Content

Back
Book Balakandamu
Chapter No 6
Pages 6
Read Time 6 Minutes

Content

విషయసూచిక

Cover Page

Title Page

Copyright

నారాయణస్మృతి

ముందుమాట

  1. నారదుడు వాల్మీకికి సంక్షిప్తముగ రామాయణకథ చెప్పుట.
  2. రామాయణప్రారంభము తమసాతీరమున క్రౌంచపక్షిని వ్యాధుడు చంపగా చూచిన వాల్మీకి తన శోకమును శ్లోకరూపమున ప్రకటించుట. బ్రహ్మదేవుడు రామచరితవర్ణనాత్మక మగు కావ్యము రచింపు మని వాల్మీకిని ఆదేశించుట.
  3. రామాయణమునందలి విషయముల సంక్షిప్తవర్ణనము.
  4. వాల్మీకి ఇరువదినాలుగువేల శ్లోకముల రామాయణము రచించి దానిని కుశలవులకు నేర్పుట. వారు రామాయణగానము చేయుచుండగా విని మునులు వారిని, రామాయణమును ప్రశంసించుట. శ్రీరాముడు కుశలవులను తన కొలువునకు రావించి, ఆదరించి, వారు గానము చేయగా రామాయణమును వినుట.
  5. దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము.
  6. దశరథుడు రాజ్యపాలనము చేయు కాలమున పౌరుల సుఖైశ్వర్యాదుల వర్ణనము.
  7. రాజామాత్యుల గుణనీత్యాదుల వర్ణనము.
  8. సంతానోత్పత్తి నిమిత్తమై దశరథుడు అశ్వమేధయాగము చేయ సంకల్పించుట. మంత్రులును, బ్రాహ్మణులును దానిని ఆమోదించుట.
  9. సుమంత్రుడు దశరథునకు ఋశ్యశృంగునిగూర్చి సంక్షిప్తముగ చెప్పుట.
  10. ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట. అతడు శాంతను వివాహ మాడుట.
  11. సుమంత్రుని ఉపదేశము ప్రకారము దశరథుడు అంగదేశమునకు వెళ్లి రోమపాదుని ఒప్పించి శాంతాఋష్యశృంగులను అయోధ్యకు తీసికొని వచ్చుట.
  12. యాగము చేయింపు డని దశరథుడు ఋషులను కోరుట. తగు సంభారములను సమకూర్పు మని ఋషులు ఆతనితో చెప్పుట. దశరథుడు తన అమాత్యులను అందులకై ఆదేశించుట.
  13. దశరథుడు యాగము ప్రారంభింపచేయు మని వసిష్ఠుని కోరుట. అందులకై సేవకులను ఆజ్ఞాపించుట. వివిధదేశరాజుల నాహ్వానించుటకై వసిష్ఠుడు సుమంత్రుని ఆజ్ఞాపించుట. వచ్చిన రాజులకు ఆదర సత్కారములు చేయుట. పత్నీసమేతు డైన దశరథుడు యజ్ఞదీక్ష గ్రహించుట.
  14. దశరథుడు సాంగోపాంగముగా సరయూతీరమున అశ్వమేధయాగము చేయుట.
  15. ఋష్యశృంగుని యాధ్వర్యవమున దశరథుడు పుత్రేష్టి ప్రారంభించుట. దేవతలు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు రావణవధోపాయము చెప్పుట. శ్రీమహావిష్ణువు దేవతల నోదార్చుట.
  16. నరరూపమున అవతరించి రావణవధ చేయవలె నని దేవతలు శ్రీమహా విష్ణువును అభ్యర్థించుట. దశరథుడు పుత్రేష్టి చేయుచుండగా అగ్నికుండమునుండి ఆవిర్భవించిన ప్రాజాపత్యపురుషుడు ఆతనికి పాయసము నిచ్చుట. దానిని భుజించి ఆతని భార్యలు గర్భవతు లగుట.
  17. బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా దేవాదులు అనేక వానరవీరులను సృజించుట.
  18. రాజులను ఋష్యశృంగుని తమ దేశములకు పంపివేసి పత్నీసమేతుడైన దశరథుడు తన నగరమునకు తిరిగి వచ్చుట. శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నుల ఉత్పత్తి. వారికి జాతకర్మాది సంస్కారములు చేయుట. వారి శీలగుణాదుల వర్ణనము. విశ్వామిత్రుడు దశరథునివద్దకు వచ్చుట. అతనికి దశరథుడు సత్కారము చేయుట.
  19. ‘‘నేను చేయ తలపెట్టిన యాగమును రక్షించుటకై రాముని పంపుము’’ అని విశ్వామిత్రుడు కోరగా దశరథుడు మిగుల దుఃఖించుట.
  20. దశరథుడు తన కోరికను మన్నింపక పోవుటచే విశ్వామిత్రుడు కోపించుట.
  21. విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై పలికిన పలుకులు విని వసిష్ఠుడు రాముని విశ్వామిత్రునితో పంపుటకై దశరథునకు నచ్చజెప్పుట.
  22. దశరథుడు స్వస్త్యయనాదులు జరిపి రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట. మార్గమధ్యమున విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’ ‘అతిబల’ అను విద్య లుపదేశించుట.
  23. శ్రీరామలక్ష్మణసమేతు డైన విశ్వామిత్రుడు సరయూగంగాసంగమము దగ్గర నున్న ఆశ్రమములో రాత్రి విశ్రమించుట.
  24. నావపై ఎక్కి నదిని దాటుచున్నపుడు ‘‘నీరు బ్రద్దలగుచున్నట్లు ఇంత గంభీరధ్వని వచ్చుచున్న దేమి కారణము?’’ అని శ్రీరాముడు అడుగగా విశ్వామిత్రుడు ప్రత్యుత్తర మిచ్చుట. విశ్వామిత్రుడు మలద-కరూష-తాటకావనములను గూర్చి రామునకు తెలిపి తాటకను చంపు మని శ్రీరాముని ప్రేరేపించుట.
  25. శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు తాటకాజననము, ఆమె వివాహము, శాపము మొదలగు విషయములు చెప్పి, ఆమెను సంహరింపు మని రాముని ప్రేరేపించుట.
  26. శ్రీరాముడు తాటకను సంహరించుట.
  27. విశ్వామిత్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రము లుపదేశించుట.
  28. విశ్వామిత్రుడు శ్రీరామునకు ప్రయోగించిన అస్త్రములను ఎట్లు ఉప సంహరించవలెనో ఉపదేశించి మరికొన్ని అస్త్రములు కూడ ఉపదేశించుట. శ్రీరాముడు అచట నున్న ఆశ్రమమును గూర్చి ప్రశ్నించుట.
  29. విశ్వామిత్రుడు శ్రీరామునకు సిద్ధాశ్రమవృత్తాంతము చెప్పుట. రామ లక్ష్మణులతో తన ఆశ్రమము చేరిన విశ్వామిత్రుని అచటి మునులందరును పూజించుట.
  30. శ్రీరాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగమును సంరక్షించుట.
  31. శ్రీరామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమగుట. వారు మార్గమధ్యమున, సాయంకాలము శోణభద్రతీరమున విశ్రమించుట.
  32. బ్రహ్మపుత్రు డైన కుశుని నలుగురు పుత్రుల వర్ణనము, శోణభద్ర తీరప్రాంతమునందలి దేశమునకు వసువు అధిపతి యని చెప్పుట. వాయువు కోపముచే కుశనాభుని నూర్గురు కుమార్తెలను గూనివారినిగా చేయుట.
  33. కుశనాభుడు వాయువు విషయమున ధైర్యముతో, ఓర్పుతో ప్రవర్తించినందుకు తన కుమార్తెలను మెచ్చుకొనుట. బ్రహ్మదత్తుని జన్మవృత్తాంతము. అతడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట.
  34. గాధి జన్మవృత్తాంతము, విశ్వామిత్రుని సోదరి యైన కౌశికి ప్రశంస. కథ ముగించి విశ్వామిత్రుడు అర్ధరాత్రమును వర్ణించుచు, నిద్రించవలసినదిగా అందరిని ఆదేశించి, తాను కూడ నిద్రించుట.
  35. విశ్వామిత్రాదులు శోణభద్రను దాటి, గంగాతీరము చేరి, రాత్రి అచట నివసించుట. శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు గంగావతరణకథ చెప్పుట.
  36. దేవతలు పార్వతీశివుల రతిక్రీడలు విఘ్నము కలిగింపగా పార్వతి దేవతలకును, భూదేవికిని శాపము నిచ్చుట.
  37. గంగనుండి కార్తికేయుడు జనించుట.
  38. సగరచక్రవర్తికి సంతానోత్పత్తి, అతడు యాగము చేయుటకై సంకల్పించి ప్రారంభించుట.
  39. సగరచక్రవర్తి విడచిన యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట, సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట. దేవత లందరును పోయి బ్రహ్మవద్ద మొరపెట్టుకొనుట.
  40. సగరపుత్రులు అచిరకాలమున నశింపగల రని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల నూరడించుట, భూమిని త్రవ్వుచు పాతాళమునకు పోయిన సగరపుత్రులు అచట కపిలుని దగ్గర యజ్ఞాశ్వమును చూచి ఆతనిని చంపుటకై వెళ్లగా అతడు వారిని హుంకరించి భస్మము చేయుట.
  41. సగరచక్రవర్తి ఆజ్ఞచే అంశుమంతుడు రసాతలమునకు వెళ్లి యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట. అతడు తన పినతండ్రుల వినాశమును గూర్చియు, గంగోదకముతో తర్పణము చేసిననే వారు ఉద్ధరింపబడుదు రనియు సగరచక్రవర్తికి చెప్పుట.
  42. అంశుమంతుడు గంగను భూలోకమునకు తీసికొనివచ్చుటకై తపస్సుచేసి విఫలు డగుట. పిమ్మట భగీరథుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పింపగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆతనితో భూలోకమునకు దిగు గంగను తన తలపై ధరించుటకై శివుని ప్రార్థించు మని చెప్పుట.
  43. భగీరథుని తపస్సుచే సంతసించిన శివుడు గంగను శిరస్సుపై ధరించి ఆమెను బిందుసరోవరమునందు విడుచుట. గంగ అచట ఏడు ప్రవాహములుగ చీలి, భగీరథుని అనుసరించి పాతాళమునకు వెళ్ళి ఆతని తాతలగు సగర పుత్రులను ఉద్ధరించుట.
  44. బ్రహ్మదేవుడు భగీరథుని ప్రశంసించి గంగాజలముచే పితృతర్పణము చేయుటకై ఆతనికి అనుజ్ఞ ఇచ్చుట, అదంతయు చేసి భగీరథుడు తన పురమునకు వెళ్ళుట, గంగావతరణోపాఖ్యాన మహిమను వర్ణించుట.
  45. దేవతలును, దైత్యులును కలిసి క్షీరసాగరమును మథించుట, రుద్రుడు హాలాహలవిషమును భక్షించుట, విష్ణువు క్రిందికి దిగబడిన మందర పర్వతమును పాతాళమునుండి ఉద్ధరించుట, దానితో మరల సముద్రమును మథింపగా దాని నుండి ధన్వంతరి, అప్సరసలు, మద్యము, ఉచ్చైశ్శ్రవస్సు అను అశ్వము, కౌస్తుభము, అమృతము ఆవిర్భవించుట. దేవాసురుల మధ్య జరిగిన యుద్ధమునందు దైత్యులు మరణించుట.
  46. పుత్రమరణముచే దుఃఖితురా లగు దితి ఇంద్రుని చంపగల పుత్రుడు లభించుటకై తపస్సు చేయుటకు కశ్యపుని అనుజ్ఞపొంది, కుశప్లవమునందు తపస్సుచేయుట, ఇంద్రుడు ఆమెకు పరిచర్య చేయుట. ఆమె అశుచిగా ఉన్న అదను చూచి అతడు ఆమె గర్భములో ప్రవేశించి గర్భస్థశిశువును ఏడు ముక్కలుగా ఖండించుట.
  47. ఆ విధముగ ఖండింపబడిన తన గర్భస్థశిశువును ఏడుగురు మరుత్తులుగ చేసి స్వర్గమునందు రక్షింపు మని దితి ఇంద్రుని కోరగా అతడు అందులకు అంగీకరించుట. ఆ దితి తపస్సు చేసిన వనమునందే ఇక్ష్వాకుకుమారుడైన విశాలుడు విశాల అను నగరిని నిర్మించుట. ఆ కాలమునందు అక్కడ రాజుగా నున్న సుమతి విశ్వామిత్రుని పూజించుట.
  48. ఆ రాజు సత్కారముల నందికొని రామలక్ష్మణాదిసహితు డగు విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట ఉన్న జనశూన్య మైన ఆశ్రమమును గూర్చి రాముడు ప్రశ్నించగా విశ్వామిత్రుడు గౌతముని భార్యయైన అహల్యకు శాపము ప్రాప్తించిన వృత్తాంతము చెప్పుట.
  49. శాపముచే అండములు పోయిన ఇంద్రునకు పితృదేవతలు మేషాండములు కూర్చుట. శ్రీరాముడు అహల్యను శాపవిముక్తురాలిని చేయుట. అహల్యాగౌతములు శ్రీరాముని సత్కరించుట.
  50. శ్రీరామాదులు మిథిలాపురి చేరుట. జనకుడు విశ్వామిత్రుని పూజించుట. జనకుడు రామలక్ష్మణులను గూర్చి అడుగగా విశ్వామిత్రుడు వారి విషయము చెప్పుట.
  51. శతానందుడు అడుగగా విశ్వామిత్రుడు అతనికి శ్రీరాముడు అహల్యాశాపవిముక్తి కలిగించిన వృత్తాంతము చెప్పుట. మిక్కిలి సంతసించిన శతానందుడు శ్రీరాముని అభినందించి విశ్వామిత్రుని పూర్వవృత్తాంతమును వర్ణించి చెప్పుట.
  52. వసిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును సత్కరించుటకై కావలసిన వస్తువుల నన్నింటిని సృజింపు మని కామధేనువును ఆదేశించుట.
  53. కామధేనువు సృజించిన అన్నపానాదులచే విశ్వామిత్రుడును, ఆతని సైన్యమును బాగుగ సంతృప్తి చెందిన పిమ్మట విశ్వామిత్రుడు కామధేనువును తన కిమ్మని వసిష్ఠుని కోరుట. వసిష్ఠు డాతని కోరికను నిరాకరించుట.
  54. విశ్వామిత్రుడు బలాత్కారమున వసిష్ఠుని ధేనువును అపహరించుటకై ప్రయత్నించుట. తనను విడచుట వసిష్ఠునకు సంమతము కాదను విషయము తెలిసిన కామధేనువు అతని ఆజ్ఞచే శకయవనాదులను సృజింపగా వారు విశ్వామిత్రసైన్యమును సంహరించుట.
  55. విశ్వామిత్రుని నూర్గురు పుత్రులతో సహా సైన్యమంతయు నశించగా ఆతడు తపస్సుచే శివుని ప్రసన్నుని చేసికొని, ఆ శివునివలన దివ్యాస్త్రములు సంపాదించి వాటిని వసిష్ఠాశ్రమముపై ప్రయోగించుట. ఆ అస్త్రములను వారించుటకై వసిష్ఠుడు బ్రహ్మదండమును చేత ధరించి విశ్వామిత్రుని ఎదుటకు వచ్చి నిలచుట.
  56. విశ్వామిత్రుడు వసిష్ఠునిపై వివిధాస్త్రములను ప్రయోగింపగా వసిష్ఠుడు తన బ్రహ్మదండముతో ఆ అస్త్రముల నన్నింటిని శమింపచేయుట. బ్రాహ్మణత్వమును సంపాదించుటకై విశ్వామిత్రుడు తపస్సు చేయ నిశ్చయించుకొనుట.
  57. విశ్వామిత్రుడు తపస్సు చేయుట. సశరీరస్వర్గము పొందుటకై తనచే యజ్ఞము చేయింపవలె నని త్రిశంకువు వసిష్ఠుని ప్రార్థించుట. ఆతడందులకు నిరాకరింపగా త్రిశంకుడు గురుపుత్రులవద్దకు వెళ్ళి తన అభిప్రాయము చెప్పుట.
  58. వసిష్ఠుని కాదని తమవద్దకు వచ్చినందుకు వా రాతనిని నిందించి ఇంటికి వెళ్లు మని చెప్పుట. మరొక గురువు నాశ్రయింతు నని అతడు పలుకగా వారు ఆతనిని శపించుట. వారి శాపముచే చండాలత్వము పొందిన త్రిశంకువు విశ్వామిత్రు నాశ్రయించుట.
  59. విశ్వామిత్రుడు త్రిశంకువునకు ధైర్యము చెప్పి ఆతనిచే యజ్ఞము చేయించుటకై ఋషుల నాహ్వానించుట. తనను అధిక్షేపించిన మహోదయుని, వసిష్ఠపుత్రులను శపించుట.
  60. త్రిశంకువుచే యజ్ఞము చేయింపు డని విశ్వామిత్రుడు కోరగా ఋషులు యజ్ఞము నారంభించుట. త్రిశంకుడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లుట. ఇంద్రుడు త్రిశంకువును స్వర్గమునుండి క్రిందికి త్రోసివేయగా కుపితుడైన విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకమును సృజించుటకు ఉద్యమించుట. దేవతలు ప్రార్థింపగా ఆతడా ఉద్యమమునుండి విరమించుట.
  61. విశ్వామిత్రుడు పుష్కరతీర్థమునందు తపస్సు చేయుట. అంబరీషుడు ఋచీకు డను మునియొక్క మధ్యమపుత్రుని యజ్ఞపశువుగా వెల యిచ్చి కొని తీసికొని వెళ్లుట.
  62. విశ్వామిత్రుడు శునఃశేఫుని రక్షించుట, మరల తపస్సు చేయుట.
  63. విశ్వామిత్రుడు ‘‘మహర్షిత్వమును’’ పొందుట. మేనక ఆతని తపస్సుకు భంగము కలిగించుట. ‘‘బ్రహ్మర్షిత్వము’’ సంపాదించుటకై విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయుట.
  64. తన తపస్సుకు భంగము చేయుటకై వచ్చిన రంభను శపించి విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేసెద నని శపథము చేయుట.
  65. విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయగా ఆతనికి బ్రాహ్మణత్వము లభించుట. జనక మహారాజు విశ్వామిత్రుని ప్రశంసించి, ఆతని అనుజ్ఞ గైకొని తన నివాసమునకు వెళ్లుట.
  66. విశ్వామిత్రుని, రామలక్ష్మణులను తగు రీతి గౌరవించి జనకుడు వారికి శివధనుర్వృ త్తాంతము చెప్పుట. శ్రీరాముడు ధనుస్సునకు నారి కట్టినచో ఆతనికి సీత నిచ్చెద నని జనకుడు తన నిశ్చయమును ప్రకటించుట.
  67. శ్రీరాముడు నారి కట్టి ధనుస్సును లాగగా అది విరిగిపోవుట. విశ్వామిత్రుని ఆజ్ఞచే జనకుడు దశరథుని తీసికొనివచ్చుటకై మంత్రులను పంపుట.
  68. జనకుడు పంపిన వార్త విని దశరథుడు మంత్రిసమేతుడై మిథిలకు వెళ్లుటకై బయలుదేరుట.
  69. సేనాసమేతు డైన దశరథుడు మిథిల చేరగా జనకు డాతనిని సత్కరించుట.
  70. జనకుడు దూతలను పంపి సాంకాశ్యమునుండి తమ్ముడైన కుశధ్వజుని రప్పించుట. దశరథుని కోరిక ననుసరించి వసిష్ఠుడు సూర్యవంశీయరాజులను వర్ణించి రామలక్ష్మణులకొరకై సీతా ఊర్మిళలను వరించుట.
  71. జనకుడు తన వంశమును గూర్చి వర్ణించి చెప్పి శ్రీరామలక్ష్మణులకు సీతా- ఊర్మిళలను ఇచ్చెద నని అంగీకరించుట.
  72. విశ్వామిత్రుడు భరతశత్రుఘ్నులకొరకై కుశధ్వజుని కన్యలను వరించగా జనకు డందుకు అంగీకరించుట. దశరథుడు పుత్రుల మంగళముకొరకై నాందీశ్రాద్ధగోదానాదు లనుష్ఠించుట.
  73. శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నుల వివాహము.
  74. విశ్వామిత్రుడు తన యాశ్రమమునకు వెళ్లిపోవుట. జనకుడు కన్యలకొరకు అత్యధికముగ అరణము నిచ్చుట. దశరథుడు సేనాసమేతుడై తన నగరమున కేగుచుండగా దారిలో పరశురాముడు వచ్చుట.
  75. దశరథుని మాటలను లక్ష్యము చేయక పరశురాముడు శ్రీరామునితో ‘‘నీ వీ వైష్ణవధనుస్సు పై బాణసంధానము చేయుము’’ అని పలుకుట.
  76. శ్రీరాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టి, అమోఘ మైన బాణముతో పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకొనిన పుణ్యలోకములను కొట్టివేయుట. పరశురాముడు తిరిగి మహేంద్రపర్వతము చేరుట.
  77. భార్యాసమేతు లైన పుత్రులతో దశరథుడు అయోధ్యలో ప్రవేశించుట. శత్రుఘ్న సమేతుడై భరతుడు మేనమామ యింటికి వెళ్లుట. శ్రీరాముని సద్గుణములు చూచి ప్రజ లెల్లరు సంతోషించుట. సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము.

భద్రాచల శ్రీ సీతారామలక్ష్మణులు

వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండదండం కరే

చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే,

బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం

కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే.