతిది మహావంశము.
ఏతే ప్రజానాం పతయః సముద్దిష్టా యశస్వినః,
అతః పరం ప్రవక్ష్యామి దేవాం స్త్రిభువనేశ్వరాన్. 14
ఈ కీర్తిమంతులు ప్రజాపతులుగా ప్రసిద్ధి కెక్కిరి. అటుపై మూడులోకములకు నేలికలైన దేవులను గూర్చి చెప్పెదను.
భగోఽంశ శ్చార్యమా చైవ మిత్రోఽథ వరుణ స్తథా,
సవితా చైవ ధాతా చ వివస్వాంశ్చ మహాబలః. 15
త్వష్టా పూషా తథై వేన్ద్రో ద్వాదశో విష్ణు రుచ్యతే,
ఇత్యేతే ద్వాదిశాదిత్యాః కశ్యప స్యాత్మసంభవాః. 16
భగుడు, అంశుడు, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, సవిత, ధాత, మహాబలుడగు వివస్వంతుడు, త్వష్ట, పూష, ఇంద్రుడు, విష్ణువు - ఈ పన్నిద్దరు కశ్యపుని కుమారులు ఆదిత్యులు.
నాసత్య శ్చైవ దస్రశ్చ స్మృతౌ ద్వా వశ్వినా వపి,
మార్తణ స్యాత్మజా వేతా వష్టమస్య మహాత్మనః. 17
మహాత్ముడగు ఎనిమిదవ ఆదిత్యుడు మార్తండుని కుమారులు నాసత్యుడు, దస్రుడు అనువారు. వీరిని అశ్వులనియు నందురు. (మార్తండుడే వివస్వంతుడు).
తే చ పూర్వం సురాశ్చేతి ద్వివిధాః పితరః స్మృతాః,
త్వష్టు శ్చై వాత్మజః శ్రీమాన్ విశ్వరూపో మహాయశాః. 18
వీరును మొదట దేవతలే. పితృదేవతలు రెండు విధములైనవారు. త్వష్టకుమారుడు విశ్వరూపుడు గొప్ప సంపద, గొప్ప కీర్తి కలవాడు.
అజైక పాదహిర్భుధ్న్యో విరూపాక్షోఽథ రైవతః,
హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చ సురేశ్వరః.
సావిత్రశ్చ జయన్తశ్చ పినాకీ చాపరాజితః, 19
అజుడు, ఏకపాత్తు, అహిర్బుధ్న్యుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహురూపుడు, దేవతల కీశ్వరుడగు త్ర్యంబకుడు, పావిత్రుడు, జయంతుడు, ఓటమి యెరుగని పినాకి - వీరును త్వష్టకుమారులే.
పూర్వమేవ మహాభాగా వసవో ఽష్టౌ ప్రకీర్తితాః. 20
మహాభాగులు ఎనమండుగురు వసువులను గూర్చి మునుపే వివరించితిని.
ఏత ఏవంవిధా దేవా మనో రేవ ప్రజాపతేః,
తే చ పూర్వం సురా శ్చేతి ద్వివిధాః పితరః స్మృతాః. 21
ఈ విధమువారగు ఈ దేవతలందరు మనువను ప్రజాపతికి చెందినవారే. వారు, మొదట దేవతలనువారును తరువాత పితృదేవతలుగా పరిగణింపబడుదురు.
శీలయౌవనత స్త్వన్య స్తథాన్యః సిద్ధసాధ్యయోః,
ఋభవో మరుతశ్చైవ దేవానాం చోదితో గణః. 22
సిద్ధులు సాధ్యులు అను వారిలో మొదటివారి గణము శీలమును బట్టియు, రెండవవారి గణము యౌవనవమును బట్టియు ఏర్పడినవి. దేవతల గణము ఋభువులు, మరుత్తులుగా అయినది.
ఏవ మేతే సమామ్నాతా విశ్వేదేవా స్తథాశ్వినౌ,
ఈ విధముగా వీరు విశ్వదేవులు, అశ్వులుగా పేరుపొందిరి.
ఆదిత్యాః క్షత్రియా స్తేషాం విశశ్చ మరుత స్తథా,
అశ్వినౌ తు స్మృతౌ శూద్రౌ తపస్యుగ్రే సమాస్థితౌ. 23
వారిలో ఆదిత్యులు క్షత్రియులు, మరుత్తులు, వైశ్యులు, తీవ్రమగు తపస్సునందు నెలకొనియున్న అశ్విదేవతలు శూద్రులు.
స్మృతా స్త్వఙ్గిరసో దేవా బ్రాహ్మణా ఇతి నిశ్చయః,
ఇత్యేతం సర్వదేవానాం చాతుర్వర్ణ్యం ప్రకీర్తితమ్. 24
అంగిరసులగు దేవులు బ్రాహ్మణులుగా స్మరింపబడిరి. ఇది నిశ్చయము. ఈ విధముగా దేవతలందరిలో నాలుగు వర్ణముల ఏర్పాటు చెప్పబడినది.
ఏతాన్ వై ప్రాత రుత్థాయ దేవాన్ యస్తు ప్రకీర్తయేత్,
స్వజా దన్యకృతాచ్చైవ సర్వపాపా త్ప్రముచ్యతే. 25
ప్రాతఃకాలమున నిద్రలేచి యీ దేవతలను స్తుతింతువాడు తనంతతానుగా గాని యితరుల ప్రేరణతోగాని చేసిన పాపమంతటినుండి పూర్తిగా విడుదల పొందును.
యవక్రీతోఽథ రైభ్యశ్చ అర్వావసు పరావసూ,
ఔశిజ శ్చైవ కక్షీవాన్ బలశ్చాఙ్గిరసఃస్మృతః, 26
ఋషి ర్మేధాతిథేః పుత్రః కణ్వో బర్హిషద స్తథా.
త్రైలోక్యభావనా స్తాత ప్రాచ్యాం సప్తర్షయస్తథా, 27
యవక్రీతుడు, రైభ్యుడు, అర్వావసువు, పరావసువు, ఔశిజుడైన కక్షీవంతుడు, అంగిరసుని పుత్రుడు బలుడు. అట్లే మేధాతిథి పుత్రుడు కణ్వుడు, బర్హిషదుడు, మరియు నేడుగురు ఋషులు, మూడు లోకములకు మార్గదర్శకులగు వీరందరు తూర్పుదిక్కున నుండెడివారు.
ఉన్ముచో విముచ శ్చైవ స్వస్త్యాత్రేయశ్చ వీర్యవాన్. 28
ప్రముచ శ్చేధ్మవాహశ్చ భగవాం శ్చ దృఢవ్రతః,
మిత్రా వరుణయోః పుత్ర స్తథాగస్త్యః ప్రతాపవాన్.
ఏతే బ్రహ్మర్షయో నిత్య మాస్థితా దక్షిణాం దిశమ్, 29
ఉన్ముచుడు, విముచుడు, ఇధ్మవాహుడు, భగవంతుడగు దృఢవ్రతుడు, మిత్రావరుణుల కుమారుడును, ప్రతాపము కలవాడునగు అగస్త్యుడు - ఈ బ్రహ్మర్షులు నిత్యము దక్షిణదిక్కునందు నెలకొనియుండిరి.
ఉషంగుః కవషో ధౌమ్యః పరివ్యాధశ్చ వీర్యవాన్.
ఏకతశ్చ ద్వితశ్చైవ త్రితశ్చైవ మహర్షయః, 30
అత్రేః పుత్రశ్చ భగవాం స్తథా సారస్వతః ప్రభుః.
ఏతే చైవ మహాత్మనః పశ్చిమా మాశ్రితా దిశమ్, 31
ఉషంగుడు, కవషుడు, ధౌమ్యుడు, శక్తిసంపన్నుడగు పరివ్యాధుడు, ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అను మహర్షులు, అత్రి కుమారుడు సారస్వతుడు - ఈ మహాత్ములు పడమటిదిక్కున నుండిరి.
ఆత్రేయశ్చ వసిష్ఠశ్చ కాశ్యపశ్చ మహానృషిః.
గౌతమోఽథ భరద్వాజో విశ్వామిత్రోఽథ కౌశికః, 32
తథైవ పుత్రో భగవా నృచీకస్య మహాత్మనః.
జమదగ్నిశ్చ సప్తైతే ఉదీచీ మాశ్రితా దిశమ్, 33
ఆత్రేయుడు, వసిష్ఠుడు, మహర్షియగు కాశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, కుశికగోత్రమువాడగు విశ్వామిత్రుడు, మహాత్ముడగు ఋచీకుని పుత్రుడగు జమదగ్ని అను నీ యేడుగురును ఉత్తరదిక్కున ఉండిరి.
ఏతే ప్రతిదిశం సర్వే కీర్తితా స్తిగ్మతేజసః 34
సాక్షీభూతా మహాత్మానో భువనానాం ప్రభావనాః.
ఏవ మేతే మహాత్మానః స్థితాః ప్రత్యేకశో దిశమ్. 35
ప్రతి దిక్కునను ఉన్నవారు, గొప్ప తేజస్సు కలవారునగు ఋషులను గూర్చి చెప్పితిని. వీరు సాక్షిభూతులు, మహాత్ములు. లోకములన్నింటికి గొప్ప సృష్టికర్తలు. ఈ మహాత్ములు ఒక్కొక్కదిక్కునందు ప్రత్యేకముగా నివసించియుండిరి.
ఏతేషాం కీర్తనం కృత్వా సర్వపాపా త్ప్రముచ్యతే,
యస్యాం యస్యాం దిశి హ్యేతే తాం దేశం శరణం గతః
ముచ్యతే సర్వపాపేభ్యః స్వస్తిమాం శ్చ గృహాన్ వ్రజేత్. 36
ఇతి శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మ పర్వణి
దిశాస్వస్తికం నామ అష్టాధిక ద్విశతతమోఽధ్యాయః
వీరిని స్తుతించి మనుజుడు సర్వపాపములనుండియు ముక్తినందును. ఏయే దిక్కునందున్న వారిని ఆయాదిక్కునందు శరణము పొందినవాడు, సర్వపాపములనుండి విముక్తి పొందినవాడు, శుభములు కలవాడునై గృహముల కరుగును.
ఇది శ్రీ మహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున దిశాస్వస్తికమను
రెండువందల యెనిమిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లనెను.
పితామహ మహాప్రాజ్ఞ యుధి సత్యపరాక్రమ,
శ్రోతు మిచ్ఛామి కార్త్న్న్యేన కృష్ణ మవ్యయ మీశ్వరమ్. 1
తాతా! మహాప్రజ్ఞాశాలీ! యుద్ధమున సత్యపరాక్రమముగల వీరుడా! అవ్యయుడు, ఈశ్వరుడునగు శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా వినగోరుచున్నాను.
యచ్చాస్య తేజః సుమహ ద్యచ్చ కర్మ పరాకృతమ్,
తన్మే సర్వం యథాతత్త్వం బ్రూహి త్వం పురుషర్షభ. 2
మిక్కిలి మహిమగల ఈతని తేజమెట్టిదో, పూర్వ మీత డేయే మహాకార్యములను చేసెనో అది యంతయు తత్త్వవ్యాఖ్యానపూర్వకముగా నాకు చెప్పుము.
తిర్యగ్యోని గతో రూపం కథం ధారితవాన్ ప్రభుః,
కేన కార్యనిసర్గేణ తమాఖ్యాహి మహాబల. 3
ఈ ప్రభుడు ఏపని సంబంధముతో పశుపక్ష్యాదుల కడుపున పుట్టిన రూపమును ఎందుకు ధరించెనో, ఓ మహాబలా! దానిని నాకు చక్కగా వక్కాణింపుము.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు చెప్పెను.
పురాఽహం మృగయాం యాతో మార్కండేయాశ్రమే స్థితః,
తత్రాపశ్యం మునిగణాన్ సమాసీనాన్ సహస్రశః. 4
మునుపొకనాడు నేను వేటకై వెళ్లి మార్కండేయాశ్రమమున నుంటిని. అందు వేలకొలది సంఖ్యలలో ఆసీనులై యున్న మునిగణములను చూచితిని.
తతస్తే మధుపర్కేణ పూజాం చక్రు రథో మయి,
ప్రతిగృహ్య చ తాం పూజాం ప్రత్యనన్ద మృషీ నహమ్. 5
అంత ఆ ఋషులు మధుపర్కముతో నాయందు మన్నన గావించిరి. నేనా పూజను గ్రహించి మరల ఆ ఋషులను గౌరవించితిని.
కథైషా కథితా తత్ర కశ్యపేన మహర్షిణా,
మనః ప్రహ్లాదినీం దివ్యాం తా మిహైకమనాః శృణు. 6
అచట కశ్యపమహర్షి నాకీ కథను చెప్పెను. మనస్సున పరమానందము కలిగించు దివ్యమైన ఆ కథను దానియందే మనసునిలుపుకొని వినుము.
పురా దానవముఖ్యా హి క్రోధలోభ సమన్వితాః,
బలేన మత్తాః శతశో నరకాద్యా మహాసురాః. 7
తథైవ చాన్యే బహవో దానవా యుద్ధ దుర్మదాః,
న సహన్తే స్మ దేవానాం సమృద్ధిం తా మనుత్తమామ్. 8
పూర్వము క్రోధము, లోభము పై కొన్న దానవశ్రేష్ఠులు కొందరు బలముతో మదించినవారు నరకుడు మొదలగువారు, యుద్ధమున ఒడలెరుగనివారు వందలకొలదిగా దేవతల మిక్కిలి శ్రేష్ఠమగు ఆ సమృద్ధిని చూచి ఓర్వలేకుండిరి.
దానవై రర్ద్యమానాస్తు దేవా దేవర్షయస్తథా,
న శర్మ లేభిరే రాజన్ విశమానా స్తత స్తతః. 9
దానవులు పీడించుచుండగా దేవతలు, దేవర్షులును సుఖమును పొందనివారై యందందు చొరబారుచుండిరి.
పృథివీ మార్తరూపాం తే సమపశ్యన్ దివౌకసః,
దానవై రభిసంస్తీర్ణాం ఘోరరూపై ర్మహాబలై. 10
ఆ రక్కసులు పిక్కటిల్లిన బలముతో, ఘోరములైన రూపములతో భూమి నంతటిని ఆక్రమించుకొనియుండగా స్వర్గవాసులగు దేవతలు కుమిలి పోవుచున్న భూమిని పరిశీలనతో చూచిరి.
భారార్తా మప్రహృష్టాం చ దుఃఖితాం సంనిమజ్ఞతామ్,
అథాదితేయాః సంత్రస్తా బ్రహ్మాణ మిద మబ్రువన్. 11
భారముతో పీడనొందినది, ఏ మాత్రము హృదయ వికాసము లేనిది, దుఃఖముతో కుమిలిపోవుచున్నది. క్రుంగిపోవుచున్నది యగు భూమిని చూచి ఆదిత్యులు నిండు భయము కలవారై బ్రహ్మతో నిట్లు పలికిరి.
కథం శక్ష్యామహే బ్రహ్మన్ దానవై రభిమర్దనమ్,
స్వయంభూ స్తానువా చేదం నిసృష్టోఽత్ర విధి ర్మయా. 12
బ్రహ్మదేవా! ఈ రాక్షసుల మహాపీడ నెట్లు సహింపగలము? - అనగా బ్రహ్మ దీనికొక ఏర్పాటు నేను చేసియుంచితి నని పలికెను.
తే వరేణాభిసంపన్నా బలేన చ మదేన చ,
నావబుధ్యన్తి సంమూఢా విష్ణు మవ్యక్తదర్శనమ్. 13
వారు వరముతో, బలముతో, మదముతో తెగబలిసినవారై ఒడలెరుగక వ్యక్తము కాని దర్శనము గల విష్ణుని తెలియజాలకుండిరి.
వరాహరూపిణం దేవ మధృష్య మమరై రపి,
ఏష వేగేన గత్వా హి యత్ర తే దానవాధమాః. 14
అన్తర్భూమిగతా ఘోరా నివసన్తి సహస్రశః,
శమయిష్యతి తచ్ఛ్రుత్వా జహృషుః సురసత్తమాః. 15
ఆ విష్ణువు వరాహరూపము కలవాడు. అమరులకును అణప నలవికాడు. అట్టివానిని వీరెరుగరు. అతడు వేగముతో నరిగి భూమిలోపల ఘోరరూపములతో వేలకొలదిగా నున్న ఆ దానవాధములను అణచివేయును - అని చెప్పగా విని దేవతలందరు హర్షము నొందిరి.
తతో విష్ణు ర్మహాతేజా వారాహం రూప మాస్థితః,
అన్తర్భూమిం సంప్రవిశ్య జగామ దితిజాన్ ప్రతి. 16
అంత గొప్పతేజస్సుగలవిష్ణువు వరాహరూపమును తాల్చి భూమిలోనికి చొచ్చుకొనిపోయి ఆ రాక్షసులపైకి వెడలెను.
దృష్ట్వా చ సహితాః సర్వే దైత్యాః సత్త్వ మమానుషమ్,
ప్రసహ్య తరసా సర్వే సంతస్థుః కాలమోహితాః. 17
దివ్యమైన ఆ సత్త్వగుణపూర్ణుడగు విష్ణువును గాంచి ఆ దైత్యులందరు ఒక్కుమ్మడిగా కాలమోహితులై వడివడిగా ఒక్క పెట్టున నాశమొందిరి.
తతస్తే సమభిద్రుత్య వరాహం జగృహుః సమమ్,
సంక్రుద్ధాశ్చ వరాహం తం వ్యకర్షన్త సమస్తతః. 18
అంత వారందరు వరాహస్వామి పై బడి ఒక్కమారుగా పట్టుకొనిరి. క్రోధము పైకొన్నవారై అన్నివైపులనుండి ఆ స్వామిని గుంజసాగిరి.
దానవేన్ద్రా మహాకాయా మహావీర్యబలోచ్ఛ్రితాః,
నాశక్నువంశ్చ కిఞ్చిత్తే తస్య కర్తుం తదా విభో. 19
ఆ దానవేంద్రులు పెద్దపెద్దకాయములు కలవారు. గొప్ప పరాక్రమము, బలము పొంగు లెత్తుచున్నవారు అయినను ఆ స్వామికి ఏ కొంచెమును కీడు చేయజాలనివారైరి.
తతోఽ గచ్ఛ న్విస్మయం తే దానవేన్ద్రా భయం తథా,
సంశయం గత మాత్మానం మేనిరే చ సహస్రశః 20
అంత నా దానవేంద్రులందరు వేలకొలది అచ్చెరువందిరి. భయపడిరి. తమ విషయమున సంశయమును భావించిరి.
తతో దేవాధిదేవః స యోగాత్మా యోగసారథిః,
యోగ మాస్థాయ భగవాం స్తదా భరతసత్తమ. 21
విననాద మహానందం క్షోభయన్ దైత్యదానవాన్,
సన్నాదితా యేన లోకాః సర్వాశ్చైవ దిశో దశ. 22
అంత దేవులకు అధిదేవుడు, యోగాత్ముడు, యోగసారథియయిన ఈ భగవంతుడు యోగమును పూన్చుకొని దైత్యులను దానవులను క్షోభ పెట్టుచు ఒక మహానాదమును గావించెను. దానితో లోకములన్నియు, దిక్కులన్నియు మ్రోగిపోయెను.
తేన సన్నాదశబ్దేన లోకానాం క్షోభ ఆగమత్,
సంత్రస్తాశ్చ భృశం లోకే దేవాః శక్ర పురోగమాః. 23
ఆ పెటపెటలాడు శబ్ధముతో లోకములకు క్షోభ కలిగెను. దేవేంద్రునితో పాటు దేవతలందరు మిక్కిలిగా భయపడిరి.
నిర్విచేష్టం జగ చ్చాపి బభూ వాతిభృశం తదా,
స్థావరం జఙ్గమం చైవ తేన నాదేన మోహితమ్. 24
జగత్తంతయు మిక్కిలిగా చేష్టలుడిగినదాయెను. ఆ నాదముతో స్థావరము జంగమము అయిన సమస్తము ఒడలెరుగని స్థితికి వచ్చెను.
తత స్తే దానవాః సర్వే తేన నాదేన భీషితాః,
పేతు ర్గతాసవశ్చైవ విష్ణు తేజః ప్రమోహితాః. 25
అంత నా దానవులందరు ఆ నాదముతో భయపడిపోయిరి. విష్ణుతేజస్సుతో మోహమందిన వారై ప్రాణములు కోల్పడి నేలకొరిగిరి.
రసాతలగత శ్చాపి వరాహ స్త్రిదశ ద్విషామ్,
ఖురై ర్విదారయామాస మాంస మేదోఽస్థి సంచయాన్. 26
ఆ వరాహము రసాతలమునకు కూడ నరిగి దేవతల పగవారగు రాక్షసుల మాంసములను, మేదస్సును, ఎముకల ప్రోగులను గిట్టలతో చీల్చి చెండాడెను.
నాదేన తేన మహతా సనాతన ఇతి స్మృతః,
పద్మనాభో మహాయోగీ భూతాచార్యః స భూతరాట్. 27
ఆ మహానాదముచేత మహాయోగి, భూతాచార్యుడు, భూతరాట్టు అయిన పద్మనాభుడు సనాతనుడని తలపులందాడెను.
తతో దేవగణాః సర్వే పితామహ ముపాద్రవన్,
తత్ర గత్వా మహాత్మాన మూచు శ్చైవ జగత్పతిమ్. 28
అంత దేవతల గుంపులన్నియు బ్రహ్మకడకు పరువు లెత్తెను. అందరిగి జగత్పతియగు ఆ మహాత్మునితో నిట్లు పలికిరి.
నాదోఽయం కీదృశో దేవ నైతం విద్మ వయం ప్రభో,
కోఽసౌ హి కస్య వా నాదో యేన విహ్వలితం జగత్. 29
ప్రభూ! ఇది యెట్టి నాదమో మేమెరుగకున్నాము. ఇది యేమి? ఎవనిది? దీనితో జగమంతయు కళవళ పడిపోయినది.
దేవాశ్చ దానవా శ్చైవ మోహితా స్తస్య తేజసా .
దేవతలు దానవులు నందరు దాని తేజస్సుతో మోహితులైరి.
ఏతస్మి న్నన్తరే విష్ణు ర్వారాహం రూప మాస్థితః,
ఉదతిష్ఠ న్మహాబాహో స్తూయామానో మహర్షిభిః. 30
ఇంతలో విష్ణువు వరాహరూపమును తాల్చి మహర్షులందరు కొనియాడుచుండగా పైకి లేచెను.
పితామహ ఉవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.
నిహత్య దానవ పతీన్ మహావర్ష్మా మహాబలః,
ఏష దేవో మహాయోగీ భూతాత్మా భూతభావనః. 31
సర్వ భూతేశ్వరో యోగీ ముని రాత్మా తథా ఽఽ త్మనః,
స్థిరీభవత కృష్ణోఽయం సర్వ విఘ్న వినాశనః. 32
ఈ మహాకాయము గలవాడు, గొప్పబలము కలవాడు, మహాయోగి, భూతాత్ముడు, భూతములను భావించువాడు (రక్షించువాడు) సర్వభూతేశ్వరుడు, యోగి, ముని, ఆత్మమునకు ఆత్మయైనవాడు, సర్వవిఘ్నములను రూపుమాపువాడునగు నీతడు కృష్ణుడు. మీ రందరు కుదురుగా నుండుడు.
కృత్వా కర్మాతి సాధ్వేత దశక్య మమిత ప్రభః,
సమాయాతః స్వమాత్మానం మహాభాగో మహాద్యుతిః. 33
మిక్కిలి సాధువైన, ఇతరులకు చేయనలవి కాని ఈ కార్యమును చేసి అవధులు లేని కాంతులు గల ఈ మహానుభావుడు, గొప్ప వర్చస్సు గలవాడు ఈ స్వామి తన రూపమును పొందుచున్నాడు.
పద్మనాభో మహాయోగీ మహాత్మా భూతభావనః,
న సంతాపో నభీః కార్యా శోకో వాసురసత్తమాః. 34
ఈతడు పద్మనాభుడు మహాయోగి మహాత్ముడు భూతముల నెల్ల కాపాడువాడు. దేవతోత్తములారా! మీరు సంతాపము పొందకుడు. భయము వలదు. దుఃఖము పడకుడు.
విధి రేష ప్రభావశ్చ కాలః సంక్షయ కారకః,
లోకాన్ ధారయతా తేన నాదో ముక్తో మహాత్మనా. 35
ఈతడు విధి. ప్రభావము కలవాడు. సర్వమును లయము చేయు కాల స్వరూపుడు. ఈ లోకముల నన్నింటిని పట్టి నిలుపు ఈ మహాత్ముడు ఈ నాదమును వెలువరించెను.
స ఏష హి మహాబాహుః సర్వలోకన మస్కృతః,
అచ్యుతః పుండరీకాక్షః సర్వభూతాది రీశ్వరః. 36
ఇతి శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి
అన్తర్భూమివిక్రీడనం నామ నవాధిక ద్విశతతమోఽధ్యాయః
ఈ జీవాత్మ స్వరూపుడే మహాబాహువు, సర్వలోకముల నమస్కారములు పొందువాడు, అచ్యుతుడు, పద్మములవంటి కన్నులతో అలరారువాడు. సర్వభూతములకు మొదటివాడు ఈశ్వరుడు.
ఇది శ్రీమహాభారతము శాంతిపర్వమున మోక్షధర్మపర్వమున అంతర్భూమివిక్రీడనమను రెండువందల తొమ్మిదవ అధ్యాయము.
యుధిష్ఠిర ఉవాచ - యుధిష్ఠిరు డిట్లు పలికెను.
యోగం మే పరమం తాత మోక్షస్య వద భారత,
తమహం తత్త్వతో జ్ఞాతు మిచ్ఛామి వదతాం వర. 1
తాతా! భారతా! వాగ్విశారదా! నాకు పరమమైన మోక్ష సంబంధమగు యోగమును గూర్చి పలుకుము. నేను దానిని తత్త్వ పూర్వకముగా తెలియ గోరుచున్నాను.
భీష్మ ఉవాచ - భీష్ము డిట్లు పలికెను.
అత్రా ప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్,
సంవాదం మోక్షసంయుక్తం శిష్యస్య గురుణా సహ. 2
ఇందును ఒక ప్రాతకాలపు ఇతిహాసమును ఉదాహరింతురు. మోక్ష సంబంధముగా ఇది శిష్యునకు గురువుతోనైన సంవాదము.
కశ్చి బ్రాహ్మణ మాసీన మాచార్య మృషి సత్తమమ్,
తేజోరాశిం మహాత్మానం సత్యసంధం జితేన్ద్రియమ్. 3
శిష్యః పరమమేధావీ శ్రేయోఽ ర్థీ సుసమాహితః,
చరణా వుపసంగృహ్య స్థితః ప్రాంజలి రబ్రవీత్. 4
చక్కగా కూర్చున్నవాడు, ఋషులలో శ్రేష్ఠుడు, తేజస్సులకు రాశి, మహాత్ముడు, సత్యసంధుడు, జితేంద్రియుడు నగు ఒక ఆచార్యుని కడకు గొప్ప ప్రజ్ఞ కలవాడు, శ్రేయమును కోరువాడు, స్థిరచిత్తము కలవాడునగు ఒక శిష్యు డరుదెంచి పాదముల నంటి నమస్కరించి చేతులు జోడించి యిట్లు పలికెను.
ఉపాసనాత్ ప్రసన్నోఽసి యది వై భగవ న్మమ,
సంశయో మే మహాన్ కశ్చి త్తన్మే వ్యాఖ్యాతు మర్హసి, 5
కుత శ్చాహం కుతశ్చ త్వం తత్సమ్యగ్ బ్రూహి యత్పరమ్
భగవంతుడా! నా ఉపాసనవలన నీవు ప్రసన్నుడవైనచో,నాకొక పెద్ద సంశయము కలదు. దీనిని నీవు వివరించి చెప్పవలయును. నేనెటనుండి వచ్చితిని? నీవెటనుండి వచ్చితివి? పరమైనదేది? దానిని నాకు చక్కగా తెలియజెప్పుము.
కథం చ సర్వభూతేషు సమేషు ద్విజసత్తమ,
సమ్య గ్వృత్తా నివర్తన్తే విపరీతాః క్షయోదయాః. 6
ద్విజసత్తమా! భూతములన్నియు సమములే అయినపుడు చక్కగా సాగవలసిన తరుగుదల, పెరుగుదల అను విపరీతస్థితు లెట్లేర్పడును?
వేదేషు చాపి యద్వాక్యం లౌకికం వ్యాపకం చ యత్,
ఏత ద్విద్వన్ యథాతత్త్వం సర్వం వ్యాఖ్యాతు మర్హసి. 7
వేదములందును లౌకికము, వ్యాపకము అయిన వాక్యము కలదు. విద్వాంసుడా! దీనిని గూర్చి మూలముట్టుగా అంతయు నాకు వివరింపుము.
గురు రువాచ - గురు విట్లు పలికెను.
శృణు శిష్య మహాప్రాజ్ఞ బ్రహ్మ గుహ్య మిదం పరమ్,
అధ్యాత్మం సర్వవిద్యానా మాగమానాం చ యద్వసు. 8
ఓయి బుద్ధిశాలీ! శిష్యా! వినుము. ఇది వేదము నందలి శ్రేష్ఠమగు రహస్యము. ఈ అధ్యాత్మజ్ఞానము సర్వ విద్యలయు, ఆగమములయు ధనము.
వాసుదేవః పర మిదం విశ్వస్య బ్రహ్మణో ముఖమ్,
సత్యం జ్ఞాన మథో యజ్ఞ స్తితిక్షా దమ ఆర్జవమ్. 9
ఇది సమస్తమైన వేదమునకు ముఖము. శ్రేష్ఠము. సత్యము, జ్ఞానము, యజ్ఞము, తితిక్ష, దమము, ఆర్జవము ఇదియంతయు వాసుదేవుడే.
పురుషం సనాతనం విష్ణుం యం తం వేదవిదో విదుః
సర్గ ప్రళయ కర్తార మవ్యక్తం బ్రహ్మ శాశ్వతమ్. 10
పురుషుడు, సనాతనుడు, విష్ణువు అని వేదతత్త్వ మెరిగిన వా రెవనిని భావింతురో ఆ తత్త్వము అవ్యక్తము, శాశ్వతమగు బ్రహ్మము. ఆదియే సృష్టికి ప్రళయమునకు కర్త.
తదిదం బ్రహ్మ వార్ష్ణేయ మితిహాసం శృణుష్వ మే,
బ్రాహ్మణో బ్రాహ్మణైః శ్రావ్యో రాజన్యః క్షత్రియై స్తథా. 11
వైశ్యో వైశ్యై స్తథా శ్రావ్యః శూద్రైః శూద్రో మహామనాః
మాహాత్మ్యం దేవదేవస్య విష్ణో రమితతేజసః. 12
ఆ యీ వార్ష్ణే యమను వేదరూపమైన ఇతిహాసమును నానుండి వినుము. బ్రాహ్మణుడు బ్రాహ్మణులతో, క్షత్రియుడు క్షత్రియులతో, వైశ్యుడు వైశ్యులతో, దొడ్డబుద్ధిగల శూద్రుడు శూద్రులతో కలిసి వాసుదేవుని తత్త్వమును వినవలయును. దేవదేవుడు, పట్టనలవికాని తేజస్సుగల వాడునగు ఈ విష్ణుని మాహాత్మ్యమును ఆకర్ణింపవలయును.
అర్హస్త్వమసి కల్యాణం వార్ష్ణేయం శృణు యత్పరమ్,
కాలచక్ర మనాద్యన్తం భావాభావస్వలక్షణమ్. 13
మంగళము పరమమగు కాలచక్రము, తుది మొదళ్లు లేనిది, సృష్టి ప్రళయములు స్వరూపలక్షణముగా గలది యగు వార్ష్ణేయతత్త్వమును అర్హుడవగు నీవు వినుము.
త్రైలోక్యం సర్వ భూతేశే చక్రవ త్పరివర్తతే,
యత్తదక్షర మవ్యక్త మమృతం బ్రహ్మ శాశ్వతమ్.
వదన్తి పురుషవ్యాఘ్ర కేశవం పురుషర్షభమ్ 14
సర్వ భూతములకు ప్రభువగు నాతనియందు మూడులోకములు చక్రమువలె తిరుగుచున్నవి. అక్షరము, అవ్యక్తము, అమృతము, బ్రహ్మము, శాశ్వతము అగు తత్త్వముగా పురుష శ్రేష్ఠుడగు కేశవుని పలుకుదురు.
పితౄన్ దేవా నృషీం శ్చైవ తథా వై యక్షరాక్షసాన్,
నాగాసురమనుష్యాంశ్చ సృజతే పరమోఽ వ్యయః. 15
పితృదేవతలను, దేవతలను, ఋషులను, యక్షులను, రాక్షసులను, నాగులను, అసురులను, మనుష్యులను ఆ పరముడు, అవ్యయుడు నగు వాసుదేవుడు సృజించుచున్నాడు.
తథైవ వేదశాస్త్రాణి లోకధర్మాం శ్చ శాశ్వతాన్,
ప్రలయం ప్రకృతిం ప్రాప్య యుగాదౌ సృజతే పునః, 16
అట్లే వేదములను, శాస్త్రములను, శాశ్వతములగు లోకధర్మములను, ప్రళయమును, ప్రకృతిని పొంది మరల యుగము మొదట సృజించును.
యథార్తా వృతు లిఙ్గాని నానారూపాణి పర్యయే,
దృశ్యన్తే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు. 17
ఋతువునందు ఋతువు గుర్తులు పెక్కు విధములుగా ఒకప్పుడిది ఒకప్పుడది యన్నట్లు కానవచ్చును. అట్లే యుగాదులయందు భావములును కానవచ్చును.
అథ యద్యద్యదా భాతి కాలయోగా ద్యుగాదిషు,
తత్త దుత్పద్యతే జ్ఞానం లోకయాత్రావిధానజమ్. 18
కాలయోగమువలన యుగాదులయందు ఏది ఏది యెప్పుడు ప్రకాశించునో లోకయాత్రకు సంబంధించిన విధానమువలన ఏర్పడిన ఆయాజ్ఞానము అప్పుడప్పుడు కలుగుచుండును.
యుగాన్తేఽ న్తర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః,
లేభిరే తపసా పూర్వ మనుజ్ఞాతా స్వయంభువా. 19
యుగము తుదిని స్వరూపము తెలియకుండ పోయిన ఇతిహాసములతో కూడిన వేదములను బ్రహ్మ ఉపదేశమును పొందిన మహర్షులు తపస్సుతో మరల పొందిరి.
వేదవి ద్వేద భగవాన్ వేదాఙ్గాని బృహస్పతిః,
భార్గవో నీతిశాస్త్రం తు జగాద జగతో హితమ్. 20
వేదముల నెరిగిన భగవానుడు బ్రహ్మ శిక్ష మొదలగు వేదాంగములను బృహస్పతి, జగత్తునకు హితమైన నీతి శాస్త్రమును శుక్రాచార్యుడును తెలిసికొని తెలియజెప్పిరి.
గాన్ధర్వం నారదో వేద భరద్వాజో ధనుర్గ్రహమ్,
దేవర్షి చరితం గార్గ్యః కృష్ణాత్రేయ శ్చికిత్సితమ్. 21
నారదుడు సంగీత విద్యను, భరద్వాజుడు ధనుర్విద్యను, గార్గ్యుడు దేవర్షుల చరిత్రను, కృష్ణాత్రేయుడు వైద్యవిద్యను ఎరిగిరి.
న్యాయతన్త్రాణ్యనేకాని తై స్తై రుక్తాని వాదిభిః,
హేత్వా గమసదాచారై ర్యదుక్తం తదుపాస్యతామ్. 22
వాదపటిమగల ఆయాబుద్ధిశాలులు ఉపదేశించిన పెక్కు న్యాయతంత్రములను - యుక్తి, వేదము, సదాచారము అను ప్రమాణములలో నిరూపించిన వానిని మానవుడు ఉపాసింపవలయును.
అనాద్యం తత్పరం బ్రహ్మ న దేవా నర్షయో విదుః,
ఏక స్తద్వేద భగవాన్ ధాతా నారాయణః ప్రభుః. 23
తనకొక కారణమని లేని ఆ పరబ్రహ్మమును దేవతలు, ఋషులును ఎరుగరు. దాని నెరిగినవాడు ఒక్క నారాయణుడు మాత్రమే. అతడే ధాత, ప్రభువు.
నారాయణా దృషి గణా స్తథా ముఖ్యాః సురాసురాః
రాజర్షయః పురాణాశ్చ పరమం దుఃఖ భేషజమ్. 24
నారాయణునివలన ఋషుల గణములు, అట్లే ముఖ్యులగు దేవతలు రాక్షసులు, పూర్వకాలమువారగు రాజర్షులు దుఃఖమునకు ఔషధమైన ఈ పరమ జ్ఞానమును పొందిరి.
పురుషాధిష్ఠితాన్ భావాన్ ప్రకృతిః సూయతే యదా,
హేతుయుక్తమతః పూర్వం జగత్సంపరివర్తతే. 25
పురుషుడు ఆలోచించిన భావములను ప్రకృతి వెలువరించునపుడు అంతకు మునుపు హేతువులతో కూడిన జగత్తు చక్కగా రూపు దిద్దుకొనును.
దీపాదన్యే యథా దీపాః ప్రవర్తన్తే సహస్రశః,
ప్రకృతిః సూయతే తద్వ దానన్త్యా న్నాపచీయతే. 26
ఒక దీపమునుండి వేలకొలది దీపములు వెలుగు పొందును. అదేవిధముగా ప్రకృతి తక్కిన వానిని పుట్టించును. అయినను అనంతత్వము నుండి తరుగువోదు.
అవ్యక్తా త్కర్మజా బుద్ధి రహంకారం ప్రసూయతే,
ఆకాశం చాప్యహంకారా ద్వాయు రాకాశ సంభవః. 27
వాయో స్తేజ స్తత శ్చాప అద్భ్యోఽథ వసుధోద్గతా,
మూల ప్రకృతయో హ్యష్టా జగదేతా స్వ వస్థితమ్. 28
అవ్యక్తమను తత్త్వమునుండి కర్మమువలన నేర్పడు బుద్ధి అహంకారమును పుట్టించును. అహంకారమునుండి ఆకాశము పుట్టును. వాయువు ఆకాశము నుండి ఏర్పడినట్టిది. వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలములు, దానినుండి భూమియు ఏర్పడినవి. ఇట్లు మూలప్రకృతులు ఎనిమిది. జగత్తు వీనియందు నెలకొని యున్నది.
జ్ఞానేన్ద్రియా ణ్యతః పఞ్చ పఞ్చ కర్మేంద్రియాణ్యపి,
విషయాః పఞ్చ చైకం చ వికారే షోడశం మనః. 29
ఆ ప్రకృతినుండి అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదు విషయములు, వాని వికారము నందేర్పడిన పదునారవది యగు మనస్సు వెలువడినవి.
శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా ఘ్రాణం జ్ఞానేన్ద్రియాణ్యథ,
పాదౌ పాయు రుపస్థశ్చ హస్తౌ వాక్కర్మణీ అపి. 30
చెవి, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు అనునవి జ్ఞానేంద్రియములు. కాళ్లు, మలవిసర్జన అవయవము, గుహ్యాంగము, చేతులు, నోరు అనునవి కర్మేంద్రియములు.
శబ్దః స్పర్శం చ రూపం చ రసో గన్ధ స్తథైవ చ,
విజ్ఞేయం వ్యాపకం చిత్తం తేషు సర్వగతం మనః 31
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనునవి వ్యాపించు లక్షణము గల చిత్తమని తెలియదగినది. వాని నన్నింటిని చేరుకొనునది మనస్సే.
రసజ్ఞానే తు జిహ్వేయం వ్యాహృతే వాక్ తథోచ్యతే,
ఇన్ద్రియై ర్వివిధై ర్యుక్తం సర్వం వ్యక్తం మన స్తథా. 32
రసమును ఎరుగునపుడు అదియే (మనస్సే) నాలుక. పలుకునపుడు అదియే వాగింద్రియము. ఇట్లు వేర్వేరు ఇంద్రియములతో కూడినదై సర్వమును వ్యక్తము చేయునది మనస్సే.
విద్యాత్తు షోడశైతాని దైవతాని విభాగశః,
దేహేషు జ్ఞాన కర్తార ముపాసీన ముపాసతే. 33
ఈ పదునారు దేవతలును విడివిడి స్వరూపములతో దేహములందు స్థిరముగా కూర్చున్న జ్ఞానకర్తను ఉపాసించుచున్నవి.
తద్వత్సోమగుణా జిహ్వా గన్ధస్తు పృథివీ గుణః,
శ్రోత్రం నభోగుణం చైవ చక్షు రగ్నే ర్గుణ స్తథా,
స్పర్శం వాయుగుణం విద్యా త్సర్వభూతేషు సర్వదా. 34
నాలుక జలగుణము కలది. వాసన నేలగుణము, చెవి ఆకాశము యొక్క గుణము. కన్ను అగ్నిగుణము. స్పర్శ వాయుగుణము. ఇది సర్వభూతములయందు ఎల్లవేళల ఇట్టిదే.
మనః సత్త్వ గుణం ప్రాహుః సత్వ మవ్యక్తజం తథా,
సర్వ భూతాత్మ భూతస్థం తస్మా ద్బుధ్యేత బుద్ధిమాన్. 35
మనస్సు సత్వగుణమందురు. సత్వము అవ్యక్తమునుండి పుట్టినది. అందువలన అది సర్వభూతముల ఆత్మగానయిన దానియందున్నదిగా బుద్ధి మంతుడు తెలియవలయును.
ఏతే భావా జగత్సర్వం వహన్తి సచరాచరమ్,
శ్రితా విరజసం దేవం య మాహుః ప్రకృతేః పరమ్. 36
ఈ భావములు చరాచరములతో కూడిన సర్వజగత్తును తాల్చియున్నవి. ప్రకృతి కావలనున్న రజోగుణ స్పర్శ లేని దేవుని ఆశ్రయించి యున్నవి.
నవద్వారం పురం పుణ్య మేతై ర్భావైః సమన్వితమ్,
వ్యాప్య శేతే మహా నాత్మా తస్మాత్పురుష ఉచ్యతే 37
ఈ భావములతో కూడి యున్నట్టిది, పుణ్యమైనది తొమ్మిది ద్వారములు కలది యగు పురమును వ్యాపించి శయనించును కనుక ఆ గొప్పది యగు ఆత్మను పురుషుడు అని చెప్పుదురు.
అజరః సోఽ మరశ్చైవ వ్యక్తి వ్యక్తోప దేశవాన్,
వ్యాపకః సగుణ: సూక్ష్మః సర్వ భూత గుణాశ్రయః. 38
ఆ పురుషుడు అజరుడు, అమరుడు, వ్యక్తము, అవ్యక్తము అని వేదమునందు ఉపదేశము కలవాడు. అంతట వ్యాపించు లక్షణము కలవాడు. గుణముల కలయిక కలవాడు, సూక్ష్మస్వరూపుడు, సర్వ భూతములకు గుణములకు ఆశ్రయమైనవాడు.
యథాదీపః ప్రకాశాత్మా హ్రస్వో వా యది వా మహాన్,
జ్ఞానాత్మానం తథా విద్యాత్ పురుషం సర్వ జన్తుషు. 39
ప్రకాశించుస్వరూపము గల దీపము పొట్టిదో పొడుగుదో అయి వెలుగు చున్నట్లు సర్వప్రాణులయందును పురుషుడు ఆ విధముగా జ్ఞానస్వరూపుడై యుండునని తెలియదగును.
శ్రోత్రం వేదయతే వేద్యం స శృణోతి స పశ్యతి,
కారణం తస్య దేహోఽ యం స కర్తా సర్వకర్మణామ్. 40
చెవి దేనితో తెలియదగినదానిని తెలియుచున్నదో అదియే వినుచున్నది దానికి ఈ దేహము కారణము. అదియే సర్వ కర్మములకు కర్త.
అగ్ని ర్దారుగతో యద్వ ద్భిన్నే దారౌ న దృశ్యతే,
తథైవాత్మా శరీరస్థో యోగేనైవానుదృశ్యతే. 41
కట్టెయందు నిప్పు కలదు. కాని కట్టెను చీల్చినచో అది కనబడదు. అట్లే శరీరమునందున్న ఆత్మ యోగముతో మాత్రమే కానవచ్చును.
అగ్ని ర్యథా హ్యుపాయేన మథిత్వా దారు దృశ్యతే,
తథైవాత్మా శరీరస్థో యోగే నై వాత్ర దృశ్యతే. 42
కొయ్యను రాపిడి పెట్టుట అను ఉపాయముతో దానియందు అగ్ని కానవచ్చుచున్నది. అట్లే శరీరమునందున్న ఆత్మ యోగము లేని కారణముచే కానరాకున్నది.
నదీ ష్వాపో యథా యుక్తా యథా సూర్యే మరీచయః,
సంతతత్వా ద్యథా యాన్తి తథా దేహాః శరీరిణమ్. 43
నదులయందు జలములు, సూర్యునియందు కిరణములు ఎట్లు కూడియుండి అవిచ్ఛిన్నముగా ప్రసరించుచుండునో అట్లే దేహములు ఆత్మను చేరుకొనుచున్నవి.
స్వప్నయోగే యథైవాత్మా ప ఞ్చేన్ద్రియ సమాయుతః,
దేహ ముత్సృజ్య వై యాతి తథైవాత్మోపలభ్యతే. 44
స్వప్న యోగమున ఆత్మ ఇంద్రియము లైదింటితో కూడినదై దేహమును వదలి వెళ్లిన
తీరున ఆత్మయు దేహమును వదలి తెలియవచ్చును.
కర్మణా బాధ్యతే రూపం కర్మణా చోపలభ్యతే,
కర్మణా నీయతేఽన్యత్ర స్వకృతేన బలీయసా. 45
మిక్కిలి బలము కలది, తానై చేసికొన్నది యగు కర్మముతో పూర్వ దేహము చెడును. మరియొక దేహమునకు కొనిపోబడుచున్నది.
సతు దేహా ద్యథా దేహం త్యక్త్వాఽన్యం ప్రతిపద్యతే,
తథాఽ న్యం సంప్రవక్ష్యామి భూత గ్రామం స్వకర్మజమ్. 46
ఇతి శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మ పర్వణి వార్ష్ణే
యాధ్యాత్మ కథనే దశాధికద్విశతతమోఽ ధ్యాయః
ఆ ఆత్మ ఒక దేహమును విడిచి మరియొక దేహమును పొందు విధముగా తన కర్మములవలన పుట్టిన భూతసముదాయమును కూడ మరియొక దేహమును చేరుకొనునని చెప్పుదును.
ఇది శ్రీ మహాభారతము శాంతి సర్వమున మోక్షధర్మపర్వమున వార్ష్ణే యాధ్యాత్మకథనము గల రెండువందల పదియవ అధ్యాయము.
201
మనుబృహస్పతుల సంవాదము
201
“ స్వాతంత్య్రం యేషు కర్తుః స్యాత్ కరణాకరణం ప్రతి
తాన్యేవ తు నిషిద్ధాని కర్మాణీహ శమాదిభి’’
“అస్వాతంత్ర్యం తు యేషు స్యాత్ కర్తుః కర్మసు సర్వదా,
సమాహితో క్త్యాఽ థేదానీం తన్ని రోధో విధీయతే’’
“పిణ్డీకృత్యేన్ద్రియగ్రామం బుద్ధా వారోప్య నిశ్చలమ్,
విషయాం స్తత్స్మృతీ స్త్యక్త్యా తిష్ఠే చ్చిదనురోధతః’’
“ఏషో ఽ భ్యుపాయః సర్వత్ర వేదాన్తేషు ప్రతిష్ఠితః,
తత్త్వమస్యాది వాక్యోత్థ జ్ఞానోత్పత్త్య ర్థ మాదరాత్’’
“ఏక ఏవ తు భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః,
ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచన్ద్రవత్’’
ద్వ్యధిక ద్విశతతమోఽధ్యాయః
202
మనుబృహస్పతుల సంవాదము
202
త్ర్యధిక ద్విశతతమోఽధ్యాయః
‘‘ యదా చర్మవదా కాశం వేష్టయిష్యన్తి మానవాః,
తదా దేవ మవిజ్ఞాయ దుఃఖస్యాన్తో భవిష్యతి’’.
“ఫల వ్యాప్తత్వ మేవేహ శాస్త్రకృద్భి ర్నిరాకృతమ్,
బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తివ్యాప్తి రపేక్ష్యతే”
203
మనుబృహస్పతి సంవాదము
203
చతురధిక ద్విశతతమోఽధ్యాయః
యచ్ఛే ద్వాఙ్మనసీ ప్రాజ్ఞ స్తద్యచ్ఛే జ్జ్ఞాన ఆత్మని,
జ్ఞాన మాత్మని మహతి నియచ్ఛే చ్ఛాప్త ఆత్మని”
“లయవిక్షేప రహితం మనః కృత్వా సునిశ్చలమ్
యదా యాత్యున్మ నీభావం తదా తత్పరమంపదమ్”
204
మనుబృహస్పతి సంవాదము
204
పఞ్చాధిక ద్విశతతమోఽధ్యాయః
205
మనుబృహస్పతి సంవాదము
205
“యదా పఞ్చావతిష్ఠనే జ్ఞానాని మనసా సహ
బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్”
“అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకమ్,
ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయమ్”
ఊహః శబ్దాఽధ్యయనం దుఃఖవిఘాతా స్త్రయః సుహృత్సాప్తిః
దానం చ సిద్ధయోఽసౌ సిద్ధేః పూర్వోఽంకుశ స్త్రివిధః"
‘‘హ్యయం జ్యోతి రాత్మా వివస్వా నపోభిన్నా బహుధైకోఽ ను గచ్ఛన్
ఉపాధివా క్రియతే భేదరూపో దేవః క్షేత్రేష్వేవ మజోఽ య మాత్మా
ఘటసంవృత మాకాశం నీయమానే యథా ఘటే
ఘటో నీయేత వాకాశం తద్వజ్జీవో నభోపమః’’
షడధిక ద్విశతతమోఽ ధ్యాయః
206
మనుబృహస్పతి సంవాదము
206
సప్తాధిక ద్విశతతమోఽ ధ్యాయః
“దేవానాం కార్యసిద్ధ్యర్థ మావిర్భవతి సా యదా,
ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాభిధీయతే”
“ఐశ్వర్యస్య సమగ్రస్య జ్ఞానస్య యశసః శ్రియః
వైరాగ్యస్య చ ధర్మస్య షణ్ణాం భగ ఇతీరణా”
207
సర్వభూతముల ఉత్పత్తిని చెప్పుట
207
అష్టాధిక ద్విశతతమోఽధ్యాయః
208
దిశాస్వస్తికము*
208
209
నవాధిక ద్విశతతమోఽధ్యాయః
అంతర్భూమి విక్రీడనము*
209
దశాధిక ద్విశతతమోఽధ్యాయః
210
వార్ష్ణేయాధ్యాత్మ కథనము *
210